S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
జాతీయ నటుడు కమల్హాసన్ సోదరుడు చంద్రహాసన్ (82) ఈనెల 18న గుండెపోటుతో మరణించారు. లండన్లోని తన కుమార్తె అనూ హాసన్వద్ద నివసిస్తున్న ఆయన భార్య గీతామణి కూడా ఈమధ్యే మరణించారు. చంద్రహాసన్ రాజ్కమల్ ఫిలిమ్స్ సంస్థ తరఫున వ్యవహార బాధ్యతలు నిర్వహించేవారు. ముఖ్యంగా కమల్హాసన్తో‘నలదమయంతి’, ‘విరుమంద’, ‘విశ్వరూపం’, ‘ఉత్తమ విలన్’ వంటి చిత్రాల్ని నిర్మించారు.
మంచు విష్ణు, బ్రహ్మానందం ముఖ్య పాత్రల్లో జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో పద్మజ పిక్చర్స్ పతాకంపై కీర్తిచౌదరి, కిట్టు నిర్మిస్తున్న ‘ఆచారి అమెరికా యాత్ర’ చిత్రం ఆదివారం తిరుపతిలో ప్రారంభమైంది. మంచు విష్ణు, బ్రహ్మానందంలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మాజీ కేంద్రమంత్రి సుబ్బిరామిరెడ్డి క్లాప్నివ్వగా రాజకీయవేత్త రఘురామరాజు కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
మిల్కీ భామ తమన్నా ఫోకస్ ఈమధ్య బాలీవుడ్పై పడింది. సౌత్లో టాప్ హీరోయిన్గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న తమన్నా హిందీలో సైతం స్టార్గా రాణించాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా హిందీలో మరో ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు ఈమధ్యే ఎన్నో ఆశలు పెట్టుకుని తెలుగులో చేసిన ‘అభినేత్రి’ చిత్రం భారీ పరాజయాన్ని అందుకోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయింది. అయితే ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాడు ప్రభుదేవ.
సంజీవ్, చేతనా ఉత్తేజ్, కారుణ్య, నందు ముఖ్య పాత్రల్లో వి.శశిభూషణ్ దర్శకత్వంలో శ్రీవత్స క్రియేషన్స్ పతాకంపై కమల్కుమార్ పెండెం నిర్మించిన పిచ్చిగా నచ్చావ్ చిత్రం శుక్రవారం విడుదలై మంచి టాక్తో రన్అవుతున్న సందర్భంగా ఆదివారం చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత కమల్కుమార్ మాట్లాడుతూ సినిమాను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని అన్నారు.
కృష్ణచైతన్య, రాజేష్ రాధోడ్, మోనికాసింగ్, షాలూ చారసియా ప్రధాన తారాగణంగా బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కిశోర్ రూపొందిస్తున్న చిత్రం ‘ఓ పిల్లా నీవల్లా’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు.
పవన్కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్సింగ్ చిత్రం భారీ పరాజయాన్ని చవిచూడడంతో ఆ సినిమా కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించిన సంపత్కుమార్కు తీరని నష్టం వాటిల్లింది. ఆ తరువాత ఈ చిత్ర నిర్మాతలు తమ తదుపరి చిత్రానికి సంబంధించిన హక్కులు తనకే ఇస్తామంటూ మాట ఇచ్చి తప్పడంతో డిస్ట్రిబ్యూటర్ సంపత్కుమార్ నిరాహారదీక్ష సాగిస్తున్నారు.
పవన్కల్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో నార్త్స్టార్ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై శరత్మరార్ నిర్మించిన ‘కాటమరాయుడు’ ప్రి రిలీజ్ ఫంక్షన్పై రామ్చరణ్ ట్విట్టర్లో స్పందించారు. శనివారం రాత్రి జరిగిన ఈ వేడుక ‘పవర్ప్యాక్డ్’గా సాగిందని, మనందరి కాటమరాయుడు వస్తున్నాడని ట్వీట్ చేశారు. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 24న విడుదల చేయనున్నారు.
చేసిన ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్లకు పోటీగా నిలబడింది అందాల భామ కీర్తి సురేష్. రామ్ హీరోగా వచ్చిన ‘నేను శైలజ’ చిత్రంతో టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా మారింది. ఆ తరువాత లేటెస్టుగా ‘నేను లోకల్’ అంటూ మరో ఘనవిజయాన్ని అందుకున్న కీర్తికి ఇప్పుడు టాలీవుడ్లో హాట్ ఫేవరేట్ అయింది. ఇప్పటికే ఆమెతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు సైతం క్యూ కడుతున్నారు.
ప్రస్తుతం రోబో 2.0 చిత్రంతో బిజీగా ఉన్నాడు రజనీకాంత్. ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తిస్తున్న ఈ చిత్రం దీపావళికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ‘కబాలి’ వంటి సంచలన చిత్రాన్ని తెరకెక్కించిన పారంజిత్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు తెలిసింది.
పవన్కల్యాణ్, శృతిహాసన్ జంటగా నార్త్స్టార్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కిషోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్ మరార్ రూపొందిస్తున్న చిత్రం ‘కాటమరాయుడు’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈనెల 24న విడుదల చేయనున్నారు.