S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. పవన్ ట్విట్టర్ అకౌంట్ పాస్వర్డ్ను దొంగిలించిన హ్యాకర్లు, ఆ తర్వాత పవన్ తన ఖాతాను యాక్సిస్ చేయలేని విధంగా చేశారు. మొదట ఏదో సాంకేతిక సమస్య అయి ఉంటుందని అనుకొన్నా, తర్వాత అకౌంట్ హ్యాక్ అయిందని గుర్తించిన వెంటనే తన స్ట్ఫాను అలెర్ట్ చేశారు.
నాగచైతన్య, రకుల్ప్రీత్సింగ్ జంటగా అన్నపూర్ణ సినీ స్టూడియోస్ పతాకంపై కళ్యాణకృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున రూపొందిస్తున్న చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ఈ చిత్రాన్ని వేసవి కానుకగా 26న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్కు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినట్టు దర్శకుడు కురసాల తెలిపారు.
మాజీ ప్రధాని మర్డర్ కేసును రానా చేధించనున్నాడా? అంటే అవుననే అంటోంది ఇండస్ట్రీ. హీరో రానాకు మాజీ ప్రధాని మర్డర్ కేసుకు సంబంధమేమిటనే ప్రశ్న వేయక్కర్లేదు. ఎందుకంటే -రాజీవ్ మర్డర్ కేసు బ్యాక్గ్రౌండ్తో నిర్మించబోయే చిత్రంలో రానా సిబిఐ అధికారి పాత్ర పోషించబోతున్నాడన్న న్యూస్ సెనే్సషన్ అవుతోంది.
బాహుబలి, భజరంగీ భాయ్జాన్ వంటి భారీ సినిమాలకు కథలు అందించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన రచయిత విజయేంద్రప్రసాద్. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీవల్లీ’. సైంటిఫిక్ థ్రిల్లర్గా రూపొందించిన చిత్రం జూన్ మొదటివారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ ‘నిజానికి ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది.
ఆదిత్య, రిచా జంటగా భాస్కర్ బంటుపల్లి దర్శకత్వంలో ఆదిత్య క్రియేషన్స్ పతాకంపై లక్ష్మి రూపొందిస్తున్న చిత్రం ‘జూన్ 1:43’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో విడుదల చేశారు. నిర్మాత లక్ష్మి టీజర్, పాటల ప్రొమోలు విడుదలచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సినిమా చేశాం.
సుకుమార్ రైటింగ్స్ పతాకంపై ద్వితీయ ప్రయత్నంగా దర్శకుడు సుకుమార్ రూపొందిస్తున్న చిత్రం ‘దర్శకుడు’. అశోక్, ఈషా జంటగా నటించిన చిత్రానికి హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహించారు. చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటోంది. జూన్ 9న సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సుమన్ ప్రధాన పాత్రలో అల్లాణి శ్రీ్ధర్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న లఘు చిత్రం ‘రైతే రాజు’. రాజేంద్రనగర్ ఎఆర్ఐ సెంటర్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి చిత్రాన్ని ప్రారంభించారు. సుమన్, లోహిత్కుమార్పై తొలి షాట్ చిత్రీకరించారు.
తెలుగు పరిశ్రమ గర్వించదగ్గ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కె విశ్వనాథ్ను సన్మానించుకోవడం -తమను తాము గౌరవించుకోవడంగానే తెలుగు దర్శకులు భావిస్తున్నారు. భారత ప్రభుత్వం అందించే ప్రతిష్ఠాత్మక అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కళాతపస్వి కె విశ్వనాథ్ను వరించిన సందర్భంగా తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం, సినీ పరిశ్రమలోని 24 శాఖలు, ఫిలిం ఛాంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా సత్కరించనున్నాయి.
రాధ చిత్రం కుటుంబ ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారని, ఈ వేసవికి విడుదలైన చిత్రం అందరికీ ఎక్కడలేని ఆనందాన్ని అందిస్తోందని దర్శకుడు చంద్రమోహన్ అన్నారు. మహిళా ప్రేక్షకులు చిత్రాన్ని ఆదరిస్తుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. శర్వానంద్ హీరోగా బివిఎస్ఎన్ ప్రసాద్ రూపొందించిన రాధ చిత్రం ఇటీవలే విడుదలైన విషయం తెలిసిందే. చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక నిర్వహించారు.
రాహుల్, మహిమా మక్వాన్ జంట సరికొత్తగా వుందని, సినిమా అంతా ఊహకందని మలుపులతో సరికొత్త కథనంతో ఆసక్తికరంగా సాగడంతో ప్రపంచ వ్యాప్తంగా వెంకటాపురం చిత్రానికి దాదాపు ఈ మొదటి వీక్ ఎండ్కు 97 లక్షల గ్రాస్ కలెక్షన్లు లభించాయని, ఇది తమ సినిమా స్టామినాను తెలుపుతుందని నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్ తెలిపారు.