S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రియేటివ్ దర్శకుడిగా టాలీవుడ్లో ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న దర్శకుడు కృష్ణవంశీ. ఆయన సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ఆయన సినిమాలంటే అచ్చమైన తెలుగింటి కథలతో కనిపించేవి, సజీవ పాత్రలతో తనదైన మేకింగ్తో సినిమాలు రూపొందించేవారు. ఈమధ్యే నక్షత్రం సినిమాతో పరాజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఈసారి ఓ హారర్ థ్రిల్లర్తో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు.
అల్లు అర్జున్ ఎప్పుడూ కూడా ఒక సినిమాపైనే పూర్తి దృష్టి పెడతాడు. దాని అవుట్పుట్ విషయంలో సంతృప్తిచెందిన తరువాతనే ఆయన రిలీజ్కి వెళ్లడానికి ఓకే చెబుతాడు. ముందుగా చేస్తోన్న సినిమా ముగింపుదశకి చేరుకుంటూ ఉండగా ఆయన మరో సినిమాను సెట్ చేసుకుంటాడు. అలా ‘నా పేరు సూర్య’ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా, అల్లుఅర్జున్ తదుపరి చిత్రానికి సంబంధించిన వార్తలు బయటికి వస్తున్నాయి.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడి ఈమెకు తెలిసినట్టు లేదు. అందుకే లేటు వయసులో ఘాటు ఫోజులతో జనాలకి పిచ్చెక్కిస్తోంది. ఈమధ్య అందాల భామలు గ్లామర్ని ఆయుధంగా చేసుకొని సోషల్ మీడియాలో బికినీలు, టూపీస్లంటూ ఓ రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇపుడు ఈ మాజీ భామ కూడా అదే బాట పట్టింది.
హీరోయిజం చూపించడమే హీరో లక్షణం కాదు. ఏ పాత్ర లోనయినా ఇట్టే ఒదిగిపోవాలి. డ్యాన్స్లు, ఫైట్స్, డైలాగ్స్ వాటిల్లోనే కాకుండా అమాయకత్వం (ఇన్నోసెంట్)గా కూడా నటించడం అంతకంటే గొప్ప. అమాయకత్వంగా నటించారంటే కళ్లలో హావభావాల్లో, బాడీ లాంగ్వేజిలో ప్రస్ఫుటంగా ఆ సున్నిత్వం కన్పించాలి. అలాంటి హీరోలు నటించిన చిత్రాలు గత మూడునాలుగు దశాబ్దాలుగా మనముందు కదలాడుతున్నాయి.
తెలుగు ప్రేక్షకులకు తమిళ హీరో కార్తి కొత్తేమీ కాదు. ఆయన నటించే సినిమాలకు తెలుగునాట కూడా మంచి మార్కెట్ ఉంటుంది. అందుకే ఈసారి ఆయన స్ట్రయిట్ తెలుగు సినిమా చేయాలని భావిస్తున్నారట. అదికూడ ఇటీవలే ‘నీది నాది ఒకే కథ’ చిత్రంతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు వేణు ఊడుగుల దర్శకత్వంలో కావడం విశేషం.
యువ హీరో శర్వానంద్ తాజాగా నటిస్తున్న చిత్రంఇటీవల వైజాగ్లో ప్రారంభమైంది. సుధీర్వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శర్వా గ్యాంగ్స్టర్గా కనిపిస్తాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజాగ్తోపాటు కాకినాడలో కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ జరిపి ఆ తదుపరి షెడ్యూల్ను హైదరాబాద్లో జరుపుతారట.
లక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దర్శకుడు రవిచరణ్ రూపొందిస్తున్న చిత్రం మైత్రివనం. ఫీనిక్స్ ఎల్ వీ ఈ చిత్రానికి ఉపశీర్షిక. విశ్వ, కిషోర్, వృషాలీ, హర్షదా పాటిల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుఖేష్ ఈశ్వర్ నిర్మాత. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది.
‘భరత్ అనే నేను’ సినిమా చివరి షెడ్యూల్ స్పెయిన్లో పూర్తయ్యింది. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ హైదరాబాద్ తిరిగి రావడం జరిగింది. ప్రస్తుతం ఏప్రిల్ 7న హైదరాబాద్లో జరిగే ప్రీ రిలీజ్ వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు యూనిట్ సభ్యులు. ఖైరా అద్వాని హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమాలో ప్రకాష్రాజ్ విలన్గా కనిపించబోతున్నాడు. ‘భరత్ అనే నేను’ సినిమా నుండి ఇప్పటికే మూడో పాటను విడుదల చేసారు.
సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉంది. ఈ సినిమాలో కేథరిన్ హీరోయిన్గా నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు కీర్తి సురేష్ను ఈ సినిమాకోసం అడిగినట్లు తెలుస్తోంది. మొదటిసారి కీర్తిసురేష్ రవితేజతో నటిస్తుండడం విశేషం. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమా తమిళ్లో విజయం సాధించిన తెరి సినిమాకు రీమేక్గా రూపొందించబడుతోంది.
ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై కళ్యాణ్కృష్ణ కురసాల దర్శకత్వంలో మాస్ మహారాజా ‘రవితేజ’ హీరోగా క్లాస్ మాస్ అంశాల మేళవింపుతో ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ‘నేల టిక్కెట్టు’ సినిమాకి సంబంధించిన పాటల చిత్రీకరణ నృత్య దర్శకుడు రాజసుందరం నేతృత్వంలో గండిపేటలోని భారతదేశ మొట్టమొదటి స్కైజోన్ ట్రాం పోలిస్ పార్కులో మూడురోజులుగా జరుగుతుంది.