S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

12/19/2017 - 19:42

శేఖర్ కమ్ముల ‘్ఫదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి ప్రస్తుతం నాని సరసన ‘ఎంసిఏ’లో నటిస్తోంది. ఈ సినిమాతోపాటు సాయిపల్లవికి సౌత్‌లో వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇప్పటికే మలయాళంలో వచ్చిన ప్రేమమ్ సినిమాతోనే మంచి ఇమేజ్ సాధించిన ఈ అమ్మడు, అటు తమిళంలో కూడా బిజీగా మారింది. ఇప్పటికే రెండు చిత్రాల్లో నటిస్తున్న ఈమెకు మరో లక్కీ చాన్స్ దక్కింది.

12/17/2017 - 21:29

గుంటూరు టాకీస్, రాజామీరు కేక వంటి చిత్రాలను రూపొందించిన ఎం.రాజ్‌కుమార్ యదార్థ సంఘటనల ఆధారంగా కర్రి బాలాజీ దర్శకత్వంలో రూపొందించనున్న చిత్రంలో అంజలి, లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రల్లో నటించనున్నా రు. వైవిధ్యమైన కథాంశంతో రూపొందిస్తున్న ఈచిత్రంలో వినోదంతోపాటు గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే ఉండబోతోందట. తెలుగు, తమిళ భాషల్లో రూపొందించనున్న ఈ చిత్రానికి సంబంధించి స్క్రిప్టు కార్యక్రమాలు జరుగుతున్నాయి.

12/17/2017 - 21:27

ఫిదా విజయం తర్వాత వరుణ్ తేజ్, వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించనున్నారు. ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత వరుణ్ తేజ్ ఏ చిత్రంలో నటిస్తారో అన్న చర్చ మొదలైంది. అనేక పేర్లు వినిపిస్తున్నా చివరికి రెండు పేర్లు ఖరారవుతున్నాయి. ఘాజీ చిత్ర దర్శకుడు సంకల్పరెడ్డితో ఓ చిత్రం చేయనున్నాడు.

12/17/2017 - 21:26

సూర్య కథానాయకుడిగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తమిళంలో రూపొందించిన ‘తాన సెరంధ కూటమ్’ చిత్రా న్ని తెలుగులో ‘గ్యాంగ్’గా అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఇప్పుడు ఫస్ట్‌లుక్ టీజర్‌ను ఆవిష్కరించారు.

12/17/2017 - 21:25

రాజేంద్రప్రసాద్, సంజోష్ కథానాయకులుగా ఎస్ క్రియేషన్స్ పతాకంపై రమేష్ చెప్పాల దర్శకత్వంలో పొన్నాల చందు, ఎం.అరవింద్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘బేవర్స్’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

12/17/2017 - 21:23

మెగాస్టార్ చిరంజీవి కుటుంబం నుండి మరొక కథానాయకుడు త్వరలో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టబోతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి మన తెలుగు చిత్ర పరిశ్రమలో రెండవ తరం కథానాయకుడు. చిరంజీవికి స్టార్‌డమ్ ఒక్క రోజుతోనో, ఒక నెలతోనో, ఒక్క సంవత్సరంతోనో, ఒక్క సినిమాతోనో, రెండు సినిమాలతోనో రాలేదు. ఎన్నో సాధక బాధకాలు.. ఒడిదుడుకుల తర్వాత వచ్చిన విషయం మన తెలుగు ప్రేక్షకులకు తెలుసు.

12/17/2017 - 21:21

శ్రీదేవి మూవీస్ పతాకంపై సుధీర్‌బాబు కథానాయకుడిగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైంది. మొదటి సన్నివేశానికి తనికెళ్ల భరణి క్లాప్‌నివ్వగా, అవసరాల శ్రీనివాస్ గౌరవ దర్శకత్వం వహించారు.

12/17/2017 - 21:19

రాహుల్ రవీంద్రన్, చాందిని చౌదరి, మనాలి రాథోడ్ ప్రధాన తారాగణంగా ఇ.ఎం.వి.ఇ స్టూడియోస్ ప్రై.లి. పతాకంపై రేవన్ యాదూ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘హౌరాబ్రిడ్జి’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సారు కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెలాఖరుకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా హీరో రాహుల్ మాట్లాడుతూ- ఈపేరు పెట్టడం వెనుక ఓ మంచి కారణం వుందని, అది ఇపుడు చెప్పలేమని అన్నారు.

12/17/2017 - 21:19

అర్జున్‌రెడ్డి టాలీవుడ్‌లో ఈమధ్య సంచలనం రేపిన చిత్రంగా నమోదైంది. సందీప్ వంగాకు దర్శకునిగా మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన మహేష్‌బాబుతో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ ఆ మాటలు వినిపించలేదు. తాజాగా ఆయనకు మెగా ఛాన్స్ దొరికింది. రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నాడు. రంగస్థలం చిత్రం తర్వాత ఈ సినిమా చేయనున్నాడని, కథ రామ్‌చరణ్‌కు నచ్చడంతో బాగా డెవలప్ చేయమని చెప్పారట.

12/17/2017 - 21:17

మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం గాయత్రి. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో మంచు విష్ణు, శ్రీయ, నిఖిలా విమల్ నటిస్తున్నారు. చివరి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. బ్రహ్మానందం, అనసూయా భరద్వాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్. ఎస్.

Pages