S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విడుదలకు నోచుకోని సినిమా అంటూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఉండకూడదని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు. థియేటర్లో విడుదల కావడం అనేది నిర్మాణం జరిగిన ప్రతి సినిమా హక్కు అని ఆయన చెప్పారు. పరిశ్రమలో వెయ్యికి పైగా చిత్రాలు విడుదల కాకుండా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఎన్నో ఆశలు పెట్టుకున్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోవడంతో అల్లు అర్జున్ తీవ్ర నిరాశలో ఉన్నాడు. ఆయన తదుపరి సినిమా విషయంలో కాస్త ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. తాజాగా మనం ఫేం విక్రమ్కుమార్తో సినిమాకు ఓకె చెప్పిన అల్లు అర్జున్ వచ్చే నెలనుండి ఆ సినిమా షూటింగ్లో పాల్గొననున్నాడు.
ఈమధ్య సినిమాల్లో బయోపిక్ సినిమాల హవా ఎక్కువైంది. బయోపిక్ సినిమాలు తీయడంలో బాలీవుడ్ ముందుంది. ఇప్పుడు బయోపిక్ సినిమాలంటే ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అటు బాక్స్ఆఫీస్వద్ద కూడా మంచి విజయం అందుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో బయోపిక్ సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. తాజాగా మరో బయోపిక్కు రంగం సిద్ధంఅయింది.
కొంత గ్యాప్ తరువాత మాస్ మహారాజ్ రవితేజ వేగం పెంచాడు. ప్రస్తుతం ఆయన శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ షెడ్యూల్ తరువాత చిత్ర యూనిట్ యుఎస్ వెళ్లనుంది. ఈ చిత్రంతో ఇలియానా మళ్ళీ తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది.
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్గా మాజీ భామ సిమ్రాన్ ను ఎంపిక చేశారు.
రాజశేఖర్-జీవిత పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్ ‘2 స్టేట్స్’ చిత్రంతో హీరోయిన్గా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. కాగా ఆమె ఒక్క తెలుగులోనే కాకుండా, పక్క్భాషలైన తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమల్లోనూ నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమిళంలో విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో శివాని హీరోయిన్గా ఎంపికయ్యారు.
సహజ నటుడు నాని ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్న ‘దేవదాస్’ అనే మల్టీస్టారర్ చిత్రంలో అగ్రహీరో నాగార్జునతో కలిసి నటిస్తున్నాడు. దాంతోపాటు బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్బాస్ 2’కు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఇక వీటితోపాటు త్వరలోనే ‘మళ్ళీరావా’ చిత్ర దర్శకుడు గౌతమ్ తెరకెక్కించే ‘జెర్సీ’ చిత్రంలో నటించనున్నాడు.
హైదరాబాద్: అలనాటి గాయని కె.రాణి (75) కన్నుమూశారు. హైదరాబాద్లో కల్యాణ్నగర్లోని తన పెద్ద కుమార్తె విజయ నివాసంలో శుక్రవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాసు’ చిత్రంలోని ‘అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా..’ పాటతో రాణి ప్రసిద్ధిగాంచారు. తెలుగులో సుమారు 500కు పైగా పాటలు ఆలపించారు. శ్రీలంక జాతీయ గీతాన్ని కూడా ఈమెనే ఆలపించారు.
హైదరాబాద్: సీనియర్ నటుడు వినోద్ (59) కన్నుమూశారు. హీరోగా ప్రస్థానం మొదలుపెట్టి.. ఎన్నో సినిమాల్లో విలన్గాను, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించిన వినోద్ శనివారం తెల్లవారు జాము న 3 గంటల సమయంలో హైదరాబాద్లో బ్రెయిన్ స్ట్రోక్తో తుదిశ్వాస విడిచారు. వినోద్ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు. ఆయన స్వస్థలం తెనాలి. వినోద్ నటించిన మొదటి చిత్రం 1980లో వి.విశే్వశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ‘కీర్తి కాంత కనకం’.
హీరో శర్వానంద్, హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘పడి పడి లేచే మనసు’ కలకత్తా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం కలకత్తాలో 70 రోజుల షూటింగ్ పూర్తిచేసుకున్న అనంతరం నేపాల్లో కొంతభాగం షూటింగ్ జరుపుకోనుంది. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ- ముఖ్య తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు కలకత్తా షెడ్యూల్లో చిత్రీకరించాం. సినిమా బాగా వస్తోంది.