S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కుమారి 21్ఫ’ లాంటి హిట్ చిత్రం అనంతరం ఆ చిత్ర దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్, కథానాయకుడు రాజ్తరుణ్ల క్రేజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవ్వనుంది. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.2గా రామ్ తాళ్లూరి ఈ క్రేజీ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ‘కుమారి 21ఎఫ్’ తరహాలోనే లవ్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రంలో యువతను ఆకట్టుకొనే అంశాలన్నీ పుష్కలంగా ఉండడం విశేషం.
చిన్న తారగా కెరీర్ ప్రారంభించిన అతిథిరావు హైదరీ ప్రస్తుతం బాలీవుడ్లో అగ్ర హీరోలతో నటించే స్థాయికి ఎదిగింది. చెలియా చిత్రంతో మెప్పించిన ఈ అమ్మడు తాజాగా సంజయ్ దత్ కుమార్తెగా భూమి చిత్రంలో నటించింది. అలాగే పద్మావతిలో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. మణిరత్నం సినిమాలో నటించడం అన్నది ఒక కల అని, ఆ కల తీరినందుకు చాలా సంతోషంగా వుంటుందని చెప్పుకొచ్చింది.
టాలీవుడ్లో క్రేజీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమాలో నటిస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకుంది. ఏప్రిల్లో విడుదలకానున్న ఈ సినిమా తరువాత ఆయన నిర్మాతగా మారేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.
బాలీవుడ్ బాద్షా షారుక్ఖాన్ మరోసారి డాన్గా కనిపించేందుకు రెడీ అవుతున్నాడు. అప్పట్లో అమితాబ్ నటించిన డాన్ సినిమాను షారుక్ రీమేక్ చేసి సంచలన విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత కొన్నాళ్లకు మళ్లీ డాన్-2గా సీక్వెల్ చేశారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. పర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పుడు మరో సీక్వెల్ రూపొందించేందుకు సిద్ధం అయ్యాడు.
అమెరికన్ ఫాంటసీ అడ్వెంచర్ ఫిలిం జుమాంజి సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. జియో జాన్ స్టోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1981లో వచ్చిన చిన్న పిల్లల పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు సీక్వెల్గా తాజాగా రూపొందించిన జుమాంజి సినిమా త్వరలోనే విడుదల చేయడానికి సిద్ధమవుతోంది సోనీ పిక్చర్స్ సంస్థ. అద్భుతమైన గ్రాఫిక్స్ అడ్వెంచర్ సినిమాగా తెరకెక్కించారు.
గ్లామర్ హీరోయిన్గా సౌత్లో ఓ రేంజ్లో ఇమేజ్ తెచ్చుకున్న బ్యూటీ ఇలియానా, బాలీవుడ్లో హీరోయిన్గా సెటిల్ అవ్వాలని తెలుగులో క్రేజీ అవకాశాలు వస్తున్నా కూడా వాటిని కాదని అక్కడ అడుగుపెట్టింది. మొదట రెండు మూడు అవకాశాలు వచ్చాయి కానీ హిట్ మాత్రం దక్కలేదు. దాంతో గ్లామర్ షోలు చేసింది.. రెచ్చిపోయి మరి హాట్ హాట్ ఫొటోలు సోషల్ మీడియాలోకి వదలింది. అయినా లాభం లేదు. కొత్త అవకాశాలైతే రాలేదు..
మహేష్బాబు ఒక సినిమా పూర్తిచేశాక కొన్ని రోజులు విదేశాలలో కుటుంబంతో కలిసి తిరగడం అందరికీ తెలిసిన సంగతే. తాజాగా మహేష్ మరోసారి ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
సినిమా రంగంలో ప్రతి ఏడాది కొత్త కథానాయికలు వస్తూనే వుంటారు. కొందరు తమ ప్రతిభతో ఆకట్టుకుంటే, మరికొందరు గ్లామర్తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. లేలేత ముద్దుగుమ్మలు తమదై నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నాలు కొందరికే సాధ్యమవుతాయి. ఇక మొదటి సినిమాతో ఆకట్టుకున్నామా, హీరోయిన్గా బ్రాండ్ పడ్డట్టే!
‘ఆక్సిజన్’ చిత్రం తరువాత గోపీచంద్ నటిస్తున్న 25వ చిత్రం ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు చక్రి ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రాధామోహన్ నిర్మిస్తున్నారు. మంచి కథ, కథనంతో తెరకెక్కుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈరోజు హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సినిమాలో మెహరీన్ టీచర్గా నటిస్తోంది.
‘చెలియా’ సినిమా తరువాత మణిరత్నం భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అరవింద్స్వామి, విజయ్సేతుపతి, శింబు, ఫాహద్ ఫాజిల్ ఈ ప్రాజెక్టులో నటిస్తున్నట్లు ఇదివరకే యూనిట్ ప్రకటించింది. ఈనెలలో ముహూర్తం జరుపుకోనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి నుండి ప్రారంభం కానుంది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు.