S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రస్తుతం ‘్భరత్ అనే నేను’ సినిమా విజయంతో మంచి జోరుమీదున్న మహేష్ తన తదుపరి చిత్రానికి సన్నాహాలు మొదలుపెట్టాడు. ‘ఊపిరి’ ఫేమ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. గత ఏడాది కాలంగా వంశీ పైడిపల్లి మహేష్ సినిమా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. భరత్ పూర్తయ్యింది కాబట్టి వంశీ షూటింగ్కు సంబంధించిన పనులు చేస్తున్నారు.
సాయిధరమ్తేజ్, అనుపమ పరమేశ్వరన్లు జంటగా ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కరుణాకరన్ దర్శకత్వంలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న చిత్రానికి తేజ్ ఐ లవ్ యూ టైటిల్ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఫస్ట్లుక్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ- సినిమా చాలా బాగా వచ్చింది. సాయిధరమ్ అద్భుతంగా నటించాడు.
యాంగ్రీ యంగ్మెన్గా టాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో రాజశేఖర్ విలన్గా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆ దిశగా చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలిసింది. ఈమధ్యే వరుస పరాజయాలతో కెరీర్ డీలాపడిన రాజశేఖర్ కాస్త గ్యాప్ తీసుకుని చేసిన ‘గరుడవేగ’ సినిమాతో మళ్లీ ఆయన ఫామ్లోకి వచ్చాడు.
యాక్షన్ హీరో గోపీచంద్ చేస్తున్న తాజా చిత్రం ‘పంతం’. నూతన దర్శకుడు కె.చక్రవర్తి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ పోర్షన్ షూటింగ్ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇది పూర్తికాగానే మిగిలిన టాకీపార్ట్, పాటల్ని యూకేలో చిత్రీకరించనున్నారు.
ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ విషయం టాలీవుడ్ను కుదిపేస్తోంది. గాయత్రీగుప్తా, మాధవీలత, శ్రీరెడ్డి సహా పలువురు వర్ధమాన నటీమణులు మాట్లాడుతూ సినిమా అవకాశాలకోసం వచ్చే తెలుగు అమ్మాయిలను కొందరు లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారని, తమ కోరికలు తీరిస్తే కానీ అవకాశాలు ఇవ్వమని బలవంతం చేస్తున్నారు అని ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పెద్ద దుమారం రేపింది.
తెలుగు ప్రేక్షకులకు తనదైన తరహాలో సంగీతాన్ని అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు మిక్కీ జె మేయర్. హ్యాపీడేస్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మనం లాంటి చిత్రాలతో తనదైన ప్రత్యేకతను సంతరించుకున్న మిక్కీ, తాజాగా ‘మహానటి’ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
తాజాగా ‘రంగస్థలం’ సినిమాతో ఘనవిజయాన్ని అందుకున్న రామ్చరణ్ నటిస్తున్న తదుపరి చిత్రం రెండో షెడ్యూల్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మాస్ ఎంటర్టైనర్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. డి.వి.వి.
ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలిగా టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జన్మదినోత్సవం వేడుకలు ఈనెల 4న జరగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలు ఫిలిం చాంబర్లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫిలిం ఛాంబర్ ఆవరణలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
అల్లు అర్జున్ హీరోగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్పై వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘నా పేరుసూర్య నా ఇల్లు ఇండియా’. కె.నాగబాబు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. లగడపాటి శిరీషా శ్రీ్ధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో.. రామ్చరణ్ మాట్లాడుతూ... ‘సినిమా ట్రైలర్ చూశాను.
ఇటీవలే దివంగతురాలైన అతిలోక సుందరి, అందాల నటి శ్రీదేవి జీవితాన్ని తెరపై ఆవిష్కరించేందుకు ఆమె భర్త బోనీకపూర్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.. శ్రీదేవి నట ప్రస్థానం, ప్రేమాయణం, పెళ్లి, గృహిణిగా, తల్లిగా తన బాధ్యతల్ని సమర్ధవంతంగా నిర్వర్తించిన తీరుతో ఆమె జీవితంలోని పలు కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు తెలిసింది.