S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఈమధ్య స్టార్స్.. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ యాడ్స్లోనూ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే సినిమా కోసం.. రెండు మూడు నెలలు కష్టపడాలి.. కానీ కమర్షియల్ యాడ్స్ అయితే రెండు మూడు రోజుల్లో నటిస్తే సరిపోతుంది. పైగా దానికి రెమ్యూనరేషన్ కూడా బాగా ఎక్కువ. లేటెస్టుగా ఈ విషయంలో సంచలనం రేపింది గ్లామర్ భామ నయనతార. కేవలం రెండు రోజుల కమర్షియల్ యాడ్ కోసం ఏకంగా 5 కోట్లు తీసుకుందట.
ఖైదీ నెం 150 విజయం తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న 3ఉయ్యాలవాడ నరసింహారెడ్డి2 చిత్రంపై అందరిలోనూ క్యూరియాసిటీ ఉంది. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుని అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా సినిమాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత రామ్చరణ్. అంతేగాక బాహుబలి తర్వాత తెలుగు సినిమాకు బాలీవుడ్లో ఆదరణ పెరిగిన నేపథ్యంలో అక్కడ సినిమాకు మార్కెట్ కల్పించేందుకు గొప్ప ప్లాన్ వేశారు.
బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుని, సంచలన విజయాన్ని అందుకున్నాడు రాజవౌళి. బాహుబలి తరువాత రాజవౌళి నెక్స్ట్ సినిమా ఏమిటనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన తదుపరి సినిమా కోసం ఎలాంటి సమాచారం లేదు. అయితే రాజవౌళి నెక్స్ట్ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త సంచలనం రేపుతోంది. అది ఏమిటంటే రాజవౌళి నెక్స్ట్ సినిమా కూడా మళ్లీ ప్రభాస్తో చేయడానికి సిద్ధమవుతున్నాడట.
పెళ్లిచూపులు ఫేమ్ విజయ్ దేవరకొండ వరు స ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ యువ హీరో బన్నీ వాసు నిర్మాణంలో గీతా ఆర్ట్స్ బ్యానర్ 2పై పరశురామ్ దర్శకత్వంలో ఒక కొత్త సినిమాని మొదలుపెట్టాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో విజయ్కు జోడీగా ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరైన లావణ్య త్రిపాఠిని తీసుకుంటున్నారట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
సుకుమార్.. సినిమాలంటే ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తాయి. ఎన్నో లాజిక్స్, మరెన్నో మ్యాజిక్స్తో ఆయన సినిమాలు తీసే విధానమే ఓ కొత్త ట్రెండ్ను క్రియేట్ చేసింది. ప్రేమలోని కొత్త కోణాన్ని, అందులో భావోద్వేగాలను గొప్పగా పండించగల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారాయన. దర్శకుడిగా ఓవైపు సినిమామలు తీస్తూనే, మరోవైపు నిర్మాతగా మారి రెండో ప్రయత్నంగా దర్శకుడు చిత్రాన్ని నిర్మించారాయన.
నందమూరి కల్యాణ్ రామ్ కథానాయకుడిగా ఈస్ట్కోస్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో కూల్ బ్రీజ్ సినిమాస్ పతాకంపై రూపొందుతున్న కొత్త చిత్రానికి సంబంధించన ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం హైదరాబాద్ రామానాయుడు స్టుడియోలో లాంఛనంగా ప్రారంభించారు. ముహుర్తం సన్నివేశానికి ఎన్టీఆర్ క్లాప్ ఇవ్వగా శ్యామ్ప్రసాద్ రెడ్డి కెమెరా స్విచాన్ చేసారు. దర్శకుడు క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. ఇటీవల చిత్రానికి అదిరిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందంటూ వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేసేలా తాజా చిత్రం శాటిలైట్ రైట్స్ రికార్డు అవౌంట్కు డీల్ కుదిరినట్టు సమాచారం.
బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి ఆనంద్ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘పైసా వసూల్’. సినిమాకు సంబంధించి విడుదల చేసిన స్టంపర్కు మంచి స్పందన వచ్చింది. సినిమా అంచనాలు పెరిగాయన్న ఉత్సాహంలో బాలకృష్ణ అభిమానులు కనిపిస్తున్నారు. చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెప్టెంబర్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
కమెడియన్ సప్తగిరి మళ్లీ హీరోగా రాబోతున్నాడు. ‘సప్తగిరి ఎక్స్ప్రెస్’ తర్వాత చేస్తున్న చిత్రం లో వైవిధ్యంగా కనిపించే మరో పాత్రతో వస్తున్నట్టు సమాచారం. మంచి కథను ఎంపిక చేసుకుని హీరోగా మరో ప్రయత్నం చేస్తున్న ఆయన, ఈసారి నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపొందించే చిత్రంలో కనిపించనున్నాడు. స్వర్ణ సుబ్బారావు దర్శకత్వంలో నట్టి కరుణ, నట్టి క్రాంతి చిత్రాన్ని రూపొందిస్తారు.
షారుక్, అనుష్క జంటగా ఆగస్టు 4న రాబోతున్న చిత్రం జబ్ హారీ మెట్ సెజెల్. ఇప్పటికే రెండు చిత్రాలతో హాట్ పెయిర్ అనిపించుకున్న ఈ జంట, ముచ్చటగా మూడో సినిమాతో ఆడియన్స్ జడ్జిమెంట్ కోసం రాబోతోంది. సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగావున్న షారుక్, అనుష్క, ఫ్లైట్లో చేస్తున్న ప్రచారాన్ని సినిమా ప్రమోషన్స్కు వాడుకోవడం ఒకింత ఆసక్తిదాయకం.