S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

02/02/2017 - 20:48

అంజలి ప్రధాన పాత్రలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ ద్రావిడన్స్ పతాకంపై అశోక్ దర్శకత్వంలో గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘చిత్రాంగద’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.

02/02/2017 - 20:46

తమిళంలో ‘్ధరువంగల్ పదినారు’ (డి 16) పేరుతో ఇటీవల విడుదలై సంచలన విజయం సాధించిన తమిళ చిత్రాన్ని తెలుగులో ‘16-ఎవ్వెరీ డీటెయిల్ కౌంట్స్’ పేరుతో అనువదిస్తున్నారు. మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత పద్మావతి మాట్లాడుతూ- ‘తమిళంలో ఇటీవల రిలీజై ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ‘్ధరువంగల్ పదినారు’ చిత్రాన్ని తెలుగులో ‘16-ఎవ్వరి డీటెయిల్ కౌంట్స్’ పేరుతో అనువదిస్తున్నాం.

02/02/2017 - 20:44

ఇర్ఫాన్‌ఖాన్, టబు వంటివారికి ఎన్నో హాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. త్వరలో ప్రియాంకా చోప్రా నటించిన బేవాచ్ సినిమాకి భారీ పబ్లిసిటీ చేస్తున్నారు. ఈమధ్యనే ట్రిపుల్ ఎక్స్ సినిమాలో టాప్ హీరో విన్ డీజిల్ పక్కన దీపికా పదుకొనె నటించింది. ఆ సినిమా ప్రమోషన్ కోసం విన్ డీజిల్ ఇండియాకి రావడం, దీపికాని ఆకాశానికి ఎత్తి పొగిడేయడం చూశాం. మొత్తానికి ఆ ఒక్క సినిమాతో దీపికా ఎంతో ఖుషీగా ఉంది.

02/02/2017 - 20:43

ఈమధ్యకాలంలో అంతగా కనిపించడం లేదు కత్రినా కైఫ్. రణబీర్‌తో చేసిన జగ్గా జూసూస్ సినిమా ఏప్రిల్‌లో విడుదల కాబోతుండగా, సల్మాన్ హీరోగా నటించనున్న టైగర్ జిందా హై అనే మరో సినిమాలోనూ చేస్తోంది. ముఖ్యంగా డాన్సుల విషయంలో ఆరితేరడానికి తెగ వర్కవుట్స్ చేసేయడం.. నాట్యం కోసం బాగా కష్టపడిపోవడంతో ఈమె మరింత అందంగా కనిపిస్తోందట! తాజాగా దర్శకుడు అనురాగ్ బసు ఇంట్లో జరిగిన సరస్వతీ పూజకు చాలామంది సెలబ్రిటీలు రాగా..

02/02/2017 - 20:40

శ్యామ్, శ్రీకీర్తిక, సుమన్ ప్రధాన తారాగణంగా నవ్య మూవీ మేకర్స్ పతాకంపై తోట కృష్ణ స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం ‘నీలంపాటి అమ్మోరు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ హాల్‌లో జరిగింది. శాసనసభ్యుడు రసమయి బాలకిషన్ ఆడియో సీడీని విడుదల చేసి తొలి కాపీని నటుడు సుమన్‌కు అందించారు.

02/01/2017 - 22:01

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై. లి. పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. ఈ చిత్రం షూటింగ్‌తోపాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తిచేసుకొని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియోకు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది.

02/01/2017 - 21:58

విజయ్ ఆంటోనీ హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో లైకా ప్రొడక్షన్స్, ద్వారకా క్రియేషన్స్ పతాకాలపై జీవ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘యమన్’ చిత్రాన్ని మిర్యాల రవీందర్‌రెడ్డి తెలుగులో అందిస్తున్నారు. శివరాత్రికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ,‘ఇటీవల విడుదలైన టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

02/01/2017 - 21:56

ప్రముఖ తెలుగు రచయిత డా కేశవరెడ్డి నవల ‘అతడు అడవిని జయించాడు’ సినిమాగా రూపొందనుంది. బి.ఎస్.ఎన్. ఫిలింస్ పతాకంపై దూలం సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. పలు నిర్మాణ సంస్థల భాగస్వామ్యంతో రూపొందనున్న ఈ చిత్రం అంతర్జాతీయ సినిమా వేడుకల మీద పోటీపడేలా రూపొందిస్తున్నామని, ఇప్పటికే హాలీవుడ్ సాంకేతిక నిపుణులతో చర్చలు జరిపామని దర్శకుడు దూలం సత్యనారాయణ అన్నారు.

02/01/2017 - 21:46

ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ సక్సెస్ తర్వాత గ్యాప్ తీసుకుని బాబీ సినిమాకి ఒప్పుకున్నాడు. నటుడు కళ్యాణ్‌రామ్ నిర్మించే ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రారంభోత్సవం జరుపుకుని, 15వ తేదీన రెగ్యులర్ షూటింగ్‌కు వెళుతుంది. ఈ చిత్రంలో తారక్ సరసన హీరోయిన్లుగా పలువురి పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో కళ్యాణ్‌రామ్ మరో ప్రకటన చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడీగా రాశీఖన్నా నటించనుందట.

02/01/2017 - 21:46

కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు అయిన ప్రభుదేవా వరుస సినిమాలకు సైన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభుదేవా నూతన దర్శకుడు అర్జున్‌తో కలిసి ఓ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్లాన్ చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. ప్రభుదేవా మరో కొత్త సినిమాకి కూడా రెడీ అయ్యారట. తమిళ దర్శకుడు శీను రామస్వామి కొన్నాళ్ల క్రితం ప్రభుదేవా కోసం ఓ కథను సిద్ధం చేశాడు. ఇప్పుడు ఆ కథే సినిమాగా రూపుదిద్దుకోనుంది.

Pages