S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విశాల్, తమన్నా కాంబినేషన్లో ఎం.పురుషోత్తమ్ సమర్పణలో హరి వెంకటేశ్వర పిక్చర్స్ బ్యానర్పై యువ నిర్మాత జి.హరి నిర్మిస్తున్న భారీ చిత్రం ‘ఒక్కడొచ్చాడు’. ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం విడుదలకు సిద్ధమైంది.
వైష్ణవి మూవీస్, సొహాబ్ ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై బాల్వాన్, ప్రాచి అధికారి జంటగా కృష్ణమోహన్ దర్శకుడిగా నిర్మాత సునీల్ సాగర్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ చిత్రం నైజాం పిల్లోడు (వీడు మహా మాస్గాడు). ఈ చిత్రం టాకీ పూర్తికావస్తోంది. ఈ సందర్భంగా నిర్మాత సునీల్సాగర్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఈ చిత్రంలో ఏడు పాటలు, ఐదు ఫైట్లు ఉన్నాయని త్వరలో సినిమాని విడుదల చేస్తామన్నారు.
గంగోత్రి స్టూడియోస్ ప్రై.లి. సమర్పణలో సలుకూటి సర్వేష్రెడ్డి నిర్మిస్తున్న ‘ఇన్స్పెక్టర్ కిరణ్’ సీరియల్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ ఫేమ్ రోహిణి హీరోయిన్గా, విశ్వ హీరోగా నటిస్తున్న ఈ సీరియల్కు కార్తిక్ తవ్వ దర్శకత్వం వహిస్తున్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చారు.
మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘్ధృవ’చిత్రం ఈనెల 9న విడుదల కానుంది. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రకుల్ ప్రీత్సింగ్.. అందాలు ఆరబోసి దుమ్ము రేపింది. ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో సాంగ్ని విడుదల చేసారు. ఆ సాంగ్లో రకుల్ అందాలు ఓ రేంజ్లో సందడి చేస్తున్నాయి.
హెబ్బాపటేల్, తేజస్వి, రావురమేష్ ప్రధాన తారాగణంగా లక్కీ మీడియా పతాకంపై భాస్కర్ బండి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ రూపొందించిన చిత్రం ‘నాన్న నేను నా బాయ్ఫ్రెండ్స్’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థనుండి ఈనెల 16న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ..
మోహన్లాల్, కమలినీ ముఖర్జీ జంటగా మలయాళంలో ఘన విజయం సాధించిన ‘పులిమురుగన్’ చిత్రాన్ని
సరస్వతి పిక్చర్స్ పతాకంపై సింధూరపువ్వు కృష్ణారెడ్డి మన్యంపులి పేరుతో తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్తో రన్అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ప్రముఖ పాత్రలో నటించిన జగపతిబాబుతో ఇంటర్వ్యూ..
రెస్పాన్స్ ఎలా వుంది?
సంచలన విజయం సాధించిన సింగం చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోంది సింగం-3. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 23న విడుదలవుతోంది. శ్రుతిహాసన్, అనుష్క హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా హీరో సూర్య చెప్పిన విశేషాలు..
అల్లు అరవింద్కు రుణపడ్డా
సంచలన దర్శకుడు రామ్గోపాల్వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న వంగవీటి సినిమా పలు వివాదాల్లో చిక్కుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఈనెల 23న విడుదల కానున్న ఈ సినిమాపై రంగా తనయుడు రాధ కోర్టులో పిటీషన్ వేశారు. వంగవీటి రంగా జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా తన తండ్రి రంగా జీవితాన్ని తప్పుడుగా చిత్రీకరించారంటూ దర్శకుడు వర్మపై ఆయన కేసు పెట్టారు.
తెలుగు, తమిళ భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది అందాల భామ కాజల్. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ అటు గ్లామర్తోను, ఇటు నటనతోను ఆకట్టుకుంటున్న ఈమె లేటెస్టుగా మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇదివరకే మహేష్తో రెండు సినిమాలు చేసిన కాజల్కు ఇది మూడో సినిమా. ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న మహేష్ ఆ తర్వాత తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
నవీన్చంద్ర, పృధ్వీ కథానాయకులుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ రూపొందించిన ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెలో 16న విడుదలకు సిద్ధమైంది.