S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
నాగఅనే్వష్, హెబాపటేల్ హీరో హీరోయిన్లుగా ముప్పా వెంకటయ్య చౌదరి సమర్పణలో సరస్వతి ఫిలింస్ బ్యానర్పై ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో భువన్ సాగర్ నిర్మిస్తున్న చిత్రం ‘ఏంజెల్’ బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఠాగూర్ మధు కెమెరా స్విచ్చాన్ చేయగా, సాయిధరమ్ తేజ్ క్లాప్ కొట్టారు. పళని గౌరవ దర్శకత్వం వహించారు.
చిరంజీవి 150వ సినిమా గురించి రోజుకో న్యూస్ బయటికి వస్తోంది. మొన్నటి వరకు హీరోయిన్ విషయంలో తెగ టెన్షన్ పడ్డ 150వ సినిమా యూనిట్... ఎలాగోలా కాజల్ని ఖరారు చేసింది. ఇక తర్వాత ఈ సినిమా టైటిల్కి సంబంధించి రోజుకో వార్త హల్చల్ చేసింది. తాజాగా ఇప్పడు కొరియోగ్రఫీకి సంబంధించి మరో న్యూస్ వెలుగులోకి వచ్చింది.
ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్ ప్రధాన తారాగణంగా నటించిన ‘జనతా గ్యారేజ్’ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం జరగనుంది. ఈ సందర్భంగా చిత్రంలోని హీరో హీరోయిన్ల లుక్ను విడుదల చేశారు.
కమెడియన్ నుంచి హీరోగా మారాక సునీల్ కొద్దికాలంగా మంచి హిట్ కోసం ఎంతగానో తపిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే గత నెలాఖరులో జక్కన్న అనే సినిమాతో మెప్పించేందుకు వచ్చినా, ఆ సినిమా కూడా ఊహించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో ఇప్పుడు సునీల్కు ఒక హిట్ అనివార్యమైంది. ఈనేపథ్యంలో ఆయన వీలైనంత త్వరగా తన కొత్త సినిమా ‘ఈడు గోల్డ్ ఎహె’ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈమధ్య తెలుగు హీరోలు ఇతర భాషల్లో కూడా మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్బాబు, చరణ్లు స్పీడ్ పెంచారు. ఈసారి వారిద్దరితోపాటు మరో టాలీవుడ్ హీరో కూడా ప్రయత్నాలు సాగిస్తున్నాడు. బాహుబలి సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న భల్లాల దేవుడు.. అదే రానా ఇప్పుడు హీరోగా మలయాళంలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.
నాని, కీర్తి సురేష్ జంటగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రాజు రూపొందిస్తున్న చిత్రం ‘నేను లోకల్’ (ఆటిట్యూడ్ ఐస్ ఎవిరీథింగ్). శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకంపై రూపొందిస్తున్న చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది.
అప్పట్లో.. సినిమాల్లో జ్యోతిలక్ష్మి పాట వచ్చిందంటే చాలు ముసలాళ్లు కూడా కుర్రాళ్ళు అయిపోయేవారు. అంతలా తన అందచందాలతో మత్తెక్కించింది ఆమె. జ్యోతిలక్ష్మి డాన్స్కోసమే సినిమాలకు వెళ్ళే ప్రేక్షకులు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. మూడు వందలకుపైగా సినిమాల్లో నటించిన ప్రముఖ నటి జ్యోతిలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం ఉదయం చెన్నైలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
మహేష్, ఏ.ఆర్.మురుగదాస్ల కాంబినేషన్లో ఓ సినిమా ఈమధ్యే సెట్స్పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. మహేష్ అప్పుడే మరో సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని పీవీపీ సంస్థ అధికారికంగా ప్రకటించేసింది. ఇప్పటికే మంచి కథను సిద్ధం చేసిన వంశీ ప్రస్తుతం స్క్రిప్ట్ను రెడీ చేస్తున్నారు. వంశీ గత చిత్రం ‘ఊపిరి’లానే జీవితాన్ని పరిచయంచేసే ఓ కొత్త కథతో, కమర్షియల్ పంథాలోనే సినిమా నడుస్తుందని సమాచారం.
అల్లు శిరీష్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్పై నిర్మాత అల్లు అరవింద్ ప్రముఖ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో నిర్మించిన ‘శ్రీరస్తు శుభమస్తు’ ఈనెల 5న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర యూనిట్ హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్కు అల్లు అర్జున్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ, ‘ ఈ సినిమా పట్ల మొదటి నుంచీ పాజిటివ్ టాక్తో ఉన్నాను.
అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి కరెంట్, అడ్డా సినిమాలతో లవర్బాయ్గా మెప్పించిన హీరో సుశాంత్. తాజాగా ఆయన జి.నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘ఆటాడుకుందాం రా’ను ఆగస్టు 19న విడుదల చేయనున్నట్లుతెలిసింది. అనూప్ రూబెన్స్ అందించిన ఆడియో గత శుక్రవారమే మార్కెట్లోకి విడుదలైంది. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య, అఖిల్ చిన్న గెస్ట్ రోల్స్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.