S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాహుబలి తరువాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ కోసం హీరోయిన్ ఫైనల్ కాలేదు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్గా పలువురు పేర్లు వినిపిస్తున్నాకూడా ఇంతవరకు ఎవరు ఫైనల్ కాకపోవటం విశేషం. సుజీత్ దర్శకత్వంలో 150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకోసం బాలీవుడ్ హీరోయిన్స్ను ప్రయత్నిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు కాబట్టి బాలీవుడ్ భామ అయితే బెటర్ అనే ఆలోచనలో వున్నారు.
చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్లీ లాంటి చిత్రాలతో మహిళా దర్శకురాలిగా గుర్తింపు పొందిన జయ.బి తాజాగా రూపొందించిన చిత్రం ‘వైశాఖం’. ఆర్.జె.సినిమాస్ పతాకంపై హరీశ్, అవంతిక జంటగా నటించిన ఈ చిత్రాన్ని బి.ఎ.రాజు రూపొందించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శకురాలు జయ చెప్పిన విశేషాలు..
షూటింగ్ చాలా కష్టం
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించే 151వ సినిమా కోసం జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కే ఈ చిత్రాన్ని 150 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. సురేందర్రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్కోసం అనే్వషణ సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా ఫైనల్ అయిందట.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వరుణ్తేజ్ కథానాయకుడిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ రూపొందించిన చిత్రం ‘్ఫదా’. సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. నిర్మాత రాజు ఆడియో విడుదల చేసి దర్శకుడికి తొలి కాపీ అందించారు.
తెలుగులో సైతం మంచి మార్కెట్ సంపాదించుకున్న తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం విఐపి-2 చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. జూలై 28న ఈ చిత్రం తెలుగు, తమిళంలో రిలీజ్ కానుంది. 2014లో వచ్చిన విఐపికి సీక్వెల్గా ఈ చిత్రం రూపొందింది. ఈ విఐపి ప్రాంఛైజీలో విఐపి-3, విఐపి-4 అనే ఇంకో రెండు సీక్వెల్స్ వస్తాయని ధనుష్ తెలిపారు.
రామ్చరణ్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో త్వరలో ఓ సినిమా ప్రారంభం కానుంది. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్చరణ్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని రూపొందించే కార్యక్రమాల్లో ఉన్నారు. ఇదికాకుండా మూడో సినిమాగా కొరటాల శివ దర్శకత్వంలో రామ్చరణ్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈసారి మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డితో కలిసి సంయుక్తంగా మూడవ చిత్రాన్ని నిర్మిస్తారు.
రాజ్యలక్ష్మి క్రియేషన్స్ పతాకంపై డా.వడ్డేపల్లి కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లావణ్య విత్ లవ్బాయ్స్’. పావని, కిరణ్, యోధ, సాంబ ప్రధాన పాత్రల్లో నటించారు. నర్సింలు పటేల్ చెట్టి, సి.రాజ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. యశోకృష్ణ బాణీలను అందించిన ఈ చిత్ర గీతాలు సోమవారం హైదరాబాద్లో విడుదలయ్యాయి. బిగ్ సీడీని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.రమాణాచారి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ విడుదల చేశారు.
వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం ‘కుమారి 21 ఎఫ్’ ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు సుకుమార్ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘దర్శకుడు’.
మహేష్బాబు చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘స్పైడర్’ చిత్రీకరణ చివరి దశకు చేరుకుది. ప్రస్తుతం పాటల షూటింగ్ జరుగుతుండగా టీమ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని వేగవంతం చేసింది. అభిమానులు ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న చిత్ర టీజర్ ఈ జూలై నెలాఖరున రిలీజ్ కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సౌత్ క్రేజీ భామ తమన్నా.. ప్రస్తుతం చాలా ఖుషీమీదుంది. ఎందుకంటే ఆమె సోదరుడు వివాహం జరుగుతున్న సందర్భంగా ఆ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది. తమన్నా చాలా పనులు దగ్గరుండి చూసుకుంటూ తెగ మురిసిపోతోంది. తన అన్న కల నెరవేరే రోజు వచ్చేసింది. మా కాబోయే వదిన కూడా చాలా అందంగా ఉంది అంటూ మురిసిపోతోంది. ‘మరి..