S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హీరో వరుణ్తేజ్, దర్శకుడు సంకల్ప్రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో వరుణ్తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, అదితిరావు హైదరి కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫస్ట్ ప్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీలో హాలీవుడ్ తరహా స్టంట్స్ ఉండబోతున్నాయి.
సమ్మోహనంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహనం చేసుకున్న హీరో సుధీర్బాబు. సుధీర్బాబు ప్రొడక్షన్స్ బ్యానర్లో దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే. ఈ చిత్రం మొదటి లుక్ పోస్టర్ నుండి ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. నభా నటేశ్ ఈ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అవుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. ఈనెల 14న టీజర్ని విడుదల చేస్తున్నాం.
పేదల గుండె ధైర్యంగా నిలుస్తున్న మనం సైతం మరో ఆపన్నుడిని ఆదుకుంది. డ్రైవర్స్ యూనియన్లో పనిచేస్తున్న పి.రాజు అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆయన చికిత్స కోసం 3 లక్షల రూపాయలు అవసరం అవుతాయని వైద్యులు చెప్పారు. రాజు దీన పరిస్థితి తెలుసుకున్న కాదంబరి కిరణ్ వెంటనే స్పందించారు. ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ ద్వారా 35 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.
ఓరు ఆధార్ లవ్ చిత్రంలో నటించిన మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ పేరు చెబితే దాదాపుగా తెలియనివారుండరు. ఎందుకంటే ఆ చిత్రం షూటింగ్లో వున్న సమయంలో అప్పట్లో విడుదలైన ఒక పాటలో తన కనుసైగలతో యావత్ యువత మొత్తాన్ని కూడా తనవైపునకు తిప్పుకున్న అమ్మాయి ప్రియా ప్రకాష్ వారియర్. తన కనుసైగల వీడియో అప్పట్లో సోషల్ మీడియా మాథ్యమాల్లో పెను సంచలనమే సృష్టించింది.
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. అంటే జీవించినంతకాలం ఒకరినొకరు అర్థం చేసుకుని ఎటువంటి మనస్ఫర్థలు లేకుండా జీవించాలని అర్థం. యువి క్రియేషన్స్, పాకెట్ సినిమావారు కలిసి సుమంత్ అశ్విన్, నిహారికల హ్యాపీ వెడ్డింగ్కి ఈనెల 28గా నిర్ణయించారు. అంతే ఇటు ప్రొడక్షన్ హౌస్లో ప్రమోషన్ కూడా మొదలైంది. త్వరలోనే సాంగ్స్ విడుదల, ప్రీ రిలీజ్ ఫంక్షన్ని అత్యంత గ్రాండ్గా చేయాలని నిర్ణయించారు.
సూపర్ స్టార్ మహేష్బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఇప్పటికే మొదటి షెడ్యూల్ని డెహ్రాడూన్లో షూటింగ్ జరుపుకుంది. తదుపరి షెడ్యూల్కోసం ఫారిన్ బయలుదేరి వెళుతున్నారు. మహేష్తో సినిమాకోసం చాలారోజులు ఎదురుచూసిన వంశీ మహేష్ 25వ సినిమా కావడంతో అత్యంత క్రేజీగా తెరకెక్కించే సన్నాహాలు చేస్తున్నాడు వంశీ. ఇక ఈ సినిమాకు ఏ టైటిల్ పెడతారా అన్న ఆసక్తి ఎక్కువైంది.
‘రోబో’చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కుతున్న 2.0 విడుదలకోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్లు అక్షయ్కుమార్, అమీజాక్సన్ ముఖ్యపాత్రలు పోషించారు. దాదాపు సంవత్సరం పైనే అవుతుంది ఈ చిత్ర షూటింగ్ ముగిసి కానీ విడుదల తేదీని ప్రకటించక పోవడంతో అసలు ఈ చిత్రం ఈ ఏడాది విడుదలవుతుందా అని అనేక సందేహాలు రేకెత్తాయి.
‘మా’ అధ్యక్షులు, ప్రముఖ నటులు శివాజీరాజా తనయుడు విజయ్ రాజా హీరోగా పరిచయమవుతూ రూపొందుతున్న చిత్రం ‘ఏదైనా జరగొచ్చు’. కె.రమాకాంత్ దర్శకత్వంలో వెట్బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కె.రాఘవేంద్రరావు ముహూర్తపు సన్నివేశానికి క్లాప్నివ్వగా, రవిరాజా పినిశెట్టి కెమెరా స్విచాన్చేశారు. హరీష్ శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు.
విజేత.. అప్పట్లో చిరంజీవి హీరోగా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించి చిరంజీవిని విజేతను చేసింది. ఇప్పుడు అదే టైటిల్తో ఆయన చిన్నల్లుడు కళ్యాణ్దేవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. రాకేష్ దర్శకత్వంలో వారాహి చలనచిత్ర బ్యానర్పై తెరకెక్కిన ఈ చిత్రం గురువారం విడుదలవుతున్న సందర్భంగా కళ్యాణ్దేవ్ చెప్పిన విశేషాలు...
హెబ్బాపటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన ‘24 కిస్సెస్’ సినిమా ఫస్ట్లుక్కు, హీరోయిన్ ఇలియానా విడుదల చేసిన టీజర్కు మంచి స్పందన లభించింది. ‘మిణుగురులు’ చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘మిణుగురులు’ చిత్రం విమర్శకుల ప్రసంసలు పొందడమే కాకుండా పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది. సినిమా బాగుంటే ప్రేక్షకులు చిన్న చిత్రాలను ఆదరిస్తున్నారు.