S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమా సంచలన విజయం సాధించడంతోపాటు టాలీవుడ్లో 200 కోట్ల క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ గ్రాసర్గా నిలిచింది. చిట్టిబాబుగా రామ్చరణ్ అదరగొట్టాడు. 1980 నేపథ్యంలో అచ్చతెలుగు పల్లెటూరి కథతో తెరకెక్కిన ఈ సినిమా ఇపుడు మరో ఘనత సాధించింది. ఆస్ట్రేలియాలో జరగనున్న అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్కు ఎంపిక అయ్యింది.
కార్తికేయ, పాయల్ రాజ్పుత్ హీరో హీరోయిన్లుగా కెసిడబ్ల్యు బ్యానర్పై అశోక్రెడ్డి గుమ్మకొండ నిర్మించిన చిత్రం ఆర్ఎక్స్ 100. ఈ చిత్రానికి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. యాన్ ఇన్క్రెడిబుల్ లవ్స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా గురువారం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ను హైదరాబాద్లో జరిపారు. నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఏడాది క్రితం స్క్రిప్ట్తో సినిమా మొదలుపెట్టాం.
మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఇటీవల ‘తేజ్ ఐ లవ్ యు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక వరుస పరాజయాలతో సతమతమవుతున్న తేజు ఈ సినిమాతోనైనా విజయం సాధించి సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడనుకుంటే ఈ చిత్రం కూడా పూర్తిగా నిరాశపరిచింది. ఇక ఈ చిత్ర పరాజయంతో రెండు హ్యాట్రిక్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన తన తరువాతి చిత్రాన్ని ‘నేను శైలజ’ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో చేయనున్నాడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలు కనుమరుగైన సందర్భంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ను వెంకటేశ్, మహేశ్ వంటి స్టార్ హీరోలతో తెరకెక్కించి మల్టీస్టారర్ చిత్రాలకు నాంది పలికిన నిర్మాత దిల్రాజు.. నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. అక్కడినుండి మల్టీస్టారర్ చిత్రాల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి.
మనిషికిగల ఇంద్రియాల్లో చెవులు అత్యంత ముఖ్యమైనవి. చెవులు మెదడుకు గేట్వే లాంటివి. ఒక పసికూన స్కూల్కి వెళ్లి, టీచర్లు చెప్పేది అర్థం చేసుకోవాలంటే.. అప్పటికే ఆ బిడ్డకు సుమారుగా నాలుగున్నరకోట్ల (నాలుగున్నర మిలియన్లు) పదాలు చెవిన పడి ఉండాలి. అంటే ప్రతిరోజూ సుమారు 30 వేల పదాలు వింటూ ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో.. ఒకవేళ పిల్లల్లో వినికిడిపరంగా సమస్యలుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ భవిష్యత్ ఏంటి?
ఐపీఎల్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ క్రికెట్ జట్టుకు అంబాసిడర్గా, ప్రస్తుతం బిజీగా ఉన్న ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ ప్రీతీజింతా మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఓ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రీతిజింతా నటించిన సినిమా ‘్భయ్యాజీ సూపర్హిట్’. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఏడేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల ఇప్పటికి పూర్తిఅయింది.
ప్రస్తుతం మాటీవీలో ప్రసారం అవుతున్న బిగ్బాస్ రియాలిటీ షో రెండో సీజన్ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. నాని హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ షోలో ఇప్పటికే ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఈమధ్య షో క్రేజ్ బాగా తగ్గుతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ షోపై మరింత క్రేజ్ పెంచేలా నిర్వాహకులు క్రేజీ స్టార్స్ని రంగంలోకి దింపే ప్రయత్నాలు చేస్తున్నారు.
బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహూ సినిమా షూటింగ్ ఈ రోజునుండి హైదరాబాద్లో మొదలైంది. మొన్నటివరకు దుబాయ్లోని ప్రముఖ లొకేషన్స్లో దాదాపు రెండు నెలలపాటు షూటింగ్ జరిపారు. అక్కడే 90 కోట్ల భారీ బడ్జెట్తో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా మూడో షెడ్యూల్ ఈ రోజు నుండి హైదరాబాద్లో మొదలైంది.
సమంత ముఖ్యపాత్రలో నటించిన యూ టర్న్ సినిమా టాకీపార్టు పూర్తిచేసుకొని నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రంలో సమంత న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించబోతోంది. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పవన్కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాటల చిత్రీకరణ జరుపుకోనుంది.
నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్బాబు, శ్రీయ కాంబినేషన్లో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘వీరభోగ వసంతరాయలు’. ఈ చిత్రాన్ని బాబా క్రియేషన్స్ పతాకంపై ఎంవికె రెడ్డి సమర్పణలో అప్పరావు బెల్లాన నిర్మిస్తున్నారు. ఆర్.ఇంద్రసేన దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ ఘనంగా జరిగింది.