S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మలయాళంలో దాదాపు 500కుపైగా చిత్రాల్లో నటించిన కొల్లం అజిత్ (56) గురువారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొచ్చీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 1983లో ‘పరన్ను పరన్ను పరన్ను’ సినిమాతో ఇండస్ట్రీలోకి ప్రవేశించిన కొల్లం అజిత్ చాలా చిత్రాల్లో విలన్గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న క్రేజీ బయోపిక్ చిత్రం ఎన్టీఆర్. ఎన్.టి.రామారావు జీవిత కథతో తేజ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రంలో మరో నటుడు రాజశేఖర్ కూడా కీలక పాత్ర పోషించనున్నారట. బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నికిషా పటేల్, గుర్లిన్ చోప్రా, ముకుల్దేవ్ ముఖ్య తారాగణంగా జానీ దర్శకత్వంలో ఎ.ఆర్.ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘రౌడీ పోలీస్’. ప్రస్తుతం హైదరాబాద్లో చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పోరాట సన్నివేశాలను ఫైట్ మాస్టర్ కృష్ణం రాజు నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు.
అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీషా శ్రీ్ధర్ నిర్మిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’. బన్నీ వాసు సహనిర్మాత. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
సూపర్స్టార్ మహేష్బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘్భరత్ అనే నేను’ చిత్రం ఈనెల 20న విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. డి.వి.వి.క్రియేషన్స్ బ్యానర్పై డి.వి. వి.దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలోని రెండు పాటలను ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా నేడు సాయంత్రం ‘వచ్చాడోయ్ సామి’ అని సాగే పాటను విడుదల చేస్తున్నారు.
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా నటించిన రంగస్థలం యునానిమస్గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో రామ్చరణ్ నటనతో అదరగొట్టాడని అంటున్నారు ప్రేక్షకులు. ఇక మెగా అభిమానులకైతే ఆనందానికి హద్దులే లేవు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రెండో షెడ్యూల్ ఏప్రిల్ 10 నుండి మొదలుకానుందట.
సీనియర్ నటుడిగా సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోగా ఓ రేంజ్ ఇమేజ్ తెచ్చుకున్న ఆయన, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలు చేస్తూ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆయన ‘సత్యా గ్యాంగ్’ నటిస్తున్నాడు. ప్రభాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా సుమన్ చెప్పిన విశేషాలు... దర్శకుడు ప్రభాస్ ఈ కథ చెప్పాడు. కథలో విషయం వుందనిపించింది.
కెరీర్ ప్రారంభం నుండి భిన్నమైన పాత్రల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజా రామచంద్రన్. స్వతహాగా మలయాళీ అయిన పూజ స్వామిరారా.. సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది. ఆ తరువాత త్రిపుర, గంగ, లవ్ ఫెయిల్యూర్, దేవిశ్రీప్రసాద్ వంటి చిత్రాల్లో నటించి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా నందు, సౌమ్యా వేణుగోపాల్ జంటగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇంతలో ఎనె్నన్ని వింతలో’ చిత్రంలో నటించింది.
రామ్చరణ్తో అత్తా అని పిలిపించుకోవాలా? అని చాలా ఆలోచించాను. నిజానికి ఈ కథ విన్నప్పుడు అందులో రామ్చరణ్ హీరో అని తెలియదని అంటోంది రంగమ్మత్త అలియాస్ అనసూయ. బుల్లితెరపై గ్లామర్ యాంకర్గా సంచలనం రేపిన అనసూయకు ఓ రేంజ్ ఫాలోయింగ్ వుంది. ఇక నటిగా సెలెక్టివ్గా పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది.
బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ చిత్రం సాహో! ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తిచేసుకున్న ఈ చిత్రంలోని మేజర్ షెడ్యూల్ను దుబాయ్లో మొదలుపెట్టారు. నిజానికి ఈ షెడ్యూల్ నెల క్రితమే జరగాల్సి వుండగా, అప్పుడు పర్మిషన్లు రాకపోవడంతో ఈలోగా ఓ షెడ్యూల్ను హైదరాబాద్లో చిత్రీకరించారు. తాజాగా మూడో షెడ్యూల్ దుబాయ్లోని అబూదబిలో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు.