S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫొటోను అమితాబ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చిరంజీవి సినిమాలో నటించడం గౌరవంగా వుందంటూ కామెంట్ పెట్టారు.
కార్తి, సందీప్, చలం, సన్నీ హీరోలుగా ప్రియా, అగస్టీన్, చైత్ర, రుచిర, శశి హీరోయిన్లుగా నాగార్జున సినీ క్రియేషన్స్ పతాకంపై శ్రీరంగం సతీష్కుమార్ స్వీయ దర్శకత్వంలో రూపొందే 4 ఇడియెట్స్ చిత్రం మంగళవారం హైదరాబాద్లో ప్రారంభమైంది.
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తిచేసుకుంది. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శ్రీ్ధర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 15న జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు.
క్రికెట్ అనేది మన రక్తంలో, నరనరాల్లో జీర్ణించుకుపోయి వుందని హీరో ఎన్టీఆర్ అన్నారు. ఆయన ఐపిఎల్ 11వ సీజన్లో భాగంగా ఈ నెల 7 నుండి ప్రారంభంకానుంది. ఈ ఐపిఎల్కు తెలుగు బ్రాండ్ అంబాసిడర్గా ఎన్టిఆర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో జరిగిన ప్రమోషన్ ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ- క్రికెట్ను ఆస్థిలా పెద్దలు పిల్లలకు వారసత్వంగా ఇస్తున్నారు. క్రీడలు ఒక లాంగ్వేజిలాగా కూడా పనికివస్తాయి.
హీరోయిన్గా బాలీవుడ్లో కెరీర్ మొదలుపెట్టి చాలాకాలం అవుతున్నా కూడా ఈమెకు సరైన సక్సెస్ దక్కలేదు. దాంతో పూరి జగన్నాధ్ రూపొందించిన ‘హర్ట్ఎటాక్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఆదాశర్మ. అందంగా అమాయకంగా కనిపించే ఈభామకు మొదట్లో రెండు, మూడు అవకాశాలైతే వచ్చాయి కానీ సక్సెస్ మాత్రం దక్కలేదు. దాంతో అవకాశాలు తగ్గాయి. ఇప్పటికే అవకాశాలకోసం ఎదురుచూస్తున్న ఈమె, ఈమధ్య గ్లామర్ షోలతో షాకులిస్తోంది.
మెగా పవర్స్టార్ రామ్చరణ్ కధానాయకుడిగా నటించిన ‘రంగస్థలం’ ఇటీవల విడుదలై భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో చిత్ర యూనిట్ థాంక్స్ మీట్ను ఏర్పాటుచేసి సక్సెస్ చేసిన ప్రేక్షకాభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే. ఇందులో చిట్టిబాబు (రామ్చరణ్) అన్నయ్య పాత్రలో నటించిన కుమార్ బాబు (ఆది పినిశెట్టి) తన బిజీ షెడ్యూల్ కారణంగా వేడుకకు హాజరుకాలేకపోయారు.
రామ్చరణ్, సమంత జంటగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై సుకుమార్ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, సివిఎం (మోహన్) నిర్మించిన చిత్రం ‘రంగస్థలం’. మార్చి 30న సినిమా విడుదలై మంచి విజయాన్ని సాధించిన సందర్భంగా చిత్ర యూనిట్ సోమవారం హైదరాబాద్లో థాంక్స్మీట్ను నిర్వహించింది. ఈ సందర్భంగా.. రామ్చరణ్ మాట్లాడుతూ.. ‘సుకుమార్కి థాంక్స్. మమ్మల్ని నమ్మి తను ఓ క్రేజీ మిషన్ను మా భుజాలపై పెట్టాడు.
సూపర్స్టార్ మహేష్బాబు, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో శ్రీమతి డి.పార్వతి సమర్పణలో డి.వి.వి ఎంటర్టైన్మెంట్ పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య డి.వి.వి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘్భరత్ అనే నేను’. ఈ చిత్రం ఈనెల 20న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటి వరకు రెండు పాటలు విడుదలయ్యాయి.
నితిన్, మేఘా ఆకాష్ జంటగా కృష్ణచైతన్య దర్శకత్వంలో పవన్కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘చల్ మోహన్రంగ’. ఈ చిత్రం ఈనెల 5న విడుదలవుతున్న సందర్భంగా ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని క్లీన్ యూ సర్ట్ఫికెట్ పొందింది. ఈ సందర్భంగా దర్శకుడు వివరాలు తెలియజేస్తూ- త్రివిక్రమ్ కథ అందించిన ఈ చిత్రం పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కించాం.
ఆంధ్రప్రదేశ్లో మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) క్రమంగా బలపడుతోంది. హైదరాబాద్లో ‘మా’ ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో భారత ట్రేడ్ యూనియన్ చట్టం 1926 ప్రకారంగా ‘మా’-ఏపీని అధికారికంగా రిజిస్టర్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రార్ ఈ మేరకు హెచ్-196 నంబర్తో ‘మా’ ఏపీకు 2018 ఫిబ్రవరి 2న రిజిస్ట్రేషన్ చేశారు.