S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/15/2018 - 20:44

దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆకాష్ పూరి హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘మెహబూబా’. ఈ చిత్రానికి సందీప్ చౌతా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను కృష్ణార్జునయుద్ధం చిత్రంతోపాటు ప్రదర్శించనున్నారు. 1700కిపైగా స్క్రీన్స్‌లో ‘మెహబూబా’ ట్రైలర్‌ను ప్రదర్శించనున్నారు.

04/15/2018 - 20:42

నాగార్జున కెరీర్‌లో పెద్ద హిట్ అయిన ‘అల్లరి అల్లుడు’ చిత్రంలోని ‘నిన్ను రోడ్డుమీద చూసినది లగాయిత్తు’ అనే సాంగ్ ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ మాస్ సాంగ్‌ను యువ సామ్రాట్ నాగచైతన్య తన తాజా చిత్రం ‘సవ్యసాచి’లో రీమిక్స్ చేస్తున్నాడు.

04/13/2018 - 21:54

అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. కె.నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌లో శిరీషాశ్రీ్ధర్ నిర్మాతగా, బన్నీవాసు సహ నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో యాక్షన్‌కింగ్ అర్జున్, శరత్‌కుమార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

04/13/2018 - 21:43

‘రంగస్థలం’ చిత్రంతో భారీ బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు రామ్‌చరణ్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పటికే రూ.100 కోట్ల షేర్‌ను దాటిపోయింది. చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ఒక సినిమా చేస్తున్నారు. చరణ్ లేకుండానే ఒక షెడ్యూల్ పూర్తిచేసిన బోయపాటి మరో షెడ్యూల్‌ను ఈనెలాఖరు నుండి మొదలుపెడతారట. ఈ షూట్లో చరణ్ కూడ పాల్గొనబోతున్నాడు.

04/13/2018 - 21:44

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ఫిలిం ఛాంబర్, డైరెక్టర్స్ అసోసియేషన్, మా అసోసియేషన్ పెద్దలు వర్థమాన నటి శ్రీరెడ్డి విషయాన్ని పునఃపరిశీలించమని సలహా ఇచ్చారని మా అధ్యక్షుడు శివాజీరాజా మీడియా సమావేశంలో తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలించేవరకూ శ్రీరెడ్డితో ‘మా’ సభ్యులు యథాతథంగా పనిచేయవచ్చని శివాజీరాజా ప్రకటించారు.

04/13/2018 - 21:28

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘మహానటి’. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ప్రియాంక దత్ నిర్మాత.

04/13/2018 - 21:48

యంగ్ టైగర్ ఎన్టీఆర్-క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్‌లో మొదలైంది. వీరిద్దరి సినిమా అనగానే అటు ప్రేక్షకులతోపాటు ఇటు సినీ జనాల్లోకూడా ఆసక్తినెలకొంది. గత ఏడాది అక్టోబర్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయినా ఈ సినిమా నేటినుండి ఈనెల 24వరకు ఫిలిం సిటీలో షూటింగ్ జరపనున్నారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణతో షూటింగ్ మొదలెట్టేసాడు.

04/13/2018 - 21:26

ఈమధ్య సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఏదయ్యా అంటే.. అందరు చెప్పేది ప్రియావారియర్ గురించే. ఈ సినిమా ట్రైలర్‌లో ఈ అమ్మడు కన్నుగీటి... అందరి హృదయాలను బద్దలుకొట్టింది. ‘ఓరు ఆధార్ లవ్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమా సెట్స్‌లో ఉండగానే ఈ రేంజ్‌లో క్రేజ్‌రావడం మామూలు విషయం కాదు. ఇక ఈ అమ్మడితో సినిమాలు తీయడానికి పలు భాషల దర్శక నిర్మాతలు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.

04/13/2018 - 21:46

నందు, సౌమ్య వేణుగోపాల్, పూజా రామచంద్రన్ ముఖ్య తారాగణంలో హరహర చలనచిత్ర సమర్పణలో ఎస్.శ్రీకాంత్‌రెడ్డి, రామ్మోహన్‌రావు ఇప్పిలి నిర్మాతలుగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఇంతలో ఎనె్నన్ని వింతలో’. ఈ చిత్రం ఇటీవల విడుదలై సక్సెస్ బాటలో పయనిస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత రామ్మోహన్‌రావు ఇప్పిలి చెప్పిన విశేషాలు..
* ప్రొడక్షన్ ఎలా స్టార్ట్ చేశారు...?

04/13/2018 - 21:51

టాలీవుడ్‌లో అత్త పాత్రకు కొదవే లేదు. ఒకప్పుడైతే అత్తకు.. అల్లుడికి మధ్య గట్టి పోరు ఉండేది. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమాలు మంచి విజయాలుగా నిలవడంతో అత్త పాత్రలకు క్రేజ్ దక్కింది. అంతకంటే మరో అడుగు ముందుకేస్తే.. అసలు అత్త పాత్ర అనగానే సూర్యకాంతం గుర్తొచ్చే రేంజ్‌లో ఆమె ఆయా పాత్రల్లో జీవించేసింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో మళ్లీ అత్త పాత్రలకు గిరాకీ బాగా పెరిగింది.

Pages