S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/30/2017 - 20:52

ఖయ్యూమ్, నందినికపూర్ జంటగా రూపొందుతున్న ‘డర్టీ గేమ్’ శరవేగంగా సిద్ధమవుతోంది. షిరిడీసాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్‌కుమార్ రూపొందిస్తున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్‌లో వుంది. నిర్మాత తాడి మనోహర్‌కుమార్ మాట్లాడుతూ ‘మంచి కథ, కథనంతో దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించారు. పక్కా ప్లానింగ్‌తో సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేశాం.

04/29/2017 - 21:31

ప్రస్తుతం దువ్వాడ జగన్నాధం సినిమాతో జోరుమీదున్న అల్లు అర్జున్, అంతే స్పీడుగా మరిన్ని చిత్రాలు చేయడానికి పథకాలు వేస్తున్నాడు. దువ్వాడ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ కూడా అదేస్థాయిలో సంచలనం రేపుతోంది. ఈ సినిమా తరువాత అర్జున్ మరో చిత్రానికి కమిటయ్యాడు. వక్కంతం వంశి దర్శకుడిగా మారుతూ తెరకెక్కించే ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది.

04/29/2017 - 21:29

చాలా గ్యాప్ తరువాత రవితేజ మళ్లీ పూర్వవైభవాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తున్న చిత్రం ‘టచ్ చేసి చూడు’. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ ప పతాకంపై విక్రం సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేన వంశి సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా సాగుతున్న ఈ చిత్రాన్ని పాండిచ్చేరిలో చిత్రీకరించారు.

04/29/2017 - 21:27

నిఖిల్, రీతూవర్మ, ఇషాకొప్పికర్ ప్రధాన తారాగణంగా శ్రీ అభిషేక్ పిక్చర్స్ పతాకంపై సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘కేశవ’. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా మే 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌కు మంచి ఆదరణ లభించింది.

04/29/2017 - 21:26

రాజశేఖర్ పోలీసు అధికారిగా గరుడవేగతో మరోసారి తన స్టైల్లో ప్రేక్షకులను అలరించనున్నాడు. ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో జ్యోస్టార్ ఎంటర్‌ప్రైజెస్ సమర్పణలో రూపొందిస్తున్న చిత్రానికి నిర్మాత కోటేశ్వరరాజు. చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. తాజాగా శృంగారతార సన్నీలియోన్‌పై చిత్రీకరించిన పాట పూర్తయ్యింది.

04/29/2017 - 21:24

సుఖీభవ మూవీస్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో ఎ గురురాజ్ రూపొందిస్తున్న చిత్రం ‘రక్షకభటుడు’. చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. కథానాయకుడు ఎవరనేది ఇప్పటివరకూ సస్పెన్స్‌గానే ఉంచిన ఈ చిత్రంలో రిచా పనయ్ కథానాయికగా నటిస్తోంది. మే ప్రథమార్థంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

04/29/2017 - 21:22

సినిమా హిట్టయినా ఫట్టయినా మనం దాన్ని పాజిటివ్‌గా తీసుకున్నప్పుడే తరువాతి ప్రాజెక్టులకు వెళ్లగలం. అలాగని ఎందుకిలా అయింది అని బాధపడుతూ కూర్చుంటే వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళతాయి. స్టార్ హీరోయిన్ అని నన్నంటుంటే విని వదిలేస్తానే కానీ తల ఎగరేయనంటోంది అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్. మనల్ని అందరూ పొగుడుతూ వుంటే వినడానికి చాలా బాగుంటుంది. కానీ అదే నిజమనుకుంటే మాత్రం ఇబ్బందులేనని తెలివిగా చెబుతోంది.

04/29/2017 - 21:20

నేటి యువతీ యువకులు ఎలా ఆలోచిస్తున్నారు? ప్రేమ అంటే వారి దృష్టిలో ఎలాంటి పదార్థం? పెళ్లి అనే పవిత్రమైన భావనకు వారు ఎంతవరకు తలఒగ్గి జీవితాన్ని గడుపుతున్నారు? అనే అంశాలు తీసుకుని రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండి బాబు’ అనే చిత్రాన్ని రూపొందించారు.

04/28/2017 - 21:02

బాహుబలిమీది గౌరవంతోనో, భయంతోనో వెనక్కి జరిగిన స్టార్ హీరోలంతా -సినిమాలు పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘బాహుబలి’ ఏప్రిల్ మొత్తాన్ని కుదిపేయడంతో -పెద్ద హీరోలు, దర్శకులు ఈనెల మొత్తాన్ని బాహుబలికే వదిలేశారు.

04/28/2017 - 20:57

గోపీచంద్ కథానాయకుడిగా జయబాలాజీ రియల్ మీడియా పతాకంపై బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. నయనతార కథానాయికగా నటించిన ఈ చిత్రం మాస్‌ను ఆకట్టుకునే అంశాలతో రూపొందుతోందని దర్శక నిర్మాతలు తెలియజేస్తున్నారు. ఫ్యామిలీ ఆడియెన్స్‌తోపాటు యూత్, మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, పేరుకి మంచి అప్లాజ్ వచ్చిందని తెలిపారు.

Pages