S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
దత్త, సోనాలి దీక్షిత్ జంటగా సావిత్రి ఫిలింస్ పొడక్షన్స్ పతాకంపై చందమల్ల అభిలాష్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం డేంజర్ జోన్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ప్రేమ్రాజ్ మాట్లాడుతూ, ఈ సినిమాను ఏడు రోజుల్లో తీసినా 40 రోజుల్లో తీసిన క్వాలిటీ కనిపిస్తోందని, ధియేటర్లో చూస్తే ఫీల్ బాగుంటుందన్నారు.
చెన్నైలో పుట్టినా కూడా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో పెరిగి బాలీవుడ్లోకి క్వీన్ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది గ్లామర్ భామ లీసా హైడెన్. ఆ తరువాత హౌస్ఫుల్-3 సినిమాలో నటించి హాట్ హాట్గా రెచ్చగొట్టిన ఈమె, పలు మ్యాగజైన్లకు బికినీలంటూ హాట్గా ఫొటోషూట్లతో రెచ్చగొట్టింది. నటనకంటే కూడా గ్లామర్పైనే ఫోకస్ పెట్టిన ఈ భామ, ప్రస్తుతం పెళ్లికి సిద్ధమైందట.
సౌత్లో స్టార్ హీరోయిన్లలో ఒకరైన కాజల్ తెలుగు, తమిళంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులతో బిజీగా వుంది. ప్రస్తుతం ఈమె తెలుగులో మెగాస్టార్ సరసన ఖైదీ నెం.150తోపాటు తమిళంలో స్టార్ హీరో అజిత్ 57వ చిత్రంలోనూ అలాగే మణిరత్నం డైరెక్షన్లో జీవ హీరోగా రూపొందుతున్న ‘కావలై వెండం’సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తోంది. ఇన్ని భారీ ప్రాజెక్టులుచేస్తున్న ఈమెను మరో పెద్ద ఆఫర్ వరించినట్టు తెలుస్తోంది.
గ్లామర్ భామ త్రిష రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టినప్పటినుండీ చేసిన సినిమాలన్నీ ఆమెకు ఎటువంటి లాభం ఇవ్వలేదు. ముఖ్యంగా అందరూ వెళ్ళే దారిలో వెళ్లి నాయకితో భయపెట్టి హిట్ కొట్టాలనుకున్నా ఆమెకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇక ఇప్పుడు మరో హారర్ సినిమా చేస్తోంది. మలయాళంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని రీమేక్ చేయాలనే ఆలోచనలో పడిందట.
మలయాళ నటుడు మోహన్లాల్, ఆమలాపాల్, సత్యరాజ్ ప్రధాన తారాగణంగా జోషి దర్శకత్వంలో కె.ఆర్.్ఫలింస్ ఇంటర్నేషనల్ ఫిలింస్ పతాకంపై కందల కృష్ణారెడ్డి తెలుగులో అందిస్తున్న చిత్రం ‘ఇద్దరూ ఇద్దరే’. ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి.
రామ్.. ఎనర్జిటిక్ హీరోగా టాలీవుడ్లో మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే మరోవైపు ప్రయోగాలు కూడా చేస్తూ నిరూపించుకుంటున్నాడు. లేటెస్టుగా ‘నేను శైలజ’తో మంచి హిట్ అందుకున్న రామ్ ఇప్పుడు ‘హైపర్’గా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి రెడీ అయ్యాడు. ‘కందిరీగ’, ‘రభస’ సినిమాలు రూపొందించిన సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో 14 రీల్స్ బ్యానర్పై రూపొందిన ఈ చిత్రం ఈనెల 30న విడుదలకు సిద్ధం అయింది.
టీమిండియా కెప్టెన్ జీవితకథ ఆధారంగా నిర్మించిన ‘ఎం.ఎస్.్ధని-ద అన్టోల్డ్ స్టోరీ’ సినిమాను పాకిస్తాన్లో ప్రదర్శించడం లేదు. కాశ్మీర్లోని ఉరీ సైనికశిబిరంపై ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడి అనంతరం ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ఆ సినిమాను ప్రదర్శించడం లేదని ప్రఖ్యాత సినీడిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఐఎంజిఎల్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ తెలిపింది.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తెలంగాణ తొలి సినిమా హీరో, నటుడు, నిర్మాత, దర్శకుడు పైడి జయరాజ్ 107వ జయంతి వేడుకలు బుధవారం ఫిలిం ఛాంబర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ- తెలంగాణలో మొదటి తరం నటుడు పైడి జయరాజ్ ఆ రోజుల్లోనే ఆయన ముంబైకి వెళ్లి అక్కడ హీరోగా ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో ఆయన పేరు వినిపించడం లేదు.
సంపత్ నంది దర్శకత్వంలో ‘బెంగాల్ టైగర్’చిత్రం చేసిన రవితేజ ఆ చిత్రం అంత మంచి ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మరో సినిమా చేయడానికి చాలా గ్యాప్ తీసుకున్నారు. అంత గ్యాప్ తరువాత ప్రస్తుతం ఈయన రెండు కొత్త సినిమాలకు కమిటయ్యారు. అందులో ఒకటి దర్శకుడు బాబీతో చేయనున్నాడు. కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా ఉండబోతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 12న దసరా సందర్భంగా మొదలుపెట్టనున్నారు.
హాస్య కథా చిత్రాలతో మెప్పిస్తూన్న అల్లరితో హీరోగా పరిచయం అయిన అల్లరి నరేష్ కెరీర్ పరంగా స్టార్ హీరో అయ్యేందుకు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోన్న నరేష్, వ్యక్తిగత జీవితంలో తండ్రి హోదా పొందారు. తాను ఓ ఆడబిడ్డకు తండ్రినయ్యానన్న విషయాన్ని అల్లరి నరేష్ స్వయంగా తెలియజేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. గతేడాది మే నెలలో చెన్నైకి చెందిన విరూపను అల్లరి నరేష్ పెళ్లాడిన విషయం తెలిసిందే.