S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఉయ్యాల జంపాల’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విరించి వర్మ ఆ సినిమా తరువాత నానితో ‘మజ్ను’ సినిమా తీసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ అక్కినేని హీరోతో సినిమా చెయ్యడానికి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్నపూర్ణ బ్యానర్లో అక్కినేని నాగార్జున ఈ సినిమాను నిర్మించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య కార్తికేయ ఫేమ్ డైరెక్టర్ చందు మొండేటితో సినిమా చేస్తున్నాడు.
సూర్య అన్న పేరుతో ఈ చిత్రంలో కనిపిస్తా. నా స్నేహితుల కోసం నేను ఏం చేశాను అనేదే ఈ సినిమా కథ. మన చుట్టుప్రక్కల జరిగిన కథలా ఈ చిత్రం సాగుతుంది అని హీరో సందీప్ కిషన్ తెలిపారు. తమిళ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో సందీప్ కిషన్, మెహరీన్ జంటగా రూపొందించిన చిత్రం ‘కేరాఫ్ సూర్య’. ఈ చిత్రం గురించి కథానాయకుడు పలు విశేషాలు తెలిపారు.
సూర్య అంటే
మంచి పాత్రల్లో నటించి ప్రేక్షకులను రంజింపజేసి మంచి నటిగా నిరూపించుకోవాలని వుంది అని ‘లవర్స్ క్లబ్’ కథానాయిక పావని తెలిపారు. శ్రీయా ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై అనీష్, పావని జంటగా ధృవశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 17న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కథానాయిక పావని చిత్ర విశేషాలు తెలిపారు. ఈ చిత్రంలో నేను గీత అనే అమ్మాయిగా నటించా. మెడికల్ స్టూడెంట్ పాత్ర.
చారిత్రక నగరం హైదరాబాద్లో 20వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి బాలల చలనచిత్రోత్సం జరుగుతుంది. ఈ చలనచిత్రోత్సవాల కోసం 93 దేశాల నుంచి 1402 సినిమాలొచ్చాయి.
సినిమాల ద్వారా మాత్రమే జీవితాన్ని చిత్రీకరించి చూపించగలిగే అవకాశం ఉంటుందని, భాషలకు అతీతంగా మంచిని పంచేది సినిమా మాత్రమేనని సినీ సంగీత దర్శకుడు, నటుడు ఆర్పీ పట్నాయక్ అన్నారు. ఒక ప్రాంతంలో పుట్టి, పెరిగితే ఆ ప్రాంత ప్రభావం, అక్కడి పరిస్థితులు మాత్రమే పిల్లలకు తెలుస్తుందని, కానీ సినిమాల ద్వారా అన్ని ప్రాంతాల సంస్కృతి, జీవన విధానంపై పిల్లలకు అవగాహన ఏర్పడుతుందని చెప్పారు.
కొత్త దర్శకులతో సరికొత్త కథనాలతో సినిమాలు చేయడానికి నేను ఆసక్తి చూపుతున్నానని నటుడు మంచు మనోజ్ తెలియజేస్తున్నారు. తాజాగా ఆయన నటించిన ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రం విడుదలకు సిద్ధమైంది. అజయ్ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఈనెల 10న వస్తోంది. ఈ చిత్రం గురించి మంచు మనోజ్ పలు విశేషాలు తెలిపారు.
* ఆ ఒక్కడి గురించి..?
సందీప్కిషన్, మెహరీన్ జంటగా సుశీంద్రన్ దర్శకత్వంలో లక్ష్మీ నరసింహ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘కేరాఫ్ సూర్య’. ఈ చిత్రం ఈనెల 10న విడుదలకు సిద్ధమైంది. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు.
శరత్ కళ్యాణ్ హీరోగా భరత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెంబర్ వన్గా బండారు దానయ్య కవి దర్శకత్వంలో కదిరి శేఖర్బాబు నిర్మిస్తున్న చిత్రం ‘డాటర్ ఆఫ్ బుచ్చిరెడ్డి’. ఇటీవల సంస్థ కార్యాలయంలో హీరో శరత్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను చిత్ర యూనిట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దర్శకుడు బండారు దానయ్య కవి చిత్ర విశేషాలను వివరిస్తూ- ‘సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
నూతన నటుడు శ్రీకాంత్, హేమలత జంటగా వీరభద్ర క్రియేషన్స్ పతాకంపై ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో బుధవారం ఉదయం జరిగింది.
గాయత్రి రీల్స్ పతాకంపై గోపీ వర్మ, మాళవికా మీనన్, శివాజీరాజా ప్రధాన తారాగణంగా కృష్ణమ్ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అమ్మాయిలంతే.. అదోటైపు’. డిసెంబర్లో ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ- అమ్మాయిలలోని ఎమోషనల్ యాంగిల్ను, తండ్రి తనయల రిలేషన్ను హైలెట్ చేస్తూ ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు.