S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
గోపిచరణ్, ఐశ్వర్య హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘నేత్ర’. మై స్వీట్ హార్ట్ అనేది ట్యాగ్లైన్. రామ్ క్రియేషన్స్ పతాకంపై పీరికట్ల రాము నిర్మిస్తున్నారు. రెడ్డెం యాదకుమార్ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదలకు సిద్ధమైంది. నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ.. ‘అన్నివర్గాల ప్రేక్షకులు నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది.
పూర్ణ, అభినవ సర్దార్, అభిమన్యుసింగ్ ముఖ్య పాత్రల్లో కాలింగ్బెల్ చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పన్నారాయల్ దర్శకత్వంలో డ్రీమ్ క్యాచర్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అశోక్ మంద, రాజ్దళవాయి, టోనీ నిర్మిస్తున్న చిత్రం ‘రాక్షసి’. ప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. న్యూయార్క్లో గ్రాఫిక్స్ వర్క్ను జరుపుతున్నారు.
నీలిమ ప్రొడక్షన్స్ పతాకంపై ఆనంద్ కృష్ణ, స్వరూప హీరోహీరోయిన్లుగా బేబీ హర్షిత ప్రధాన పాత్రలో ఆనంద్కృష్ణ నిర్మాతగా సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో భక్తిరస చిత్రం ‘నీలిమలై’ వనపర్తి పరిసర ప్రాంతాలలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంది. ఈ సందర్భంగా నిర్మాత మరియు హీరో ఆనంద్ కృష్ణ మాట్లాడుతూ..
ఖైదీనెం.150లో రాయ్లక్ష్మి చేసిన ‘రత్తాలు రత్తాలు’ ఐటెమ్ సాంగ్ యువతకు గిలిగింతలు పెట్టింది. ఇప్పటివరకూ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న రాయ్లక్ష్మి ఇపుడు ‘ఐటెమ్ గర్ల్’ బిరుదును జీర్ణించుకోలేకపోతోంది. హీరోయిన్కన్నా ఐటెమ్ పాటే బాగా చేసిందని అంతా ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలా పొగిడిన నిర్మాతలు కొందరు తమ చిత్రంలో ఓ ఐటెమ్ పాత్రలో నటించమని అడుగుతున్నారట!
గోపిరంగా, మాళవిక మీనన్, శివాజీరాజా ప్రధాన పాత్రధారులుగా గాయత్రి రీల్స్ బ్యానర్పై రూపొందుతోన్న చిత్రం ‘అమ్మాయిలంతే.. అదో టైపు’. కృష్ణం దర్శకత్వంలో వై.వి.ఎస్.ఎస్. ఆర్.కృష్ణంరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత వై.వి.ఎస్.ఎస్.ఆర్.కృష్ణంరాజు మాట్లాడుతూ ‘అమ్మాయిలంతే..
టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న హాట్ భామ శ్రీయకు ఈమధ్య కెరీర్ బాగా వెనక్కివెళ్లింది. గ్లామర్ డోస్ పెంచుతూ చేసిన సినిమాలు కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. దాంతో సినిమా ఛాన్సులు కూడా రావడం లేదు. తాజాగా బాలకృష్ణ సరసన గౌతమిపుత్ర శాతకర్ణిలో వశిష్టాదేవిగా నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్పై ఫోకస్ పెట్టినట్టుంది. అందుకే ఈ సినిమా తరువాత గ్లామర్ లుక్లో ఫొటో షూట్ ఇచ్చింది.
సంచలన తార నయనతారకు ఈమధ్య కోలీవుడ్లో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా నయనతారకు ఉన్న ఫాలోయింగ్ను చూసి షాకవుతున్నారట సినిమా జనాలు. తమిళ జనాలకు నయనతార అంటే ఇంత క్రేజ్ ఎందుకు కలిగిందో అనే ఆసక్తి అందర్లో నెలకొంది. ఈమధ్య నయనతార నటించిన సినిమాలంటే జనం అమిత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారట. నయనతార ఉంటే చాలు ఆ సినిమా ఘన విజయం సాధించడం ఖాయమనే సెంటిమెంట్ బలపడుతోంది.
శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ హీరో హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై సతీష్ వేగేశ్న దర్శకత్వంలో దిల్రాజు నిర్మించిన చిత్రం ‘శతమానం భవతి’. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం సక్సెస్ మీట్ శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. నిర్మాత దిల్రాజు తనతో తొలి చిత్రం ‘దిల్’ను డైరెక్ట్ చేసిన వినాయక్కు చిరంజీవి చేతుల మీదుగా సన్మానం చేయించారు. దిల్రాజు తల్లిదండ్రులను కూడా సన్మానించారు.
రామ్, వరుణ్, దివ్య, ప్రియ ప్రధాన తారాగణంగా పులికొండ పిక్చర్స్ పతాకంపై నల్లూరు శ్రావణ్ దర్శకత్వంలో రామ్ రూపొందిస్తున్న ఈనాడు చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. మాజీ డిజిపి దినేష్రెడ్డి నటీనటులపై క్లాప్నిచ్చారు.
తమిళ, తెలుగు పరిశ్రమల్లో స్టార్ హీరోగా మంచి మార్కెట్ను సంపాదించుకున్న హీరో విశాల్ త్వరలో మలయాళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అది కూడా మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రంతో కావడం విశేషం. ఈ విషయాన్ని స్వయం మోహన్లాల్ తన ఫేస్బుక్ ద్వారా తెలుపుతూ- ‘త్వరలో నేను చేయబోయే చిత్రంలో తమిళ హీరో విశాల్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్నాడు’ అని పేర్కొన్నారు.