S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గ్లామర్ హీరోయిన్గా దశాబ్దకాలంగా స్టార్ హీరోయిన్గా ఇమేజ్ తెచ్చుకున్న శ్రీయ.. సెకెండ్ ఇన్నింగ్ మొదలుపెట్టి అదే చెరగని గ్లామర్తో షాక్ ఇస్తోంది. ఇప్పటికే వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలకృష్ణ సరసన ‘పైసా వసూల్’ సినిమాలో నటించింది. ఈ సినిమా రేపు విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇన్నాళ్లు గ్లామర్ పాత్రల్లో అలరించిన ఈ అమ్మడు ఇపుడు ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అయిందట.
దినేష్, మియా జార్జ్, రిత్విక, నివేదా పెతురాజ్ ప్రధాన తారాగణంగా సినీ యోగ్ మోషన్ పిక్చర్స్ పతాకంపై నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో సురేష్ బల్ల, మృదుల మంగిశెట్టి సంయుక్తంగా రూపొందించిన చిత్రం 3పెళ్లిరోజు2. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్లుక్ హైదరాబాద్లో బుధవారం ఉదయం విడుదల చేశారు.
యూత్స్టార్ నితిన్, మేఘా ఆకాష్ జంటగా పవన్కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ట్మూవీస్ సంస్థలు సంయుక్తంగా కృష్ణచైతన్య దర్శకత్వంలో ఓ చిత్రం నిర్మిస్తున్న విషయం విదితమే. మాట ల మాంత్రికుడు, సుప్రసిద్ధ దర్శకుడుత్రివిక్రమ్ ఈ చిత్రానికి కథను అందించటం మరో విశేషం. ఇటీవలే ఈ చిత్రం హైదరాబాద్లోని పలు లొకేషన్లలో ఐదు రోజులపాటు కీలక దృశ్యాల చిత్రీకరణ జరుపుకుంది.
వైశాఖంలో నేను అందించిన పాటలతో నా జీవితంలో ఉన్న ఓ కోరిక తీరింది. మ్యూజికల్గా పెద్ద హిట్ అయినందుకు ఆనందిస్తున్నా. మ్యూజిక్ చానల్లో టాప్ 10 పాటలలో రెండు పాటలు మొదటి స్థానంలోనే కొనసాగడం సంతోషంగా వుంది. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపు ఎంజాయ్ చేస్తున్నాను అని సంగీత దర్శకుడు డి.జె.వసంత్ తెలిపారు. జయా.బి దర్శకత్వంలో ఆర్.జె.
చెన్నై సోయగం రెజీనా జయాపజయాలతో సం బంధం లేకుండా చేతిలో సినిమాలు చేసుకుంటూ పోతోంది. రీసెంట్గా నక్షత్రంతో అలరించిన రెజీనాకు తెలుగు, తమిళంలో చాలామంది స్నేహితులున్నారు. వీటి కారణంగానే పలువురు యువ హీరోలతో ఆమె రిలేషిప్షిప్లో ఉన్నట్టు ఆరోపణలున్నాయి. వీటిపై రకరకాల కథనాలు కూడా ప్రచారంలోకి వచ్చాయి. తాజా గా దీనిపై రెజీనా మొదటిసారి గొంతు విప్పింది. ప్రస్తుతం నేను ఎవరితో రిలేషన్షిప్లో లేను.
ఎప్పటికప్పుడు వివాదాస్పదమైన వార్తల నేపథ్యంలో వచ్చే కథలను ఎంపిక చేసుకుని వైవిధ్యంగా చిత్రాలు రూపొందించడంలో రాంగోపాల్ వర్మ ముందువరుసలో నిలుస్తున్నారు. ఆయ నే రూపొందించిన రక్తచరిత్ర, వీరప్పన్, సర్కార్, వంగవీటి వంటి చిత్రాలు ఇలాంటి కథనాలతోనే రూపొందించడం విశేషం. తాజాగా అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరాబాబా గుర్మీత్సింగ్పై ఓ బయోపిక్ రూపొందించే ప్రయత్నాలు రాంగోపాల్వర్మ చేస్తున్నారట.
ఆంధ్ర పోరి చిత్రంతో బాలనటుడునుంచి కథానాయకుడిగా ప్రమోషన్ పొందిన పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి మరో చిత్రంలో నటించనున్నాడు. ఈ చిత్రం కోసం ఓ స్క్రిప్ట్ కూడా సిద్ధమైపోయిందట. ప్రస్తుతం పైసా వసూల్ సినిమాతో బిజీగా వున్న పూరి జగన్నాధ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నట్లుగా టాలీవుడ్లో వినిపిస్తున్న వార్త. ఓ ప్రయోగాత్మక చిత్రం గా తీర్చిదిద్దడానికి పూరి సన్నాహాలు చేస్తున్నారట.
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయికి చేరుకున్నాడు ప్రభాస్.. ఇపుడు అదే ఊపుతో సాహో సినిమా చేస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ, హిందీ భాషలో తెరకెక్కే ఈ సినిమా షూటింగ్ ఇటీవలే యూరప్లో ఓ షెడ్యూల్ జరుపుకుంది. బాహుబలి సినిమాతో పాటే విడుదల చేసిన టీజర్ కూడా ఈ సినిమాపై అం చనాలను మించింది.
ఆగడు, బ్రూస్లీ, మిస్టర్ వంటి వరుస పరాజయాలతో బాగా వెనుకబడ్డాడు దర్శకుడు శ్రీనువైట్ల. ఒకప్పుడు పరిశ్రమలోని టాప్ దర్శకుల్లో ఒకరిగా వెలిగిపోయిన ఆయన్ను బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు దెబ్బతీశాయి. దీంతో ఆయన తన నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేస్తారు అనే ఆలోచనలో అందరూ ఉండగా, రవితేజతో చేస్తారనే వార్త బయటికొచ్చింది. రవితేజ కూడా ప్రాజెక్టుపట్ల సుముఖంగానే ఉన్నారని తెలుస్తోంది.
తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్కి పరిమితం అయిపోయిన అందాల భామ లక్ష్మీరాయ్కి సౌత్ ఇండియాలో ఎన్ని వేషాలు వేసినా అనుకున్న స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు. అప్పుడప్పుడు హీరోయిన్గా మెరిసిన ఆమె భారీ శరీరం ఆడియెన్స్కు కాస్త ఇబ్బందిగా మారడంతో ఆమె హీరోయిన్గా పక్కనపెట్టి ఐటెమ్ సాంగ్స్ వరకు సౌత్ ఇండియా సినిమాల్లో బాగానే వాడుకున్నారు.