S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఇంజనీరింగ్ కాలేజ్ ఫెస్ట్ నేపథ్యంగా తెరకెక్కుతోన్న లవ్ థ్రిల్లర్ -యురేక. కార్తీక్ ఆనంద్, డింపుల్ హయతి, సయ్యద్ సోసైల్ రియాన్, షాలిని ప్రధాన పాత్రలుగా కార్తీక్ ఆనంద్ తెరకెక్కిస్తోన్న చిత్రాన్ని లక్ష్మీ ప్రసాద్ ప్రొడక్షన్స్పై ప్రశాంత్ తాత నిర్మిస్తున్నారు. మార్చి 13న సినిమాను విడుదల చేయనున్న సందర్భంగా హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించారు.
కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్ జోడీగా ఎలైట్ ఎంటర్టైనె్మంట్స్ బ్యానర్పై రూపొందనున్న చిత్రానికి -ఎస్ఆర్ కల్యాణ మండపం.. ఇఎస్టి 1975 టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఈ చిత్రం ద్వారా శ్రీధర్ గాదె దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రాయలసీమ నేపథ్యంగా.. ఒక కల్యాణ మండపం చుట్టూ తిరిగే కథతో వినోదాత్మకంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు శ్రీధర్ ఈ సందర్భంగా వెల్లడించాడు.
హీరో నాని సమర్పణలో వాల్పోస్టర్ బ్యానర్పై విశ్వక్సేన్ హీరోగా రూపొందిన చిత్రం -హిట్. ప్రశాంతి త్రిపిర్నేని నిర్మాతగా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రమిది. రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది. ఫిబ్రవరి 28న విడుదలైన సినిమాకు మంచి టాక్ రావడంతో -దర్శకుడు శైలేష్ కొలను మీడియాతో మాట్లాడాడు. ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీశానో అది ఆడియన్స్ని కరెక్ట్గా రీచైంది.
అల్లు వంశీ, ఇతి ఆచార్య జోడీగా ధన్శ్రీ ఆర్ట్స్ పతాకంపై దర్శకుడు ఎన్ఎస్ మూర్తి తెరకెక్కిస్తోన్న చిత్రం -పసివాడి ప్రాణం. ఈ చిత్రానికి సంబంధించి లిరికల్ ఆడియోను దర్శకుడు వివి వినాయక్, ఏ కోదండరామిరెడ్డి, నిర్మాత రాజ్ కందకూరి సంయుక్తంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మూర్తి మాట్లాడుతూ -టాలీవుడ్లో ఇంతవరకూ రానటువంటి వినూత్నమైన లైవ్ కమ్ యానిమేషన్ చిత్రమిది.
బ్రూస్లీ హీరోగా వచ్చిన -ఎంటర్ ది డ్రాగన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ వేరు. బ్రూస్లీని అమితంగా ఇష్టపడే దర్శకుడు రామ్గోపాల్ వర్మ -ఈ ప్రపంచానికి డ్రాగాన్ గాళ్ను పరిచయం చేయబోతున్నాడు. భారత్లోనే పూర్తి మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా తెరకెక్కుతోన్న తొలి సినిమా -ఎంటర్ ది గాళ్ డ్రాగన్ అంటున్నాడు ఆర్జీవీ. అంతా ఒకటైపు..
ఒకప్పుడు -రవితేజకు జోడీగా చేసిన హీరోన్లకు మంచి ఎలివేషన్ ఉండేది. ప్రస్తుతం రవితేజ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరుస్తుండటంతో -ఆ ప్రాజెక్టుల్లో చేసిన హీరోయిన్ల కెరీర్కు ఏమాత్రం లాభం చేకూరడం లేదు. సో, రవితేజతో జోడీ కట్టనున్న ఇస్మార్ట్ భామ నిధి అయినా ఈ పరిస్థితిని బ్రేక్ చేస్తుందేమో చూడాలి. రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. తదుపరి ప్రాజెక్టునూ ఇప్పటికే లైన్లో పెట్టాడు.
రక్షిత్, నక్షత్ర జోడీగా కరుణకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం -పలాస 1978. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన చిత్రానికి థియేటర్ల వద్ద మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం నిర్వహించిన థాంక్స్ మీట్లో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ -దళితుల పాత్రలతో సినిమాలు రావడం లేదంటారు. అలా వచ్చిన పలాస 1978ని మాత్రం పట్టించుకోవడం లేదు. పలాసలో దళితుల పాత్రలనే హీరోలు చేశాం.
డిస్కోరాజా ఎదురు దెబ్బ తరువాత హీరో రవితేజ కసిగా చేస్తున్న సినిమా -క్రాక్. దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తోన్న చిత్రంలో రవితేజతో శృతిహాసన్ రొమాన్ చేయనుంది. సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తోన్న వరలక్ష్మీ శరత్కుమార్ను జయమ్మగా పరిచయం చేస్తూ -పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్లుక్ని విడుదల చేసింది చిత్రబృందం.
ఓ ఇంటి వాడయ్యేందుకు రెడీ అవుతూనే -హీరో నిఖిల్ వరుస సినిమాలతోనూ బిజీ అవుతున్నారు. కెరీర్ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిన టైంలో -అర్జున్ సురవరం చేసి కాస్త ఊపిరి తీసుకున్న నిఖిల్.. తనకు మంచి ఇమేజ్ తెచ్చిన ‘కార్తికేయ’కు సీక్వెల్ మొదలు పెట్టడం తెలిసిందే. దర్శకుడు చందు మొండేటి సిద్ధం చేసిన ‘ద్వారపరియుగం నాటి విజ్ఞాన రహస్యాన్ని వెలికి తీయనున్న సాహసి’లా కార్తికేయ-2లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
రక్షిత్, నక్షత్ర జోడీగా కొత్త దర్శకుడు కరుణకుమార్ తెరకెక్కించిన చిత్రం -పలాస 1978. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్ అట్లూరి నిర్మించిన చిత్రం సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సమర్పకుడు భరద్వాజ, నిర్మాత అట్లూరి వరప్రసాద్ మీడియాతో మాట్లాడారు. భరద్వాజ మాట్లాడుతూ -పలాస కథను దర్శకుడు చెప్పినపుడు నచ్చి హీరోకి రిఫర్ చేశాను. మాభూమి తరువాత ఆ స్థాయిలో ఉండే సినిమా ఇది.