S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్, కమెడియన్ నుండి హీరోగా టర్న్ తీసుకున్న సునీల్ల పరిస్థితి ఒకేలా వుంది. కొన్ని రోజులుగా వీరు చేస్తున్న సినిమాలన్నీ పరాజయం పాలవ్వడంతో కాస్త టెన్షన్కు లోనవుతున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న పూరి తీసిన ‘ఇజం’ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
లేటెస్టుగా అ ఆ సినిమాతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ను అందుకున్న హీరో నితిన్, ఆ సినిమా తరువాత మరో సినిమా కోసం చాలా ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించేందుకు రెడీ అయ్యాడు. 14 రీల్స్ పతాకంపై రూపొందే ఈ సినిమా రొమాంటిక్ థ్రిల్లర్గా వుంటుందుని తెలిసింది.
తమిళ హీరో విజయ్సేతుపతి నటిస్తున్న చిత్రం పురియత్ పుధీర్. ఈ చిత్రాన్ని పిజ్జా-2 పేరుతో డివి సినీ క్రియేషన్స్ అధినేత డి.వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాడు.
నాగార్జున హీరోగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో 1994లో వచ్చిన ‘హలో బ్రదర్’ సినిమా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో ‘జుడవా’ పేరుతో రీమేక్ చేసి హిట్ కొట్టారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేసే సన్నాహాలు జరుగుతున్నాయి. నాగచైతన్య హీరోగా ఈ చిత్రాన్ని సీక్వెల్ చేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
ప్రజాపతి చిత్రశాల పతాకంపై ప్రజాపతి శంకర్ స్వీయ దర్శకత్వంలో ప్రజాపతి శంకర్, స్రవంతి, జై, జ్యోతి ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ‘మీలో ఒక్కడి కథ’ చిత్రం ఇటీవలే హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ క్లాప్నివ్వగా తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్విచ్చాన్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీరశంకర్, మోహన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కాజల్ కథానాయికగా జీవ హీరోగా డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.కె. దర్శకత్వంలో డి.వెంకటేష్ అందిస్తున్న చిత్రం ‘ఎంతవరకు ఈ ప్రేమ’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి, సెన్సార్కు పంపించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ..
రోహన్.ఎస్ హీరోగా పరిచయం అవుతూ రాజారాంమోహన్ దర్శకత్వంలో ఉషామూవీస్ సమర్పణలో బొమ్మనా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం ‘కేరాఫ్ గోదావరి’.
అల్లరి నరేష్ కథానాయకుడుగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై రూపొందిస్తున్న చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. సినిమాకు సంబంధించిన ట్రైలర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ..
రామ్చరణ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా గీతా ఆర్ట్స్ పతాకంపై సురేందర్రెడ్డి దర్శకత్వంలో అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్ అందిస్తున్న చిత్రం ‘ధ్రువ’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్తోపాటుగా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నారు. సినిమాకు సంబంధించిన ఆడియోను ఈనెల 9న విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నారు.
కార్తి, నయనతార జంటగా గోకుల్ దర్శకత్వంలో పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్పై రూపొందిన చిత్రం ‘కాష్మోరా’. ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో కార్తీ చెప్పిన విశేషాలు...
ఊహించని ఫలితం