S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలకృష్ణతో రెండు చిత్రాల్లో నటించిన రాధికా ఆప్టే ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ‘కబాలి’ చిత్రంతో జోడీ కట్టిన ఎటువంటి అవకాశాలు రాలేదు. సినిమా విజయాల కన్నా వివాదాస్పద కామెంట్స్తోనే ఈ అమ్మడు పాపులర్ ఆయింది. మీడియాలో హల్చల్ కోసం సంచలన వ్యాఖ్యలు చేసిందో లేక లైంగిక వేధింపులు నిజంగానే ఎదుర్కోందో తెలియదుగానీ, మొత్తానికి ఆ వ్యాఖ్యలతోనే రాధికా ఆప్టే ఫేమస్ అయింది.
అరుణ్గుప్తా, సావేరి, జయవర్థన్ ప్రధాన తారాగణంగా శ్రీరాజన్నా మూవీస్, మహేష్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై ఆర్.కె.కాంపల్లి దర్శకత్వంలో మహేష్ పైడా, భరత్ అంకతి రూపొందించిన చిత్రం ‘పడిపోయా నీ మాయలో’. జయవర్థన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీని హైదరాబాద్ ప్రసాద్ లాబ్లో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విడుదల చేశారు. తొలి సీడీని ఎన్.శంకర్ అందుకున్నారు.
ఇషాన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జయంత్ సి.పరాంజి దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రూపొందిస్తున్నారు. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందిస్తున్న ఈ చిత్రంతో నీలేష్ అనే కొత్త యువకుడిని హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రానికి నరేందర్ అన్న టైటిల్ను ఖరారు చేశారు. ల్యాక్మీ ఫేమ్ ఇజబెల్లా కథానాయికగా పరిచయం అవుతోంది. జనవరి నెలలో హైదరాబాద్, గుజరాత్లో నాన్స్ట్ఫా షెడ్యూల్లో షూటింగ్ చేయనున్నారు.
కమెడియన్గా దాదాపు 70 చిత్రాలు చేశా. ఇంకా లైఫ్లో కొత్తదనం ఏముంది? ఏ సినిమాలో చూసినా సప్తగిరి ఒకేలా వున్నాడు అని ప్రేక్షకులు అనుకోకుండా నాకంటూ ఓ గోల్ను పెట్టుకుని హీరో అయ్యాను. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచి కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నాను. ఈ సినిమాతో మరింత విజయం సాధిస్తానన్న నమ్మకం వుంది అని నటుడు సప్తగిరి చెప్పారు.
‘రాజా ది గ్రేట్’ సినిమాతో మళ్లీ ఫామ్లోకి వచ్చిన రవితేజ జోరు
దేవసేనగా బాహుబలితో మరింత క్రేజ్ పెంచుకున్న అందాల భామ అను ష్క ప్రస్తుతం భాగమతి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా అనుష్క వెంకటేష్ సరసన నటించేందుకు ఓకె చెప్పిందట. వెంకటేష్ కథానాయకుడిగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్లో ప్రారంభమైంది.
నాగశౌర్య, రష్మిక జంటగా ఐరా క్రియేషన్స్ పతాకంపై వెంకి కుడుముల దర్శకత్వంలో ఉషా మూల్పూరి, శంకర్ ప్రసాద్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘్ఛలో’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కథానాయకుడు నాగశౌర్య మాట్లాడుతూ- ఇటీవల వైజాగ్లో ఓ పాటను విడుదల చేయగా యువతరంనుండి మంచి రెస్పాన్స్ వచ్చిందని, పాటలన్నీ సినిమాలో వైవిధ్యంగా చిత్రీకరించారని తెలిపారు.
నవీన్ చంద్ర, నివేదా థామస్ జంటగా అనురాగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ వద్దిరాల దర్శకత్వంలో రఘుబాబు చౌదరి, కె.పి.చౌదరి సంయుక్తం గా రూపొందిస్తున్న చిత్రం ‘జూలియట్ లవర్ ఆఫ్ ఇడియెట్’. ఈ చిత్రం ఈమధ్య సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 15న భారీ ఎత్తున విడుదలకు సిద్ధమైంది.
హారర్, కామెడీ ఎమోషన్ ఎంటర్టైనర్గా ‘మాతంగి’ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. ఈ చిత్రంలో నేను రెండు షేడ్స్ లో నటించా. ముఖ్యంగా అమ్మోరు షేడ్స్ లో వున్న పాత్ర ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుం ది. గతంలో నేను నటించిన అమ్మోరు చిత్రానికి మించి ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈనెల 15న ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు అని నటి రమ్యకృష్ణ తెలిపారు.
ఇప్పటివరకు నేను 22 చిత్రాల్లో నటించా. వాటిలో గోదావరి, గోల్కొండ హైస్కూల్ సినిమాల కథలకు దగ్గరగా వుంటుంది మళ్లీరావా కథనం. 30 రోజుల్లోనే ఈ చిత్రాన్ని చక్కగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు మంచి స్పందన లభిస్తోంది. కామెడీ సినిమాలో హైలెట్గా వుంటుంది అని కథానాయకుడు సుమంత్ తెలిపారు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుమంత్, ఆకాంక్షాసింగ్ జంటగా నటించిన చిత్రం ‘మళ్లీ రావా’.