S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కుమారి ఎఫ్ 21తో మురిపించిన హిట్పెయిర్ రాజ్తరుణ్, హెబ్బాపటేల్ మళ్లీ వస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తోన్న చిత్రం అందగాడు. వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. పోస్టర్కు మంచి రెస్పాన్స్ రావడంతో, ఆ ఉత్సాహంతోనే చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు.
బాహుబలి. ఐదేళ్లుగా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోన్న సినిమా. చరిత్రలో ఇన్నిరోజులు ఒక సినిమా గురించి మాట్లాడుకున్న దాఖలాలు లేవు. ఆ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు రాజవౌళి. బాహుబలి -ది బిగినింగ్ ఒక సెనే్సషన్. సీక్వెల్గా వస్తోన్న బాహుబలి -ది కన్క్లూజన్ మరో సెనే్సషన్.
కథానాయిక ప్రాధాన్యత వున్న సినిమాల్లో వరుసగా గ్లామర్ డాల్గాను, మరోవైపు ఉత్తమ నటిగానూ గుర్తింపు పొందిన అనుష్క గొప్ప నటి కాదని దర్శకుడు రాజవౌళి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ‘ఆమె గొప్ప నటి అని చెప్పలేం కానీ ప్రొఫెషనల్ నటి అని మాత్రం చెప్పగలను. చెప్పిన విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆకళింపు చేసుకొని నటించే ప్రయత్నం చేస్తుంది. ఎవరితో ఎలా మసలుకోవాలో ఆమెకు తెలిసినట్లుగా మరెవరికి తెలియదని నా ఉద్దేశ్యం.
నరసింహ చిత్రంలో నీలాంబరిని మర్చిపోలేం. దాదాపు మూడు దశాబ్దాలుగా సక్సెస్ఫుల్ కెరీర్ కొనసాగిస్తున్న రమ్యకృష్ణను ఒక రేంజ్కు తీసుకెళ్లిన పాత్ర అది. నీలాంబరిని మరిపించే పాత్రనూ మళ్లీ రమ్యకృష్ణే చేసింది. అది బాహుబలిలో శివగామి పాత్ర. ఆ క్యారెక్టర్కు ఆమే కరెక్టని జక్కన్న పెట్టుకున్న నమ్మకాన్ని నూరుశాతం నిజం చేసింది.
లక్కీ మీడియా పతాకంపై నిర్మాత బెక్కం వేణుగోపాల్ మరో రెండు చిత్రాలు నిర్మించనున్నట్టు ప్రకటించారు. రెండు ప్రాజెక్టులు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్నాయి. పుట్టిన రోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఇద్దరు కొత్త దర్శకులు హర్ష, నరేష్లకు అవకాశం కల్పిస్తూ రెండు చిత్రాలను నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.
ప్రయోగాలు చేయడానికి ఈతరం హీరోలు సిద్ధమవుతున్నారు. స్టార్ హీరో ఇమేజ్ని పూర్తిగా పక్కనపెట్టేసి -కథానుగుణంగా జాలరి పాత్రతో సినిమా చేస్తున్నాడు రామ్చరణ్. సుకుమార్ దర్శకత్వంలో చేస్తున్న రూరల్ రొమాంటిక్ లవ్ డ్రామా బుధవారంతో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
గద్దర్.. తెలంగాణ పోరాటంలో తన పాటతో ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిన ప్రజా గాయకుడు. ఆయన పాటలంటే ఇష్టపడనివారుండరు. విప్లవ నేతగా ఖ్యాతి తెచ్చుకున్న గద్దర్ అడపాదడపా సినిమాలకు పాటలు రాస్తున్న విషయం తెలిసిందే. ‘బండెనకబండిగట్టి/ పదహారు బండ్లుగట్టి’ పాట పాపులార్టీని ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈమధ్యే ‘జై బోలో తెలంగాణ’ సినిమా కోసం ‘పొడుస్తున్న పొద్దు మీద’ అనే పాటతో మరో సంచలనం సృష్టించాడు.
పిశాచి-2 చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను భయపెడుతోందని, కలెక్షన్లు ఆశించిన స్థాయిలో ఉన్నాయని నిర్మాత సాయివెంకట్ అన్నారు. సినిమా బావుందన్న వౌత్టాక్ రోజురోజుకూ పెరుగుతుండటంతో మంచి వసూళ్లు వస్తున్నాయన్నారు. స్వర్ణ్భారతి క్రియేషన్స్ పతాకంపై ఆయన రూపొందించిన పిశాచి-2కు కలెక్షన్లు పెరిగిన నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను హైదరాబాద్లో నిర్మాత సన్మానించారు.
అచ్చతెలుగు చిత్రాలను రూపొందించిన దర్శక రుషి కె విశ్వనాధ్కు ప్రతిష్ఠాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రావడం తెలుగు వ్యక్తికి గర్వకారణమని నటుడు పవన్కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్లోని కె విశ్వనాధ్ స్వగృహానికి వెళ్లి గౌరవ సూచికంగా పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు.
సందీప్కిషన్, రెజీనా జంటగా కృష్ణవంశి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘నక్షత్రం’. ఈ చిత్రానికి సంబంధించిన ఒక్క పాట మినహా షూటింగ్ పూర్తిచేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరిపి మే నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. వరుస పరాజయాల తరువాత దర్శకుడు కృష్ణవంశి ఈ చిత్రంతో భారీ విజయం సాధించాలన్న లక్ష్యంతో కష్టపడుతున్నారు.