S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/28/2017 - 20:55

శింబు, నయనతార, ఆండ్రియా, ఆదాశర్మ ప్రధాన తారాగణంగా జేసన్‌రాజ్ ఫిలింస్ పతాకంపై పాండీరాజ్ దర్శకత్వంలో టి.రాజేందర్ రూపొందిస్తున్న చిత్రం ‘సరసుడు’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు.

04/28/2017 - 20:55

పరిశ్రమలో మంచి నిర్మాతగా, మనసున్న వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు బెక్కం వేణుగోపాల్. మున్ముందు మరిన్ని మంచి చిత్రాలు నిర్మించి అగ్ర నిర్మాత స్థాయికి ఎదగాలని క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బిఎ రాజు ఆకాంక్షించారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బెక్కం వేణుగోపాల్ జన్మదిన వేడుకలు జరిగాయి.

04/28/2017 - 20:53

జయంత్, గీతాంజలి జంటగా శే్వతాబసు ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మిక్చర్ పొట్లం’. గోదావరి సినీటోన్ పతాకంపై ఎంవి సతీష్‌కుమార్ దర్శకత్వంలో కలపటపు శ్రీలక్ష్మీప్రసాద్ రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు.

04/28/2017 - 20:51

బాహుబలి మొదటి పార్ట్ మొత్తం తమన్నా కథానాయికగా సాగింది. అవంతికగా అందాల ఆరబోతతో ప్రేక్షకులకు కనువిందు చేసింది. దేవసేనను బంధించిన మాహిష్మతి సామ్రాజ్యంపై కత్తికడుతూనే, మహేంద్ర బాహుబలి ప్రేమమయిగా ఆమె నటన ఆకట్టుకుంది. బాహుబలి-2లోనూ తమన్నా పాత్ర బాగుంటుందని అభిమానులు ఆశించారు. విడుదలకు ముందు తమన్నా ఫస్ట్‌లుక్ కూడా విడుదల కాకపోవడంతో అనుమానాలు తలెత్తాయి.

04/28/2017 - 20:49

నందు, పూజా రామచంద్రన్ జంటగా వరప్రసాద్ వరికూటి దర్శకత్వంలో హరిహర చలనచిత్ర పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘ఇంతలో ఎనె్నన్ని వింతలో’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు చిత్ర వివరాలు తెలియజేస్తూ ఇప్పటివరకు తెలుగులోరాని భిన్నమైన ప్రేమకథతో రూపొందించిన చిత్రమిది అన్నారు. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించిందన్నారు.

04/28/2017 - 20:47

రాకేష్, రమ్య జంటగా ఎఎంజె ఫిలింస్ పతాకంపై జనార్దన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘అనుకోని ఓ కథ’. ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ బెంగుళూరులో సెన్సార్ జరుపుతున్న ఈ చిత్రానికి యు/ఎ సర్ట్ఫికెట్ అందించారని, సంగీతం సినిమాలో హైలెట్‌గా ఉంటుందని తెలిపారు.

04/28/2017 - 20:45

ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ చిత్రం రానుందని ఎప్పటినుంచో వినిపిస్తున్న వార్త. ఎట్టకేలకు ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ ఏడాది చివరిలో చిత్రాన్ని ప్రారంభించనున్నారని ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్. త్రివిక్రమ్ ప్రస్తుతం పవన్‌కళ్యాణ్ సినిమాతో బిజీగా వుంటే, ఎన్టీఆర్ బాబీతో రూపొందిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాకే ఎన్టీఆర్- త్రివిక్రమ్ సెట్స్‌పై కలవనున్నారు.

04/28/2017 - 20:43

సునీల్ కథానాయకుడిగా క్రాంతిమాధవ్ దర్శకత్వంలో యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై రూపొందించిన చిత్రం ‘ఉంగరాల రాంబాబు’. మియాజార్జ్ కథానాయికగా నటించిన చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

04/26/2017 - 21:46

గ్లామర్ భామ రెజీనాకు ఈమధ్య అవకాశాలు బాగా తగ్గాయి. దానికి కారణం ఈమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో కొత్త అవకాశాలు రావడంలేదు. గ్లామర్ ఆరబోతలో ఏమాత్రం అరమరికల్లేకున్నా, ఎందుకో రెజీనాకు టైం కలిసిరావట్లేదు. రవితేజ, సాయిధరమ్‌తేజ్ లాంటి హీరోల సరసన నటించిందన్న రికార్డే తప్ప, స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం అవకాశాలు పట్టలేకపోతోంది.

04/26/2017 - 21:45

హాంకాంగ్‌లో షూటింగ్ జరుపుకుంటోన్న చిత్రం ‘లవర్స్‌తో పెట్టుకోవద్దు’. మహేష్, పియా బాజ్‌పాయ్ జంటగా ఎస్‌బికె ఫిలింస్ కార్పొరేషన్ పతాకంపై ఎస్‌కె బషీద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. చిత్రంలో దక్షిణ భారత సినిమా దిగ్గజాలు ఒక సన్నివేశంలో కనిపిస్తారని దర్శకుడు బషీద్ చెబుతున్నాడు. ‘హాంకాంగ్ సీన్లన్నీ ఆహ్లాదంగా ఉంటాయి.

Pages