S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాహుబలితో ఇండియా వైడ్గా సూపర్స్టార్గా మారిన ప్రభాస్ అంటే ఇపుడు ఓ రేంజ్లో క్రేజ్ నెలకొంది. ఆయనతో సినిమాలు చేసేందుకు పలు భాషలకు చెందిన దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్లో ఓ సినిమాకు గ్రీన్సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం అత్యంత భారీగా తెరకెక్కుతున్న ‘సాహో’ చిత్రంలో నటిస్తున్నాడు ప్రభాస్.
అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో కె.నాగబాబు సమర్పణలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్పై లగడపాటి శిరీషా శ్రీ్ధర్ నిర్మిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. యాక్షన్కింగ్ అర్జున్, శరత్కుమార్లు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకొని మే 4న విడుదలకు సిద్ధమైంది.
యువ హీరో రామ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్పై తెరకెక్కనున్న చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత స్రవంతి రవికిశోర్ మాట్లాడుతూ- ఈరోజు ఈ చిత్రాన్ని నిరాడంబరంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించాం. మే 7 నుంచి జార్జియాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. ఆ నెలాఖరువరకూ తొలి షెడ్యూల్ జరుగుతుంది.
దిల్రాజుతో కలిసి ప్రయాణం చేయడంవల్ల చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. నిర్మాతగా నా ప్రస్థానానికి మార్గదర్శకాలు అవుతున్నాయని అంటున్నాడు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. 2006లో ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ సినిమాతో నిర్మాతగా తెలుగు పరిశ్రమలోకి ప్రవేశించిన ఆయన సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం నూతన నటీనటులతో ‘హుషారు’ పేరుతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
మహానటి సావిత్రి జీవిత కథతో తెరకెక్కుతున్న చిత్రం ‘మహానటి’. కీర్తి సురేష్, సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ప్రియాంకాదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. మే 1న పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం తమిళంలో భిన్నమైన పాత్రలు చేస్తూ మరోవైపు స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఆయన రజనీకాంత్కు విలన్గా మారాడట. ఆ వివరాల్లోకి వెళితే.. సూపర్స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం రోబో 2.0, కాలా చిత్రాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాల తరువాత పిజ్జా దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో నటించనున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్లో స్పీడ్గా స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన రకుల్ప్రీత్సింగ్ కేవలం నాలుగేళ్లలో స్టార్ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్గా దుమ్మురేపింది. ఈమధ్యే వరుస పరాజయాలతో డీలాపడిన ఈ భామకు అవకాశాలు తగ్గాయి. ఇప్పటికే కొత్త సినిమా అవకాశాలు రావడంలేదు. దాంతో ఖాళీగా వుండేకంటే వేరే భాషలో సినిమాలు చేసుకోవడం బెటర్ అని నిర్ణయించుకుంటున్నట్టుంది. అందుకే కన్నడంలో సినిమాలు చేసేందుకు రెడీ అయ్యింది.
నందమూరి కల్యాణ్రామ్, నివేదా థామస్, షాలినీ పాండే హీరో హీరోయిన్లుగా ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కొత్త చిత్రం బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. కె.వి.గుహన్ దర్శకత్వంలో మహేశ్ కోనేరు సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్నివ్వగా నందమూరి హరికృష్ణ కెమెరా స్విచ్చాన్ చేశారు. నందమూరి రామకృష్ణ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన ‘భరత్ అనే నేను’ ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఈ చిత్రంలో తొలిసారిగా మహేష్బాబు ముఖ్యమంత్రి క్యారెక్టర్ని పోషించారు. ఈ సినిమాను చూసి వ్యక్తిగతంగా ఎంతగానో ఎంజాయ్ చేశానని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. మీరు నన్ను సర్ప్రైజ్ చేయడానికి వచ్చారు.
ఒకప్పుడు బోల్డ్ బ్యూటీగా పేరొందిన సుమా రంగనాథన్ (సుమన్ రంగనాథన్) ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూనే వున్నారు. ఆమె నటించిన ‘మైనా, ‘నీర్ దోసే’ చిత్రాలు ఇటీవల విశేషాదరణ పొందాయి. కన్నడ నాట తన తడాఖా చూపిస్తోన్న ఈమె ‘దండుపాళ్యం-4’లోనూ విలక్షణమైన పాత్రను పోషించారు. ఈ చిత్రానికి దండుపాళ్యం ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు.