S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
రంగస్థలం సినిమా తరువాత క్రేజీ దర్శకుడు సుకుమార్కు మరో బంపర్ ఆఫర్ దక్కింది. ఆయనకు సూపర్స్టార్ మహేష్బాబు నెక్స్ట్ సినిమా చేసేందుకు ఓకె చెప్పాడట. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘1 నేనొక్కడినే’ సినిమా కమర్షియల్గా సక్సెస్ సాధించకపోయినా సూపర్ టెక్నికల్ మూవీగా గుర్తింపు దక్కింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే సుకుమార్ టాలెంట్ నచ్చి మహేష్ మరోసారి ఆయనతో సినిమాకు సిద్ధం అయ్యాడు.
సాయిధరమ్తేజ్ ప్రస్తుతం ‘తొలిప్రేమ’ ఫేం కరుణాకరన్తో ఒక సినిమా చేస్తున్నాడు. పెద్దగా యాక్షన్ లేకుండా పూర్తిస్థాయి లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తేజ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
‘‘మొత్తం మీరే చేశారు.. మొత్తం మీరే చేశారు..!’’ అంటూ తెలుగులో హీరోగా ఓ రేంజ్ ఇమేజ్ దక్కించుకున్న సిద్ధార్థ్కు ‘బొమ్మరిల్లు’ బ్లాక్బస్టర్ విజయాన్ని అందించింది. ఆ ఒక్క సినిమాతో తెలుగులో స్టార్ ఇమేజ్ అందుకున్న సిద్ధార్థ్ ఆ తరువాత చాలా చిత్రాలు చేశాడు. ఈమధ్య వరుస పరాజయాలతో కెరీర్ వెనక్కి తగ్గింది. ప్రస్తుతం అవకాశాలు తగ్గిన సిద్ధార్థ్.. ఇప్పుడు ప్రతినాయకుడిగా రీఎంట్రీ ప్రయత్నాల్లో ఉన్నాడు.
అక్కినేని నాగచైతన్య తాజా చిత్రం సవ్యసాచి.. ఫుల్ పేస్లో షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్గా తన భార్యతో కలిసి అమెరికా ట్రిప్ వేసొచ్చిన చైతు.. ఇపుడు సవ్యసాచి షూటింగ్లో రెగ్యులర్గా పాల్గొంటున్నాడు. జూన్ నెలలో విడుదల టార్గెట్ పెట్టుకోవడంతో.. ఈ లక్ష్యాన్ని అందుకునేందుకు చకచకా పనులు ఫినిష్ చేస్తున్నాడు. సవ్యసాచి అంటే నిజానికి అర్జునుడు అనే సంగతి తెలిసిందే.
బాహుబలిలో అవంతికగా తనదైన నటనతో ఆకట్టుకున్న మిల్కీ భామ తమన్నాకు ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే ఎక్స్లెన్స్ అవార్డు దక్కింది. ఇప్పటికే బాలీవుడ్ నటీనటులు అనుష్క శర్మ, రణ్వీర్సింగ్లను ఈ అవార్డుతో సత్కరించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా తమన్నా పేరు కూడా చేర్చారు. రాజవౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎన్నో అవార్డులతోపాటు రివార్డులను అందుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్లో ఆసక్తి రేపుతున్న టైటిల్ సైంధవ. ‘్ఛలో’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగశౌర్య హీరోగా నటించే తదుపరి చిత్రానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. నూతన దర్శకుడు తెరకెక్కించే ఈ సినిమాకు సైంధవుడు అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
బాలీవుడ్ బార్బీ గర్ల్ కత్రినా కైఫ్ పెళ్లికూతురయ్యారు. అంటే ఈమె పెళ్లి చేసుకోబోతున్నారని అనుకోకండి. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ‘టైగర్ జిందా హై’ చిత్రంతో మంచి హిట్ అందుకున్న కత్రినా కైఫ్, ప్రస్తుతం ‘్థగ్స్ ఆఫ్ హిందూస్తాన్‘, ‘జీరో’ చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే జీరోలో కత్రినా విభిన్న పాత్రలో కనిపిస్తారని సినీ వర్గంలో ప్రచారం జరుగుతవోంది.
విష్ణు మంచు హీరోగా నటించిన ‘ఆచారి అమెరికాయాత్ర’ చిత్రం ఏప్రిల్ 27న విడుదల కానుంది. చిత్ర ట్రైలర్కు అద్భుత స్పందన రాగా, ఎస్ఎస్ తమన్ స్వరపరిచిన పాటలు సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఈ చిత్రానికి జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వం వహించారు. విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిల కలయికలో ‘దేనికైనారెడీ’, ‘ఈడోరకం ఆడో రకం’ వంటి సూపర్ హిట్ కామెడీ చిత్రాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించడంకోసం తెలుగు సినీ రంగం ఏకతాటిపైకి రావాలని నిర్మాత నట్టికుమార్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని ఐదుకోట్ల మంది ప్రజలు మనం తీస్తున్న సినిమాలను చూస్తున్నారని, అలాంటి ప్రజలు లేకుంటే మనం లేమని, మన ఎదుగుదలకు, ఇంత పేరురావడానికి ప్రేక్షక దేవుళ్లే కారణమని..
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈనెల 13న ఈ సినిమాలోని మూడో సాంగ్ని విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా తరువాత అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న ఆసక్తినెలకొంది. ఇప్పటికే క్షణం దర్శకుడితో సినిమా ఉంటుందని వార్తలు వస్తుండగా..