S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అక్కినేని నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో రూపొందిన లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మించిన ఈ సినిమా యు/ఎ సర్ట్ఫికెట్ను పొందింది. ‘ఏమాయ చేసావే’ తర్వాత నాగచైతన్య-గౌతమ్ మీనన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాను ఈనెల 11న విడుదల చేస్తున్నారు.
మంచు విష్ణు, హన్సికా మోత్వాని జంటగా రాజ్కిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘లక్కున్నోడు’. దీనికి సంబంధించిన ఫస్ట్లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ-‘గీతాంజలి, త్రిపుర వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్కిరణ్ దర్శకత్వంలో విష్ణు నటిస్తున్న ఈ చిత్రం పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా వుంటుంది.
కొరియోగ్రాఫర్ నుండి నటుడిగా, దర్శకుడిగా మారిన రాఘవ లారెన్స్ కాంచన సినిమాతో సంచలన విజయాన్ని అందుకుని మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దానికి సీక్వెల్గా వచ్చిన గంగ కూడా మంచి విజయానే్న అందుకుంది. ప్రస్తుతం మెట్ట శివ కెట్ట శివ (తెలుగులో మొండి శివ గుండు శివ) చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన మెగాస్టార్ చిరంజీవి నటించిన ఓ చిత్రాన్ని రీమేక్ చేస్తాడట.
జయంత్, శే్వతా బసు ప్రసాద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మిక్చర్ పొట్లం’. గోదావరి సినీ టోన్ పతాకంపై సతీష్ కుమార్ ఎం.వి. దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సందర్భంగా నిర్మాత లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ-‘పూర్తి కామెడీ జోనర్లో నిర్మించినా సమాజానికి సందేశాన్ని కూడా అందజేస్తున్నాం.
అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి చిత్రాల్ని నిర్మించిన కె.కె.రాధామోహన్ ప్రస్తుతం శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై నవీన్చంద్ర హీరోగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నిర్మిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. మరో మూడు చిత్రాల్ని నిర్మించేందుకు రాధామోహన్ ప్లాన్ చేశారు. గోపీచంద్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించేందుకు చర్చలు జరుగుతున్నాయి.
రామా గ్రూప్ నిర్మాణంలో రామా రీల్స్ పతాకంపై రూపొందుతున్న తొలి చిత్రం ‘షో టైమ్’. వందశాతం వినోదం అందించాలనే సంకల్పంతో రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకత్వం ఎస్.ఎస్. కాంచి వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని జాన్ పూదోట నిర్మిస్తున్నారు. ఇటీవలే రేడియో మిర్చిలో ఓ సాంగ్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి విడుదల చేశారు. ఈ సందర్భంగ కాంచి మాట్లాడుతూ- ఉన్నత విలువలతో రూపొందుతున్న చిత్రమిది అన్నారు.
ప్రముఖ నటుడు పవన్కల్యాణ్, క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ల కాంబినేషన్లో మరో చిత్రం రూపొందుతోందంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా వస్తున్న ఈ వార్తలకి ఎట్టకేలకు తెరపడింది. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందే ఈ చిత్రం శనివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. దేవుని పటాలపై నటుడు పవన్కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ఈ చిత్రాన్ని హారికా హాసిని బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.
ప్రముఖ నటుడు మహేష్బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపుగా సగానికిపైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ కన్ఫర్మ్ కాలేదు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తాడన్న విషయం తెలిసిందే.
మంచి కథలతో చిత్రాలను నిర్మించాలనే సంకల్పంతో ఒన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ను ప్రారంభించారు నిర్మాతలు ప్రశాంత్కుమార్, సుదర్శన్ రెడ్డి. ఈ బ్యానర్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాతలు రాజ్ కందుకూరి, రామసత్యనారాయణ, ఆర్.కె.గౌడ్, సాయి వెంకట్, చిత్రం శ్రీను తదితరులు పాల్గొన్నారు.
‘సరైనోడు’ సక్సెస్ తరువాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ద్వారకా క్రియేషన్స్ పతాకంపై రూపొందే చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా నటిస్తోంది.