S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇటీవల మృతి చెందారు. ఆయనకు తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఘన నివాళి అర్పించేందుకు అన్ని శాఖలు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం చాంబర్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ- తెలుగు పరిశ్రమకు పెద్ద దిక్కుగా వున్న గురువు దాసరిగారి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు.
విశ్వరూపం సినిమాలో న్యూక్లియర్ సైన్స్ చదువుకున్న గృహిణి పాత్రలో నటించి ఆకట్టుకున్న పూజాకుమార్, ఆ తరువాత ఉత్తమ విలన్ సినిమాలో కూడా నటించింది. కాస్త గ్యాప్ తరువాత ఆమె తాజాగా రాజశేఖర్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న గరుడ వేగ చిత్రంలో నటిస్తోంది. విలక్షణమైన పాత్రలో రాజశేఖర్ భార్యగా, ఆరేళ్ల బాబుకు తల్లి పాత్రలో నటిస్తోంది.
బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్నాడు ప్రభాస్. ఈ సినిమాతో ఇండియన్ సూపర్స్టార్గా ఎదిగాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సాహో’ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపింది. అత్యంత భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కే ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయంపై సందేహాలు నెలకొన్నాయి.
భిన్నమైన సినిమాల్ని తెరకెక్కిస్తూ దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. గత ఏడాది జెంటిల్మాన్ సినిమాతో విజయాన్ని అందుకున్న ఆయన, తాజాగా రూపొందించిన చిత్రం ‘అమీ తుమీ’. అవసరాల శ్రీనివాస్, అడవి శేష్, వెనె్నల కిశోర్, ఈషా ముఖ్యపాత్రల్లో రూపొందిన ఈ చిత్రం ఈ రోజు విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు మోహనకృష్ణ చెప్పిన విశేషాలు..
అష్టాచమ్మలా
బాహుబలిగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్, ఇప్పుడు తన స్టైల్ను మార్చాడు. ఆయన నటిస్తున్న సాహో చిత్రం కోసం ఈ గెటప్ను క్రియేట్ చేశారట. ప్రస్తుతం ప్రభాస్ కొత్త లుక్ సోషల్ మీడియాలో అందరినీ ఆకర్షిస్తోంది.
ఊర్మిళ గుర్తుందా? 90వ దశకంలో బాలీవుడ్లో సంచలనం రేపిన హీరోయిన్. ఆమె అందాలకు దాసోహం అనని ప్రేక్షకుడు లేడు. ఊర్మిళ రాకతో బాలీవుడ్ కొత్త గ్లామర్ని సంతరించుకుంది. ఊర్మిళ నటించిన రంగీలా పెద్ద సంచలనం. వర్మ పరిచయం చేసిన ఊర్మిళ బాలీవుడ్లో చాలా రోజులు హీరోయిన్గా ఓ వెలుగు వెలిగింది. ఆ తర్వాత కర్జ్ సినిమా తరువాత బాలీవుడ్కి దూరం అయిన ఈ నలభై ఏళ్ళ అమ్మడు ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది..
శ్రీమురళి, రచితారామ్ జంటగా చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వంలో ధర్మశ్రీ ఎంటర్ప్రైజెస్ పతాకంపై మంజునాధ్ నిర్మించిన రథావరం చిత్రాన్ని తెలుగులోకి అనువదిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాత మంజునాధ్ వివరాలు తెలియజేస్తూ- రథావరం అంటే సంస్కృతంలో నమ్మినబంటు అని అర్థం. ఇది యూత్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కింది.
అప్పట్లో బాలీవుడ్లో విడుదలైన క్వీన్ చిత్రం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నో అవార్డులతోపాటు రివార్డులను అందుకున్న ఈ చిత్రంలో బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్ టైటిల్ పాత్ర పోషించి జాతీయ అవార్డు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు నటుడు నిర్మాత త్యాగరాజన్.
ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఆయనకు సంతాప సభను బుధవారం ఫిలింనగర్ క్లబ్లో నిర్వహించారు.
సూపర్స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాలా’. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవలే ముంబైలో ప్రారంభమైన విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకున్న ఈ షెడ్యూల్ బుధవారంతో ముగిసింది. ఈ షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలతోపాటు ముంబైలోని మెరైన్ డ్రైవ్ వద్ద యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించారు.