S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న భక్తిరస చిత్రం ‘ఓం నమో వెంకటేశాయ’ వచ్చే నెల 10న విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాను హథీరాం బాబా జీవిత కథతో తెరకెక్కిస్తున్నారు. రొమాంటిక్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న నాగార్జున అన్నమయ్య, శ్రీరామదాసు, షిరిడీ సాయి వంటి భక్తిరస సినిమాలతో ఆకట్టుకున్నాడు.
తెలుగులో ఆదాశర్మ చేసిన రెండు మూడు చిత్రాలకే ఎంత గుర్తింపు వచ్చినా, ఆమెకు ఆ తర్వాత అవకాశాలు రాలేదు. దాంతో బాలీవుడ్ వెళ్లిపోయింది ఆదాశర్మ. అక్కడ జాగా జాసూస్ అనే సినిమాతో హిట్ కొట్టాక అక్కడ అవకాశాలు వరుసపెట్టాయి. ఇటీవల ఓ ఫొటో షూట్ కూడా చేసింది. ఈ ఫొటోషూట్ చూసినవారంతా ఆదాశర్మ ఇంత అందంగా వుంటుందా? అని ఆశ్చర్యపోతున్నారట. ఈ ఫొటోషూట్లతో తెలుగులో కూడా ఆదాశర్మకు మరికొన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి!
నాని, కీర్తి సురేష్ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ రూపొందిస్తున్న చిత్రం ‘నేను లోకల్’. ఈ చిత్రానికి సంబంధించిన కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నారు.
ఎస్ క్రియేషన్స్ పతాకంపై పి.చందు, ఎం.అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న బేవార్స్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే రెండు పాటలతో పాటు డెబ్బై శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. జనవరి నెలాఖరు నుంచి ఫిబ్రవరి 15 వరకు జరిగే చివరి షెడ్యూల్తో చిత్రీకరణ పూర్తవుతుంది. ‘మీ శ్రేయోభిలాషి’ వంటి ఉత్తమాభిరుచిగల చిత్రాలకు సంభాషణలు సమకూర్చిన రమేష్ చెప్పాల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
తన నూరవ చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని అన్ని వర్గాల ప్రజలు ప్రశంసిస్తున్నారని, ఇది తెలుగుజాతి విజయమని నటుడు నందమూరి బాలకృష్ణ అభివర్ణించారు. తన తండ్రి ఎన్టీఆర్ చేయవలసిన ‘శాతకర్ణి’ పాత్ర తనకు దక్కడం పూర్వజన్మ సుకృతమన్నారు. హైదరాబాద్లోని ప్రసాద్ ఐమ్యాక్స్లో గురువారం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రీమియర్ షో సందర్భంగా ఆయన మాట్లాడారు.
శ్రీనాధ్, పల్లవి జంటగా మిసిమి మూవీ క్రియేషన్స్ పతాకంపై ఆర్.వై.జె.శ్రీరాజా దర్శకత్వంలో జి.రమేష్ రూపొందిస్తున్న చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ, రొమాంటిక్ థ్రిల్లర్ కథనంతో రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రీనాధ్ను హీరోగా పరిచయం చేస్తున్నామని, మొదటి షెడ్యూల్ పూర్తయిందని, రెండో షెడ్యూల్లో మిగతా టాకీపార్ట్, పాటలు చిత్రీకరించనున్నామని తెలిపారు.
రామ్చరణ్ తేజ్, డైరెక్టర్ సుకుమార్ల కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘్ధృవ’ తరువాత చరణ్, ‘నాన్నకుప్రేమతో’ తరువాత సుకుమార్ చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సంక్రాంతి తరువాత మొదలుకానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఉంటుందట.
గౌతమీ పుత్ర శాతకర్ణిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. శాతకర్ణిపై బాహుబలి డైరెక్టర్ రాజవౌళి స్పందించారు. ‘తెలుగు జాతి చరిత్రకు దర్పణం శాతకర్ణి. దీని వెనుక క్రిష్ చేసిన కృషి చాలానే ఉంది. అతను ఇంత గొప్ప చిత్రాన్ని 79 రోజుల్లో చేశాడంటే నమ్మలేకపోతున్నా’నని వ్యాఖ్యానించారు. క్రిష్ను చూసి చాలానే నేర్చుకోవాలన్నారు.
మలయాళంలో ‘ప్రేమమ్’తో గుర్తింపు తెచ్చుకున్న అనుపమా పరమేశ్వరన్ తాజాగా తెలుగు సినిమాలపైనే ఫోకస్ పెట్టినట్లుంది. ఆ మధ్య ‘అ ఆ’ సినిమాతో మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈమె, ప్రేమమ్ రీమేక్లోనూ నటించింది. ఈ సినిమాల తరువాత వరుస అవకాశాలు క్యూకట్టాయి. యువహీరోలతోపాటు స్టార్ హీరోల సినిమాల్లోనూ అవకాశాలు వస్తున్నాయి.