S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన మిత్రుడని నమ్మే యువకుడు అభిరామ్. నలుగురు స్నేహితులతో కలిసి రాక్ బ్యాండ్ ను ప్రారంభిస్తాడు. ఆ రాక్ బ్యాండ్కి అతనే లీడర్. చిన్నప్పటి నుంచి హాపీగా వెళ్తోన్న అలాంటి అభిరామ్ జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు వస్తారు. ఆ అమ్మాయిల్లో ఎవరితో అభిరామ్ ప్రేమలో పడ్డాడు? ఇంతకీ అభిరామ్ కథేంటి?
ఎస్తేర్, నోరాన్హా, నోయల్ సిన్, శ్రీమంగమ్, అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రల్లో రాజవౌళి వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన క్రాంతికుమార్ వడ్లమూడి దర్శకత్వంలో లావోస్ మోషన్ పిక్చర్స్ పతాకంపై తెరకెక్కుతున్న ‘నయనం’ చిత్రం టైటిల్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి లోగోను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- టైటిల్తోపాటు లోగో డిజైన్ బాగుంది. స్క్రిప్ట్ కూడా విన్నాను.
సొట్టబుగ్గల తాప్సీకి సౌత్లో ఎన్ని సినిమాలు చేసినా కమర్షియల్గా మాత్రం సరైన గుర్తింపు దక్కలేదు. అవకాశాలైతే బాగానే పట్టేసింది కానీ, విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. దాంతో బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలన్న ఈ భామ ‘పింక్’, ‘నామ్ షబానా’ సినిమాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే గ్లామర్ హీరోయిన్గా వెలగాలనుకున్న ఈమెకు ‘జుడ్వా-2’తో మంచి అవకాశం దక్కింది.
యూనివర్సల్ పిక్చర్ సమర్పణలో నిర్మించిన ‘విక్టోరియా అబ్దుల్’ చిత్రం ఈనెల 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. క్వీన్ విక్టోరియా జీవిత కథలో కొన్ని ముఖ్యమైన ఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జూడీ డెంచ్, ఇడియట్స్, కభీ కబీ, సోని కేబుల్ వంటి చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు అలీ ఫజల్ కీలక పాత్రలు పోషించారు.
భారతీయుడు’ అప్పట్లో జాతీయ నటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా, ప్రేక్షకుల్ని ఆలోచింపచేసింది. దేశంలో వున్న లంచగొండితనాన్ని రూపుమాపడానికి భారతీయుడు చేసే పోరాటం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రస్తుతం దీనికి సీక్వెల్ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏర్పాటై 25వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ‘మా’ టీమ్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తొలి ‘మా’ అధ్యక్షుడు మురళీమోహన్ చేతుల మీదుగా మెమొంటోలు అందజేశారు.
సూపర్స్టార్ మహేశ్బాబు హీరోగా నటించిన ‘స్పైడర్’ ఇటీవల విడుదలై ఏకంగా వంద కోట్ల మార్కెట్ను కొల్లగొట్టింది. తమిళ , తెలుగు భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం అటు తమిళంలో కూడా మహేశ్కి మంచి ఓపెనింగ్స్ని తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న ‘్భరత్ అను నేను..’చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
చిత్రం.. జై లవకుశలో అద్భుత నటనను కనబరిచిన ఎన్టిఆర్ను అభినందిస్తున్న చరణ్
తాజాగా ‘యుద్ధం శరణం’ సినిమాలో నటించిన నాగచైతన్య ప్రస్తుతం ‘సవ్యసాచి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ నెల మూడోవారంలో సెట్స్పైకి రానున్న ఈ చిత్రంలో హీరోయిన్గా బాలీవుడ్ భామ నిధి అగర్వాల్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. కొత్త హీరోయిన్ అయితేనే బాగుంటుందని టీమ్ ఆలోచించిందట.
బాలీవుడ్లో కంగనా రనౌత్ హీరోయిన్గా నటించిన ‘క్వీన్’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. దీనికి రీమేక్గా తెలుగులో తమన్నా ముఖ్యపాత్రలో ‘క్వీన్’ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మనుకుమారన్. నీలకంఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది.