S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పవర్స్టార్ పవన్కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూరె్తైంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సినిమా తదుపరి షెడ్యూల్ను బ్యాంకాక్లో జరపనున్నారట. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలతోపాటు పవన్, కీర్తి సురేష్లపై పాటను చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.
వరుస పరాజయాల తరువాత నేనే రాజు నేనే మంత్రితో మంచి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు తేజ. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవలే ఫిదా సినిమాతో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న వరుణ్తేజ్తో ఈ సినిమా వుంటుందని వార్తలొస్తున్నాయి. వరుణ్తేజ్ ప్రస్తుతం వెంకి అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.
సూపర్స్టార్ మహేష్బాబు నటిస్తున్న ‘స్పైడర్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. మిగిలిన ఒక్క పాటను ఇటీవలే యూరప్లో చిత్రీకరించారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి క్రేజీ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే భారీ అంచనాలు పెంచిన స్పైడర్ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జైలవకుశ’ సినిమా వేగం పెంచుకుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. ఈ చిత్రాన్ని ఈనెల 21న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్ నటిస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారీ అంచనాలతో భారీ బడ్జెట్గా రూపొందుతున్న చిత్రాన్ని నందమూరి కళ్యాణ్రామ్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం అర్జున్ రెడ్డి సినిమా సంచలనం రేపుతోంది. పలు వివాదాలతో ఆసక్తిరేపుతున్న ఈ సినిమా మరోవైపు బాక్సాపీస్ వద్ద దూసుకుపోతోంది. ఇప్పటికే భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం తమిళంలోకి రీమేక్ కానుంది. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన సందీప్ రెడ్డికి టాలీవుడ్లో మంచి క్రేజ్ దక్కింది. ఆయన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. షుగర్ ఫ్యాక్టరీ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట.
సౌత్లో టాప్ హీరోయిన్ల లిస్టులో దూసుకుపోతోంది గ్లామర్ భామ కాజల్. ఇప్పటికే పలు సినిమాలతో బిజీగా వున్న కాజల్, తాజాగా నేనే రాజు నేనే మంత్రి, వివేకం సినిమాలతో విజయాలను అందుకుంది. ప్రస్తుతం క్రేజీ ఆఫర్లతో బిజిగా వున్న ఈమె, నాని సినిమాలో నటించేందుకు సిద్ధమైంది. అయితే కాజల్ నాని సరసన హీరోయినగా కాదు.
విజయ్ సేతుపతి, గాయత్రి జంటగా డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘పిజ్జా-2’. రంజిత్ జయకొడి దర్శకత్వంలో డి.వెంకటేష్ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు.
ఓంకార్ దర్శకత్వంలో నాగార్జున, సమంత ముఖ్యపాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రాజుగారి గది-2’. ఆ సినిమాలో సమంత లుక్ ఇదీ.
చంద్రకాంత్, రాధిక మెహరోత్రా, పల్లవిడోరా ప్రధాన తారాగణంగా థర్డ్ ఐ క్రియేషన్స్ పతాకంపై రఘురామ్ రొయ్యూరు దర్శకత్వంలో గోవర్థన్ రూపొందించిన చిత్రం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. టీజర్ను కథానాయకుడు నారా రోహిత్ హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజర్ వైవిధ్యంగా ఉందని, సినిమా విజయవంతం అవ్వాలని కోరుకున్నారు.
సునీల్, మియాజార్జ్ జంటగా రానున్న చిత్రం ఉంగరాల రాంబాబు. పరుచూరి కిరీటి యునైటెడ్ మూవీస్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రాన్ని ఈనెల 15న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో రూపొందించిన సినిమా సునీల్ గత చిత్రాలకన్నా హై స్టాండర్డ్లో రూపొందించామని నిర్మాత పరుచూరి చెబుతున్నారు.