S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

11/29/2017 - 19:26

యువ కథానాయకుడు నాగశౌర్య నూతన చిత్రం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ క్లాప్‌నిచ్చారు. కెమెరా స్విచ్‌ఆన్ ప్రముఖ దర్శకుడు మారుతి చేశారు. అలాగే దర్శకుడు మారుతి, రచయిత కోన వెంకట్‌లు ఈ చిత్రం స్క్రిప్ట్‌ను చిత్ర దర్శక నిర్మాతలకు అందజేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి, వి.ఐ.ఆనంద్, ఉపేంద్రలు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు.

11/29/2017 - 19:23

లేడి ఓరియెంటెడ్ సినిమాలతో స్టార్ హీరోలతో సమానంగా బాక్సాపీస్ వద్ద దుమ్ము రేపుతూ సంచలనం క్రియేట్ చేసిన అనుష్క ప్రధాన పాత్రలో జి.అశోక్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘ భాగమతి’ షూటింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహానుభావుడు సినిమా తరువాత యువి క్రియేషన్స్ సంస్థనుంచి వస్తున్న సినిమా ఇదే అవ్వడం విశేషం.

11/29/2017 - 19:21

నాని కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘ఎం.సీఏ’. ‘ఫిదా’ చిత్రం ద్వారా భానుమతిగా టాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేసిన సాయిపల్లవి ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో దిల్‌రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలుగా ఈ చిత్రం రూపొందుతోంది.

11/29/2017 - 19:18

అఖిల్ కార్తిక్, ప్రియాంక శర్మ జంటగా ప్రధా ప్రొడక్షన్స్ పతాకంపై భరత్ దర్శకత్వంలో శ్రీ్ధర్‌రాజు ఎర్ర, తాళ్లరవి, టి.పి.ఆర్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘మేరా భారత్ మహాన్’. సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. దర్శకుడు బి.గోపాల్ క్లాప్‌నివ్వగా, చంద్రబోస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. సాగర్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

11/29/2017 - 19:16

గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్‌లుగా ఎ.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఆక్సిజన్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్.ఐశ్వర్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 30న విడుదలకు సిద్ధమయింది. ఈ సందర్భంగా దర్శకుడు జ్యోతికృష్ణ చెప్పిన విశేషాలు.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.

11/29/2017 - 19:14

బాలీవుడ్‌లో బాహాటంగా అవకాశాలు వస్తున్నాయంటే అదీ లేదు. పోనీ తెలుగులో అన్నా టాప్ హీరో సరసన అవకాశం వస్తే చేద్దామన్న ఆశే లేదు. ఎందుకూ? అనంటే తన కారణం తాను చెబుతోంది అలియాభట్. ప్రభాస్ కథానాయకుడిగా రూపొందిస్తున్న ‘సాహో’ చిత్రానికి మొదట కథానాయికగా అలియాభట్‌నే ఎంపిక చేశారు. అయితే ఈ కథ విన్నాక తన పాత్ర చాలా తక్కువ వున్నది అన్న కారణం చూపించి ఆ సినిమాకు నో చెప్పిందట అలియా.

11/29/2017 - 19:11

దర్శకుడు అల్లాణి శ్రీ్ధర్ ఎస్3 క్రియేషన్స్, ఫిల్మ్ ఇండియా ప్రొడక్షన్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘నేనే సరోజ’. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఉప్పల్ రామాలయంలో ప్రారంభమైంది. రామయ్య నాయుడు, వరంగల్ సుధాకర్ పాల్గొన్న కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

11/28/2017 - 19:27

‘బిచ్చగాడు’ సినిమా తెలుగులో ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాతో స్టార్‌గా మారిపోయాడు హీరో విజయ్ ఆంటోని. భిన్నమైన సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ ఆంటోని నటిస్తున్న తాజా చిత్రం ఇంద్రసేన. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ఈనెల 30న విడుదల కానుంది. శ్రీనివాసన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గురించి హీరో విజయ్ చెప్పిన విశేషాలు..

11/28/2017 - 19:26

ప్రస్తుతం కీర్తి సురేష్ క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది..ఇప్పటికే స్టార్ హీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ జోరుమీదున్న ఈ భామకు తాజాగా మరో లక్క్ఛీన్స్ దక్కింది. తమిళంలో అజిత్ సరసన హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. అజిత్ హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కే ‘విశ్వాసం’ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినం చేస్తున్నాడట. ఇందులో ఓ హీరోయిన్‌గా కీర్తిని ఫైనల్ చేశారు.

11/28/2017 - 19:24

దుహర మూవీస్ సమర్పించు చిత్రం ‘రచయిత’. ఈ చిత్రం ఆడియో విడుదల హైదరాబాద్ మణికొండలో పాటల రచయిత చంద్రబోస్ నివాసంలో నటుడు జగపతిబాబు సమక్షంలో ఆడియో విడుదల జరిగింది. అనంతరం జగపతిబాబు మాట్లాడుతూ- నాకు రచయితలంటే చాలా గౌరవం. ‘రచయిత’ అనే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్‌తో తెరకెక్కనుంది. ఈ సినిమా కానె్సప్ట్ నాకు విపరీతంగా నచ్చడంతో మొదట నేనే నటించాలనుకున్నా. కానీ నా డేట్స్ కుదరకపోవడంతో చేయలేదు.

Pages