S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలీవుడ్ ఫైర్బ్రాండ్గా ఇమేజ్ తెచ్చుకున్న హాట్ భామ కంగనా రనౌత్కు ఈమధ్య పెద్దగా సినిమాలు లేవు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ అమ్మడు సినిమా వాళ్ళపై ఘాటు కామెంట్స్ చేస్తూ నానా హంగామా చేసింది.
నవీన్ సంజయ్, తనిష్క్ తివారి ప్రధాన తారాగణంగా బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై ప్రేమ్రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి రూపొందించిన చిత్రం ‘శరణం గచ్ఛామి’. ఈ చిత్రాన్ని సెన్సార్కు పంపించగా, అసభ్యత, అశ్లీలతకు పెద్దపీట వేస్తూ హింసను ప్రేరేపిస్తూ, యువతను పెడదారి పట్టించేలా ఈ చిత్రం రూపొందించారన్న అభియోగంపై సెన్సార్ బోర్డు వారు సర్ట్ఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు.
శ్రీ సిద్ధి సెవెన్ హిల్స్ క్రియేషన్స్ బ్యానర్పై అర్జున్, క్రాంతిచంద్, అవితేజ్, ప్రదీప్, కోయల్దాస్, సుపూర్ణ ప్రధాన తారాగణంగా రూపొందుతున్న చిత్రం ‘చంద్రుళ్ళో ఉండే కుందేలు’. వెంకటరెడ్డి ఉసిరిక దర్శకత్వంలో ధన శ్రీనివాస్ జామి, లక్ష్మీ వెంకటరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ చిత్రం ప్రారంభమైంది. అడివి శేష్, అవసరాల శ్రీనివాస్ కథానాయకులుగా ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై కె.సి.నరసింహారావు రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ముహూర్తపు సన్నివేశంపై శివలెంక కృష్ణప్రసాద్ క్లాప్నివ్వగా, వినయ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తనికెళ్ల భరణి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.
కిషోర్ స్వీయ దర్శకత్వంలో కృష్ణచైతన్య, రాజేష్ రాధోడ్, మోనికా సింగ్, షాలు చారసియా నటీనటులుగా బిగ్ విగ్ మూవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మిస్తున్న చిత్రం ‘ఓ పిల్లా నీవల్లా’. ఈనెలలో ఆడియోను, మార్చిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ మోషన్ పోస్టర్ని లాంచ్ చేశారు. ‘ఓ పిల్లా నీవల్లా’ పోస్టర్ క్యూరియస్గా వుందని పూరి ప్రశంసించారు.
మహేష్బాబు నటిస్తున్న తాజా సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దక్షిణాదిలో మంచి క్రేజ్ ఉన్న ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి కీలక షెడ్యూల్ నెల రోజులుగా హైదరాబాద్లో జరుగుతూ వస్తోంది. మంగళవారం ఈ షెడ్యూల్ను పూర్తయింది. ఈ షెడ్యూల్లో మహేష్తోపాటు హీరోయిన్ రకుల్ ప్రీత్సింగ్, విలన్ ఎస్.జె.సూర్య తదితరులు పాల్గొనగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
కమల్ కల్యాణ్ మూవీ మేకర్స్ పతాకంపై సూర్య శ్రీనివాస్, అక్షయ్ కూరపాటి, దివ్య, ప్రవల్లిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘చెన్నయ్ చైత్రమా..’. కమల్ కల్యాణ్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రసాద్ ల్యాబ్స్లో ఈ సినిమా టైటిల్ లోగో లాంచ్ జరిగింది. నిర్మాతలు రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ టైటిల్ లోగోను ఆవిష్కరించారు.
అన్నమయ్య చిత్రం నా కెరీర్లో ఓ మైల్స్టోన్లా నిలిచింది. మళ్లీ అలాంటి కథతోనే సినిమా చేస్తే బాగోదనుకున్నా. దర్శకుడు ఈ కథ చెప్పినప్పుడు ఆసక్తిలేకపోయినా భిన్నమైన స్క్రిప్ట్గా అనిపించింది. డిఫరెంట్ స్క్రీన్ప్లేతో సాగే ఈ చిత్రం గత చిత్రాల పోలికలతో ఉండదు. అందుకే ‘ఓం నమో వెంకటేశాయ’ చేశాను.. అని అక్కినేని నాగార్జున తెలిపారు.
సహజత్వం ఉట్టిపడే నటనతో, అచ్చంగా మన పక్కింటి అబ్బాయిలా, మన ఇంటి అబ్బాయిగా ఇమేజ్ తెచ్చుకున్నాడు నాని. అటు కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు భిన్నమైన పాత్రలు చేస్తూ సక్సెస్ రేటింగ్ని పెంచుకుంటున్నాడు. తాజాగా నాని నటించిన చిత్రం ‘నేను లోకల్’. నిర్మాత దిల్రాజు సమర్పణలో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్పై శిరీష్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కానుంది.
జయ బి. దర్శకత్వంలో ఆర్.జె. సినిమాస్ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ‘వైశాఖం’ చిత్రం షూటింగ్ పూర్తి కావడంతో ప్రస్తుతం ఎడిటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దర్శకురాలు జయ బి. మాట్లాడుతూ, ‘కుటుంబ సభ్యులంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే మంచి సినిమాగా ‘వైశాఖం’ రూపొందుతోంది. లవ్లీ తర్వాత మళ్ళీ సిట్ సినిమా ఇవ్వాలన్న లక్ష్యంతో మంచి కథాంశంతో రూపొందిస్తున్న సినిమా ఇది.