S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
తమిళ స్టార్ హీరో విజయ్, కీర్తి సురేష్ జంటగా జగపతి బాబు ముఖ్యపాత్రలో భారతం దర్శకత్వంలో తమిళంలో విడుదల సూపర్హిట్ సాధించిన భైరవ చిత్రాన్ని పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు ఏజెంట్ భైరవ పేరుతో అందిస్తున్నారు. ఈ సినిమా 7న విడుదలకానున్న సందర్భంగా నిర్మాత రామకృష్ణారెడ్డి చెప్పిన విశేషాలు..
మెగాస్టార్తో ఖైదీ నెం 150 సినిమా తీసి మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న మాస్ దర్శకుడు వినాయక్, ఆ సినిమా వచ్చి చాలా రోజులైనా ఆయన తర్వాతి సినిమా ఏదీ సెట్స్పైకి రాలేదు. ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయిధరమ్తో సినిమా ప్లాన్ చేశాడు వినాయక్. ఇప్పటికే చర్చలు జరుపుకున్న ఈసినిమా త్వరలోనే సెట్స్పైకి రానుంది. జవాన్ సినిమాలో నటిస్తున్న సాయిధరమ్తో వినాయక్ చేసే సినిమా కన్ఫర్మ్ అయింది.
అందాల నాయిక తాప్సీకి బాలీవుడ్లో మంచి గుర్తింపే వస్తోంది. దక్షిణాదిలో ఎన్ని సినిమాలు చేసినా సరైన గుర్తింపు సక్సేస్ అందలేదు. బాలీవుడ్కు వెళ్లిపోయిన ఆమె పలు సినిమాలకు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దీంతోపాటు బాలీవుడ్ హీరోతో ఘాటైన ప్రేమాయణం కూడా నడిపిస్తోందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. తాజాగా తాప్సీ ప్రేమికుడితో కలిసి ఓ మ్యూజిక్ వీడియోలో నటించిందట.
ఎన్టీఆర్ నటిస్తున్న జై లవకుశ చిత్రంపై తెలుగు సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తారక్ త్రిపాత్రాభినయం చేస్తుండటంతో అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. దర్శకుడు బాబి కూడా ఆ అంచనాలను అందుకునేలా అన్నిరకాల థ్రిల్లింగ్ అంశాలతో సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది.
పవర్స్టార్ పవన్కళ్యాణ్ హీరోగా క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ రూపొందిస్తున్న సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరిపారు. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నారు. మరో నాలుగు రోజులపాటు ఇక్కడే షూటింగ్ జరిపి తదుపరి షెడ్యూల్ను బల్గేరియాలో జరపనున్నారు. ఈ షూటింగ్ కోసం యూనిట్ బల్గేరియా వెళ్లనుంది.
భవ్య క్రియేషన్స్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘శమంతకమణి’. నారా రోహిత్, సుధీర్బాబు, సందీప్ కిషన్, ఆది హీరోలుగా నటిస్తున్నారు. చాందిని చౌదరి, జెన్ని హనీ నాయికలు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ సీడీలను విడుదల చేశారు.
నా బంగారు తల్లి చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు రాజేష్ టచ్రివర్, నిర్మాత సునీతా కృష్ణన్లు రూపొందించిన తాజా చిత్రం ‘రక్తం’. సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ ఇండీ గేదరింగ్ 2017లో అవార్డులు గెలుచుకుంది. ‘్ఫరిన్ డ్రామా ఫీచర్స్ సిగ్మెంట్’లో ఈ అవార్డు రావడం విశేషం. సంజు శివరామ, మధుశాలిని ప్రధాన తారాగణంగా నటించారు.
శ్రావ్య ఫిలిమ్స్ పతాకంపై పి.సునీల్కుమార్ రెడ్డి దర్శకత్వంలో చేతన్ మద్దినేని, డింపుల్ ప్రధాన తారాగణంగా యెక్కలి రవీంద్రబాబు, ఎం.రామ్కుమార్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘గల్ఫ్’. విడుదలకు సిద్ధమైన చిత్రం గురించి హీరో చేతన్ మద్దినేని పలు విశేషాలు తెలిపారు.
నేపథ్యం
సినిమా కోసం హీరోలు గుండు కొట్టించుకోవడం మనం ఇదివరకే చూసాం. కానీ లేటెస్టుగా ఓ హీరోయిన్ నిజంగా గుండు కొట్టించుకోవడం షాక్ కలిగిస్తుంది? ఆ వివరాల్లోకి వెళితే తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో హీరోయిన్గా నటించిన పూర్ణ, ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తోంది. అయితే ఈమెకు రావలసినంత కమర్షియల్ విజయం మాత్రం దక్కలేదు. దాంతో నటిగా ప్రూవ్ చేసుకునే పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది.
డిజిటల్ రేట్లు, థియేటర్ లీజు విధానం, మినీ థియేటర్ల నిర్మాణానికి ప్రభుత్వం నుండి 15 రోజుల్లోనే అనుమతి, చిన్న సినిమాలను పర్సెంటేజ్ పద్ధతిలో ప్రదర్శించాలని, కేంద్ర ప్రభుత్వం సినిమా పరిశ్రమపై తీసుకువచ్చిన 28శాతం జిఎస్టి వసూలు రద్దు అంశాలపై తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ రిలే నిరాహారదీక్షకు పిలుపుఇచ్చిన సంగతి తెలిసిందే.