S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గడ్డంపల్లి రవీందర్రెడ్డి సమర్పణలో ఎస్.ఎస్.ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రకాష్ పులిజాల దర్శకత్వంలో ప్రియాంకా నాయుడు ముఖ్యపాత్రలో కాళీచరణ్, సంజయ్ తదితరులు నటించిన ‘అనగనగా ఒక దుర్గ’ చిత్రం ఈనెల 27న విడుదలవుతున్న సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్ ఈవెంట్లో దర్శకుడు ప్రకాష్ పులిజాల మాట్లాడుతూ- సినిమాపై పూర్తి నమ్మకంతో వున్నాం.
బాలీవుడ్లో జోరు ప్రేమాయణం సాగించిన అందాల భామ అనుష్కాశర్మ, క్రికెట్ విరాట్ కోహ్లిల ప్రేమకథ గురించి బాలీవుడ్లో రకరకాల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరూ ఘాటు ప్రేమలో వున్నట్లు అంగీకరించారు కూడా. ప్రేమాయణం బయటపడ్డ తరువాత వీరిద్దరూ కలిసి బాహాటంగానే షికార్లు కొడుతున్నారు. అయితే వీరి పెళ్లప్పుడన్న విషయంపై ఎలాంటి సమాచారం లేదు. ఈ విషయాన్ని అనుష్కనడిగితే, ఇప్పుడే కాదని చెబుతోంది.
మహీధర్, సోనాక్షిసింగ్లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ అశ్విని క్రియేషన్స్ పతాకంపై శివగంగాధర్ దర్శకత్వంలో కె.శేషగిరిరావు నిర్మిస్తున్న చిత్రం ‘నా లవ్స్టోరీ’. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. జర్నలిస్టు రాఘవేంద్రరెడ్డి పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం దర్శకుడు శివ మాట్లాడుతూ- ఇదొక రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
రక్షిత్, స్వాతి జంటగా బి. చిన్నికృష్ణ దర్శకత్వంలో మారుతి ప్రొడక్షన్స్ పతాకంపై మారుతి నిర్మిస్తున్న చిత్రం ‘లండన్ బాబులు’. షూటింగ్ పూర్తి చేసుకుని ఇటీవలే నిర్మాణానంతర కార్యక్రమాలను కూడా ముగించుకున్న ఈ చిత్రం నవంబర్ 10న విడుదలవుతున్న సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో ఏర్పాటుచేసిన సమావేశంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ- సరికొత్త కథతో తెరకెక్కిన ఈ చిత్రం పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా సాగుతుంది.
నూతన నటీనటులతో శ్రీ వెంకట సాయి ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై బద్రినాయుడు అబ్బు దర్శకత్వంలో దాసరి నరసింహ, యార్లగడ్డ లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘పవర్స్టార్ స్ఫూర్తితో ప్రశ్నిద్దాం’. ఈ చిత్రాన్ని పవన్ కళ్యాణ్ అభిమానులు నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.
ఎన్టిఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం సోమవారం నానక్రాం గూడలోని రామానాయుడు స్టూడియోలో అట్టహాసంగా జరిగింది. ఈ క్రేజీ ప్రాజెక్టు పూజా కార్యక్రమానికి పవర్స్టార్ పవన్కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై ఎన్టిఆర్పై క్లాప్నివ్వడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఇటు నందమూరి అభిమానులకీ, అటు మెగా అభిమానులకీ భలే ఆసక్తికరమైన సంఘటన ఇది.
సూపర్స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న భరత్ అను నేను చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో వేసిన భారీ సెట్లో జరుపుకుంటోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తరువాత మహేష్ తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లితో చేయనున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి.
‘జై లవకుశ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుని జోరుమీదున్నారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో ఏకంగా మూడు పాత్రల్లో నటించి ఆకట్టుకున్న ఆయన తన తదుపరి చిత్రానికి ముహుర్తం ఖరారు చేశారు. ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో సోమవారం ప్రారంభం కానుంది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నారు.
అంజలి, ఆండ్రియా, వసంత రవి ప్రధాన పాత్రల్లో రామ్ దర్శకత్వంలో యశ్వంత్ మూవీస్ సమర్పణలో డివివి సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ నిర్మిస్తున్న ‘తారామణి’ చిత్ర టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. దర్శకుడు మారుతి టీజర్ను ఆవిష్కరించారు.
నూతన నటీనటులతో ఎల్.ఓ.ఎల్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎం.వి మూర్తి సమర్పణలో సి.హెచ్ బ్రహ్మం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత చండ్ర శేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘అచ్చులో బొమ్మ’. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో ప్రారంభం కానుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, నవంబర్లో ఆడియో ఆవిష్కరణ జరపనున్నామని చిత్ర నిర్మాత శేఖర్ తెలిపారు. ఈ చిత్రానికి రచన: డి.