S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వరుస పరాజయాలతో సతమతమైన రాజశేఖర్కు కొంత గ్యాప్ తరువాత చేసిన ‘గరుడవేగ’ మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ సినిమా రాజశేఖర్ కెరీర్లో మంచి వసూళ్లను అందించింది. దాంతో మళ్లీ స్పీడ్ పెంచిన రాజశేఖర్ వరుస సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గోపీ అనే కొత్త దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.
తెలుగులో మొదలైన మల్టీస్టారర్ సినిమాలకు మంచి క్రేజ్ దక్కుతోంది. ఇప్పటికే మల్టీస్టారర్ చేయడానికి పలువురు హీరోలు సిద్ధంగా వున్నారు. ప్రస్తుతం నాగార్జున-నానిల కాంబినేషన్లో ఓ క్రేజీ మల్టీస్టారర్కు రంగం సిద్ధమైంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ నిర్మిస్తారని తెలిసింది.
నందమూరి బాలకృష్ణ నటించే తాజా చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే 102వ చిత్రంగా ‘జై సింహా’తో మంచి విజయాన్ని అందుకున్న బాలయ్య, తన 103వ చిత్రంగా ఎన్టిఆర్ బయోపిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మహానటుడు నందమూరి తారకరామారావు జీవితకథతో తెరకెక్కే ఈ సినిమాకోసం స్క్రిప్ట్తోపాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాపై బాలయ్య సీరియస్గా ఉన్నారట.
ప్రతిభావంతుడికి తన ప్రతిభను నిరూపించుకునే అవకాశాన్ని అందించాడు మెగా హీరో సాయిధరమ్ తేజ్. సూర్యాపేట జిల్లాకు చెందిన రంగుల నరేష్ యాదవ్ దివ్యాంగుడు. అంతర్జాతీయ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైనా అక్కడికి వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఈ కథనాన్ని ఓ పత్రికలో చూసిన సాయిధరమ్ వెంటనే స్పందించాడు. నరేష్ యాదవ్కు లక్ష రూపాయల చెక్కును స్వయంగా అందజేశాడు.
డిజిటల్ ప్రొవైడర్ల విధి విధానాలవల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారని, ఈ విషయంపై ఇప్పటికే తెలుగు పరిశ్రమతోపాటు తమిళ, కన్నడ పరిశ్రమలు తీవ్రంగా వ్యితిరేకిస్తున్నాయి. డిజిటల్ ప్రొవైడర్స్ వసూలు చేస్తున్న అధిక ఛార్జీల వలన చాలా నష్టపోతున్నామని పలువురు నిర్మాతలు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఇటీవల తెలుగు ఫిలిం నిర్మాతల మండలి, దక్షిణాది ఫిలిం ఛాంబర్స్ సమావేశమైంది.
ఎస్.బి. క్రియేషన్స్ పతాకంపై మానస్, నిత్యానరేష్, కారుణ్య హీరో హీరోయిన్లుగా మల్లూరి హరిబాబు దర్శకత్వంలో భువనగిరి సత్య సింధుజా నిర్మిస్తున్న చిత్రం ‘సోడా గోలీసోడా’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన సమావేశంలో నిర్మాత సత్య సింధుజ మాట్లాడుతూ- మా చిత్రానికి సెన్సార్ క్లీన్ యు సర్ట్ఫికెట్ వచ్చింది.
వరుణ్తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై భోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ‘తొలిప్రేమ’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 10న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను విడుదల చేశారు.
అందాల చందమామ కాజల్ ఈమధ్య సినిమాలు తగ్గించినట్టు కనిపిస్తోంది. రానాతో చేసిన నేనే రాజు నేనే మంత్రి తరువాత ఆమె మరే చిత్రంలో కన్పించడంలేదు. అటు తమిళంలో కూడా పరిస్థితి అలాగే వుంది. వరుసగా వస్తున్న పరాజయాలతోనే కాజల్కు అవకాశాలు తగ్గాయని వార్తలు వస్తున్నాయి. అందుకే కాస్త గ్యాప్ తీసుకుని సన్నబడ్డ కాజల్, మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
అల్లాణి శ్రీ్ధర్ స్వీయ దర్శకత్వంలో ఫిల్మీడియా ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై నిర్మించిన ‘శ్రీ చిలూకూరి బాలాజీ’ చిథ్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ వంశీ ఆర్ట్ థియేటర్స్ వారు ఈ చిత్రం ప్రదర్శింపబడుతున్న స్వప్న, సంతోష్ థియేటర్లో విజయోత్సవ సభను నిర్వహించారు.
సూపర్స్టార్ మహేష్బాబు ప్రస్తుతం నటిస్తున్న ‘్భరత్ అనే నేను’ చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈనెల చివరివరకూ జరిగే షూటింగ్తో చిత్రం పూర్తికానుంది. ఈ సినిమా తరువాత మహేష్ వంశీ పైడిపల్లితో తన 25వ చిత్రాన్ని చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా మహేష్ మరో సినిమాకు కమిట్ అయినట్టు వార్తలొస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..