S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన 36వ సినిమాను ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితమే షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుని 2వ షెడ్యూల్ను జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్ కోసం చెన్నైలో భారీ సెట్ను కూడా వేశారు. ప్రేక్షకుల్లో మంచి అంచనాల్ని క్రియేట్ చేసిన ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ను మార్చి 5వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ప్రభుదేవా, హన్సిక జంటగా సీనియర్ నటి రేవతి ముఖ్య పాత్రలో కళ్యాణ్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన గులేబకావళి చిత్రం మంచి విజయం సాధించింది. ఆ చిత్రాన్ని అదే పేరుతో సుర ఎంటర్టైన్మెంట్ బ్యానర్తో మల్కాపురం శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
దండుపాళ్యం తెలుగు, కన్నడ భాషల్లో సీక్వెల్స్గా విడుదలయి సంచలన విజయం సాధించిన దండుపాళ్యం చిత్రం ప్రేక్షకులను కొత్త అనుభూతికి లోను చేసింది. శ్రీనివాసరాజు దర్శకత్వంలో పూజా గాంధీ, మకరంద్ దేశ్పాండే, రవికాలే, రవిశంకర్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని సీక్వెల్స్గా దండుపాళ్యం 2, దండుపాళ్యం 3 భాగాలుగా రూపొందించారు. త్వరలోనే మూడో భాగం విడుదలవుతుంది.
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా నటిస్తున్న రంగస్థలం ఈనెల 30న విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత ఈ జోడి మరోసారి కలిసి నటించేందుకు రంగం సిద్ధం అవుతోంది. అవును. వివరాల్లోకి వెళితే.. రంగస్థలం తరువాత ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
వ్యాంకిష్ మీడియా పతాకంపై, ఆయూష్, వర్ణిక హీరో హీరోయిన్లుగా రవి కుమార్ పొన్నగంటి దర్శకత్వంలో షేక్ గౌస్ నిర్మిస్తున్న నూతన చిత్రం గుంటూరులో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎంఎల్ఏ క్లాప్నివ్వగా, వై.టి.నాయుడు (ఎడిషనల్ ఎస్పి, గుంటూరు అర్బన్) ఫస్ట్ షాట్కు గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాత షేక్ గౌస్ కెమెరా స్విచ్చాన్ చేశారు.
నందమూరి బాలకృష్ణ తన 103వ సినిమా కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. నిజానికి ఆయన ఎన్టీఆర్ బయోపిక్ చేయాలని ప్లాన్ చేశాడు కానీ దర్శకుడు తేజ వేరే సినిమా విషయంలో బిజీగా ఉండడంతో ఈలోగా మరో సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నాడట. అయితే ఇప్పటికే పలువురు దర్శకులు ఆయనతో కథాచర్చలు జరుపుతున్నారు. తాజాగా కుర్ర దర్శకుడు అనిల్ రావిపూడి కూడా బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధంగా వున్నాడు.
వెంకట్ మూవీస్ బ్యానర్పై కె.టి.నాయక్ దర్శకత్వంలో వెంకట్ నిర్మిస్తున్న చిత్రం ‘దండుపాళ్యం 4’. ఈ సినిమా షూటింగ్ మార్చి 8న ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత వెంకట్ మాట్లాడుతూ ‘దండుపాళ్యం పార్ట్1, పార్ట్2లను తెలుగు ప్రజలు ఆదరించారు. వారిచ్చిన స్ఫూర్తితో దండుపాళ్యం 4ను ప్రారంభించాం. దండుపాళ్యంపై క్రేజ్ రోజురోజుకీ పెరుగుతుంది.
గత ఏడాది పెళ్లిచూపులు సినిమాతో సంచలన విజయాన్ని అందుకుని దర్శకుడిగా మంచి ఎంట్రీ ఇచ్చాడు తరుణ్ భాస్కర్. ఆ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్న తరుణ్ భాస్కర్, ప్రస్తుతం కొత్త నటీనటులతో ‘ఈ నగరానికి ఏమైంది’ టైటిల్తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ జరుపుకున్న ఈ చిత్రం రోడ్డు జర్నీ నేపథ్యంలో ఉంటుందట.
హీరో నిఖిల్ కెరీర్లో చాలాకాలం గ్యాప్ తరువాత రీమేక్ సినిమా చేశాడు. కన్నడలో సూపర్హిట్ అయిన ‘కిరాక్ పార్టీ’ని తెలుగు వెర్షన్లో నటించాడు. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కిరాక్ పార్టీ తరువాత కూడా నిఖిల్ మళ్లీ రీమేక్ సినిమాయే చేయబోతున్నాడు. తమిళంలో హిట్టయిన కణితన్ మూవీలో నటిస్తున్నాడు. కణితన్ రీమేక్లో హీరోయిన్గా ఎవరిని తీసుకోవాలనే దానిపై ఆ సినిమా టీం చాలా రోజులుగా కుస్తీ పడుతోంది.
‘క్షణం’ లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గూఢచారి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్ విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. అడివి శేష్ ఈ చిత్రానికి కథ సమకూర్చగా, మిస్ ఇండియా తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ళ కథానాయికకా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ అమెరికాలో జరుగుతోంది.