S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలీవుడ్ గ్లామర్ భామ ఆదాశర్మకు ఈమధ్య పెద్దగా చేతిలో సినిమాలు లేవు. ప్రస్తుతం హిందీలో కమాండో-2లో మాత్రమే నటిస్తోంది. సౌత్లో హీరోయిన్గా వెలగాలని ఆశపడ్డ ఈమెకు ఇక్కడ చేసిన రెండు మూడు చిత్రాలు కూడా కమర్షియల్గా విజయాన్ని అందించలేకపోయాయి. దాంతో అడపాదడపా గ్లామర్ ఫొటో షూట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆదాశర్మను చూసినవాళ్లంతా షాక్ అయ్యారు.
దర్శకుడు కె.విక్రమ్కుమార్ అంటే టాలీవుడ్లో మంచి క్రేజ్ వుంది. 13బి, ఇష్క్, మనం, 24 లాంటి సినిమాలతో దర్శకుడిగా స్టార్ ఇమేజ్ అందుకున్న ఈయన ప్రస్తుతం అఖిల్తో ‘హలో’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన ఎన్టీఆర్తో చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. ప్రస్తుతం అఖిల్ సినిమా షూటింగ్లో బిజీగా వున్న విక్రమ్కుమార్ ఈ సినిమా తరువాత ఎన్టీఆర్తో సినిమాకు ప్లాన్ చేస్తున్నాడట.
గోపీచంద్, రాశీఖన్నా, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా ఏ.ఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ పతాకంపై ఎస్. ఐశ్వర్య నిర్మిస్తున్న చిత్రం ‘ఆక్సిజన్’. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు సంబంధించిన పాటలను ఈనెల 23న వైభవంగా హైదరాబాద్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణానంతర కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి.
గ్లామర్ హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న తమన్నా అంటే సౌత్లో ఎలాంటి క్రేజ్ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమన్నా గ్లామర్ అంటే ఇష్టపడని ప్రేక్షకుడు ఉండడు. ఇక ‘అర్జున్రెడ్డి’ సినిమాతో హీరోయిన్గా ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న షాలిని పాండే.. తెలుసుగా.. ఆ ఒక్క సినిమాతోనే ఎవ్వరికీ రానంత క్రేజ్ తెచ్చుకున్న ఈ భామకు తమన్నాకు లింక్ ఏమిటి? అని షాక్ అవుతున్నారా.. ఉంది. అదేమిటంటే..
జీవితంలో ప్రతి మనిషి ఎవరికో ఒకరికి రుణపడుతూ ఉంటాడు. అది గుర్తుపెట్టుకుని తీర్చేవాడు మనిషవుతాడు. అత్యాశ మనిషిని ఎంత దూరం అయినా తీసుకువెళ్తుంది. ఒక్కోసారి అది జీవితాన్ని గొప్ప స్థాయిలో నిలుపుతుంది. ఒక్కోసారి అథఃపాతాళానికి తొక్కుతుంది. అత్యాశవల్ల జరిగే అనర్థాన్ని అత్యంత వినోదాత్మకంగా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాం ‘రుణం’ చిత్రంతో అంటున్నారు చిత్ర దర్శకులు ఎస్. గుండ్రెడ్డి.
పాపులర్ సినిమా దర్శకుడిగా టాలీవుడ్లో ఇమేజ్ తెచ్చుకున్న పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా పరిచయం అయి చాలా రోజులు అవుతుంది. పాపం ఎన్ని సినిమాలు చేస్తున్నా కూడా ఇతగాడికి సరైన విజయం మాత్రం దక్కడంలేదు. అవకాశాలు మాత్రమే వస్తూనే వున్నా.. విజయాలు దూరంగా వెళుతున్నాయి. దాంతో విసిగి వేసారిన శంకర్.. నెక్స్ట్ స్టెప్ అన్న దారిలోకి వచ్చేసాడు.. ఈసారి ఆయన దర్శకుడిగా మారతాడట!
టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలకు మళ్లీ కొత్త ఊపునిచ్చింది హీరో వెంకటేష్. ‘సీతమ్మ వాకిట్లో.. సిరిమల్లెచెట్టు’ సినిమాతో మహేష్తో నటించి ఆ తరహా సినిమాలకు కొత్త ఊపునిచ్చాడు. ఆ తరువాత పలు మల్టీస్టారర్ సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మల్టీస్టారర్కు సిద్ధమయ్యాడు వెంకీ.. అయితే ఈసారి ఆయన మల్టీస్టారర్ సినిమా చేస్తున్నది ఎవరితో తెలుసా.. మేనల్లుడు నాగచైతన్యతో.
సినిమా-
ఒక మంచి కళే కాదు! గొప్ప ప్రచార సాధనం కూడా!!
ఆబాల గోపాలాన్నీ సమ్మోహన పరిచి ప్రభావితం చేయగల అసమాన సాధనం!
అట్టి సినిమా-
దక్షిణాది ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్న నటి ఎవరంటే అందరూ చెప్పే పేరు ఒక్కటే. అదే మహానటి సావిత్రి. నటిగా అద్భుతాలు ఆవిష్కరించిన ఆమె జీవితంపై సినిమా రూపొందుతోంది. నాగఅశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మహానటి’ చిత్రంలో టైటిల్ పాత్రలో నటిస్తుండగా, సమంత, దుల్కర్ సల్మాన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈరోజు మహానటి జన్మదినం సందర్భంగా ఫస్ట్లుక్ విడుదలైంది. మహానటి అంటే సావిత్రి అనుకునేరు.
పవర్స్టార్ పవన్కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 25వ సినిమాకు సంబంధించి ఫస్ట్లుక్ వస్తుందని మెగా అభిమానులు తెగ ఆశపడ్డారు. కానీ వాళ్ళ ఆశను నిరాశ చేసేలా పవన్కళ్యాణ్ ఈ దీపావళికి ఫస్ట్లుక్ సందడి చేయడంలేదని తెలుస్తోంది. దాంతో ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ప్రకటించలేదు. ప్రస్తుతం ‘అజ్ఞాతవాసి’ అనే పేరు అంతటా వినిపిస్తోంది.