S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
శ్రీ క్రియేటివ్ ఫిలింస్ పతాకంపై రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో నిఖిత, సంజన, చిన్న, ఉత్తేజ్ ప్రధాన తారాగణంగా శివగంగరాజు వుడిముడి దర్శకత్వంలో ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ళ రూపొందించిన చిత్రం ‘అపార్ట్మెంట్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించారు. సినిమాలోని పాటల సీడీని ఆర్.పి.పట్నాయక్ విడుదల చేశారు.
‘వారసత్వం అనే అంశాన్ని నేను పెద్దగా నమ్మను. అది కేవలం మన పరిచయం వరకే ఉపయోగపడుతుంది తప్ప.. మన సక్సెస్కు కాదు, మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటేనే ఇక్కడ నిలబడగలం’ అని అంటున్నారు ఎన్టీఆర్. ఆయన హీరోగా సమంత, నిత్యామీనన్ హీరోయిన్స్గా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రం జనతా గ్యారేజ్.
వీరభద్రం దర్శకత్వంలో ఆది హీరోగా నటించిన చుట్టాలబ్బాయి చిత్రం విజయవంతంగా మూడవ వారంలోకి ప్రవేశించిందని, ఈ విజయంతో తామెంతో పొంగిపోతున్నామని యూనిట్ సభ్యులు అన్నారు. చుట్టాలబ్బాయి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ప్లస్ విజయోత్సవ వేడుక సోమవారం సాయంత్రం ప్రసాద్ ల్యాబ్స్లో యూనిట్ సభ్యుల ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రం మాట్లాడుతూ.. టైటిల్ పెట్టిన దగ్గరనుండి అది జనంలోకి దూసుకుపోయింది.
సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తోన్న ‘రోబో-2.0’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఇలా సెట్స్పై ఉండగానే ఆయన తదుపరి సినిమాకు సంబంధించిన ఆసక్తికర ప్రకటన ఒకటి ఇప్పుడే వెలువడింది. రజనీ అల్లుడు, హీరో ధనుష్ ట్విట్టర్ ద్వారా ‘రోబో 2.0’ తర్వాత రజనీ చేయబోయే సినిమా తన బ్యానర్లోనే ఉంటుందని ప్రకటించేశాడు.
ప్రముఖ నటుడు వెంకటేష్ చాలాకాలం తరువాత మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘బాబు బంగారం’ చిత్రంతో మంచి విజయాన్నందుకున్నాడు. గతంలో వెంకీ నటించిన ‘దృశ్యం’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మలయాళంలో జీతు జోసెఫ్ డైరెక్షన్లో మోహన్లాల్ హీరోగా నటించిన సూపర్హిట్ సినిమా ‘దృశ్యం’ ఆధారంగానే తెలుగులోనూ రీమేక్ చేశారు.
చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గ్లామర్ భామ కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. రామ్చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు మరో ప్రత్యేకత సంతరించుకోనుంది. మిల్కీ భామ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తూండటం విశేషం. ఇప్పటికే ఆ దిశగా వినాయక్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.
లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో సాగర్, రాగిణి నంద్వాణి, సాక్షిచౌదరి హీరో హీరోయిన్లుగా రామదూత క్రియేషన్స్ బ్యానర్పై కె.వి.దయానంద్రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ’. సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్నాయి. సెప్టెంబర్ 2న ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
నాని హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కేవా మూవీస్ పతాకాలపై పి.కిరణ్, గోళ్ళ గీత అందిస్తున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ ‘మజ్ను’. ఈ చిత్రానికి సంబంధించి ‘కళ్ళు మూసి తెరిచేలోపే.. గుండెలోకే చేరావే’ అంటూ సాగే మొదటి పాటను రేడియో మిర్చి ద్వారా, ‘ఓయ్.. మేఘమాల..’ అంటూ సాగే రెండోపాటను రెడ్ ఎఫ్ఎం ద్వారా రిలీజ్ చేశారు.
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం సెప్టెంబర్ 1న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ నెక్ట్స్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. చాలా రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన కార్యక్రమాలన్నీ జరిగాయి. రచయితగా ప లు హిట్ చిత్రాల ను రూపొందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయవౌతూ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు.
సరైనోడు విజయం తర్వాత అల్లు అర్జున్ కాస్త గ్యాప్ తీసుకుని నటిస్తున్న చిత్రానికి రంగం సిద్ధమైంది. హరీష్శంకర్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈరోజు వైభవంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులతో సహా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి టైటిల్ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని హీరో అల్లు అర్జున్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.