S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
యువ హీరో నాగశౌర్య, రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర్ప్రసాద్ సమర్పణలో ఐరా క్రియేషన్స్ బ్యానర్పై ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ‘్ఛలో’ చిత్రంలోని పాటలు హైదరాబాద్లో విడుదలయ్యాయి. మెగాస్టార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియో సీడీని విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- నాగశౌర్య నన్ను కలవడానికి చాలాసార్లు మా ఆఫీసుకు వచ్చాడు. నేను లేకపోవడంతో కలవలేదు.
భిన్నమైన కథా చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుకుమార్. తాజాగా ఆయన ‘రంగస్థలం’ సినిమాతో మరో భిన్నమైన ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం టీజర్ అందరినీ ఆకట్టుకుని దూసుకుపోతోంది. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 30న విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తరువాత సుకుమార్ మరో భారీ చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేశారు. రామలక్ష్మి సినీ క్రియేషన్స్ బ్యానర్పై లగడపాటి శ్రీ్ధర్, బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది. ‘సైనిక.. సైనిక..’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్ర్తీ రచించగా, విశాల్ శేఖర్ సంగీతం అందించారు.
ఆ సినిమా విజయాన్ని నేను సరిగ్గా ఉపయోగించుకోలేదు. అంత మంచి హిట్ వచ్చినా నేను రియలైజ్ కాలేదని అంటోంది సీరత్కపూర్! ‘రన్ రాజా రన్’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అందాల భామ సీరత్కపూర్, ఆ సినిమాతో మంచి పేరు తెచ్చుకుంది. గ్లామర్ హీరోయిన్గా పలు అవకాశాలు అందుకున్న ఈమె, తాజాగా రవితేజ సరసన ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో నటిస్తోంది.
అరుణ్ రాహుల్, అంజన జంటగా సుమన్, భానుచందర్ ప్రధాన పాత్రల్లో కట్ల రాజేంద్రప్రసాద్ దర్శకత్వంలో కె.జె.రాజేష్ నిర్మిస్తున్న చిత్రం ‘చేతిలోన చెయ్యేసి చెప్పు బావ’. ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సాయి వెంకట్ క్లాప్ కొట్టగా నటులు సుమన్, భానుచందర్ దర్శకుడికి స్క్రిప్ట్ అందజేశారు.
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘టచ్ చేసి చూడు’. బేబి భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాశీకన్నా, సీరత్కపూర్ నాయికలు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్ట్ఫికెట్ను పొందింది.
దశాబ్దకాలంగా టాప్ హీరోయిన్గా సౌత్లో ఓ వెలుగు వెలిగిన అందాల భామ త్రిషకు ఈమధ్య సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టినా కూడా పెద్దగా కలిసిరావడంలేదు. ఎన్నో ఆశలు పెట్టుకొని చేసిన రెండు మూడు చిత్రాలు భారీ పరాజయాలు చవిచూడడంతో త్రిషకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా విడుదల విషయంలో ముందుకు కదలడంలేదు. దానికి కారణం త్రిషకు మార్కెట్ లేకపోవడమే.
బాలీవుడ్లో హీరోయిన్గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న హాట్ భామ శ్రద్ధాకపూర్ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన ‘సాహో’లో నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందులో హీరోయిన్గా నటిస్తున్న శ్రద్ధాకపూర్ త్వరలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అయిందట. అవును.. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారట వాళ్ల పేరెంట్స్.
పిట్టగోడ ఫేం విశ్వదేవ్ రాచకొండ, ప్రియంక జైన్ జంటగా అమేజింగ్ ఆర్ట్ పతాకంపై శ్రీనివాసరావు పొట్లూరి, ప్రదీప్ కుమార్ కోనేరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘చల్తే చల్తే’. ప్రదీప్ కె.కె దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్యూట్ లవ్స్టోరీ ఫస్ట్లుక్ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
విక్రమ్, తమన్నా జంటగా విజయ్చందర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కెచ్. ఇటీవలే తమిళంలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాత డి.సురేష్బాబు మాట్లాడుతూ- సెన్సార్ పూర్తికాగానే స్కెచ్ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం. విక్రమ్ నాకు చాలా మంచి స్నేహితుడు.