S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/29/2017 - 21:53

పూరి జగన్నాధ్‌తో ఎప్పటినుంచో సినిమా చేయాలనుకున్నా. అది లేట్ అయింది. తనలో విసుక్కోవడం లాంటి అంశాలు నేను చూడలేదు. పోర్చుగల్‌లో 36 రోజులు షెడ్యూల్ చేశాము. ఈ సినిమాను 78 రోజుల్లోనే పూర్తిచేశాం అని కథానాయకుడు బాలకృష్ణ తెలిపారు. భవ్య క్రియేషన్స్ పతాకంపై పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్ రూపొందించిన చిత్రం పైసా వసూల్. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సక్సెస్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది.

08/29/2017 - 21:50

కిరణ్, దివ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘మళ్లీ వచ్చిందా’. కె.నరేంద్రబాబు దర్శకత్వంలో వెంకటేష్.సి రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో నిర్మాత ప్రసన్నకుమార్ విడుదలచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ- సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు క్రేజ్ ఎప్పటికీ ఉంటుందని, ఈ సినిమా కూడా అదే తరహాలో విజయవంతం అవుతుందని తెలిపారు.

08/29/2017 - 21:49

టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న నాగార్జున ఎప్పుడూ ప్రత్యేక శైలి కనబరుస్తాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతోపాటు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ కొత్త టాలెంట్‌ను పరిచయం చేస్తూ తనకంటూ ఓ బ్రాండ్‌ను ఏర్పర్చుకున్నాడు. మరోవైపు నిర్మాతగా కూడా ఆయన స్టైలే వేరు.

08/29/2017 - 21:46

ఈమధ్య అందాల భామ తమన్నాకు కెరీర్‌కు కాస్త బ్రేక్ పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభినేత్రి భారీ పరాజయం పాలవ్వడంతో తమన్నాకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఒకే ఒక్క తమిళ చిత్రంలో నటిస్తున్న ఈ మిల్కీ భామకు తెలుగులో క్రేజీ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే కళ్యాణ్‌రామ్ సరసన ఓ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన తమన్నా, మరోవైపు ఎన్టీఆర్ నటిస్తున్న జైలవకుశ సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు రెడీ అయ్యిందట.

08/29/2017 - 21:44

పితృస్వామ్య ఆలోచనలు పరిశ్రమలోనే కాదు, ప్రపంచాన్నీ వెంటాడుతున్నాయి. అందుకే -రీల్ లైఫ్‌లోని కొన్ని పాత్రల్ని రియల్ లైఫ్‌లో కొనసాగించలేని పరిస్థితి ఉంది. నటిగా పరిశ్రమలో సొంత గొంతు వినిపించటం అంత సులువేం కాదు’ అంటోంది హీరోయిన్ తాప్సి. ‘పింక్’, ‘నామ్ షబానా’ చిత్రాల్లో ప్రాధాన్యత కలిగిన పాత్రలు పోషించి విమర్శకుల ప్రశంసలందుకున్న 30ఏళ్ల తాప్సీ ‘జుమ్మంది నాదం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.

08/27/2017 - 22:25

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985 సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేసారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరిపిన ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో వేసిన భారీసెట్‌లో జరుపుకుంటోంది. అయితే సినిమా షూటింగ్ విషయంలో అనుకున్నట్టుగా జరగడంలేదని సుకుమార్ చాలా టెన్షన్ పడుతున్నాడట.

08/27/2017 - 22:22

కుమారి 21 ఎఫ్ సినిమాతో కుర్రకారు గుండెల్లో అలజడి రేపిన హెబ్బా పటేల్ అంటే యూత్‌లో మంచి పాపులారిటీ. ఈ అమ్మడికోసమే సినిమా చూసే ఫాన్స్ చాలామంది ఉన్నారు. తెలుగులో లేటెస్ట్‌గా రాజ్‌తరుణ్, నిఖిల్, వరుణ్ తేజ్‌లాంటి యువ హీరోలతో జతకట్టిన భామకు ఓ లక్కీ ఛాన్స్ దక్కింది. ఈమధ్యే రాజ్‌తరుణ్‌తో అందగాడు సినిమా చేసిన హెబ్బాకు అది కమర్షియల్ బ్రేక్ ఇవ్వలేకపోయింది. దాంతో టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి.

08/27/2017 - 22:20

శర్వానంద్, మెహరిన్ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం మహానుభావుడు. యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఈ నెల 24న విడుదల చేసారు. టీజర్‌కు దాదాపు అరకోటి డిజిటల్ వ్యూస్ లభించాయని నిర్మాతలు తెలియజేస్తున్నారు.

08/27/2017 - 22:19

ప్రస్తుతం రాజుగారి గది 2లో నటిస్తున్న నాగార్జున తాజాగా మరో భిన్నమైన సినిమాలో నటించేందుకు సిద్ధం అయ్యాడు ఈసారి ఆయన గ్యాంగ్‌స్టర్ గా కనిపించనున్నాడని తెలిసింది. వివరాల్లోకి వెడితే లేటెస్గుగా తమిళంలో హిట్ చిత్రంగా నిలిచిన విక్రమ్‌వేద సినిమా మంచి కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఇందులో మాధవన్, విజయ్‌సేతుపతి నటించారు.

08/27/2017 - 22:17

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన పైసా వసూల్ విడుదలకు సిద్ధం అయింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చేనెల 1న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ దుమ్మురేపుతున్నాయి. ఇక ఈ సినిమా తరువాత ఆయన ఓకే చేసిన 102వ ప్రాజెక్టు రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా సాగుతోంది.

Pages