S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

08/06/2016 - 20:52

ధీరు మహేష్, సుదర్శన్, సురేష్, ఇషికాసింగ్, ప్రియాంక ప్రధాన తారాగణంగా శ్రీ హరిహరా ఫిలింస్ పతాకంపై మాదాల కోటేశ్వరరావు దర్శకత్వంలో మధు, అనీష్, అభిరామ్ రూపొందిస్తున్న చిత్రం ‘కారులో షికారుకెళితే’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సెన్సార్‌కు సిద్ధం చేశారు.

08/06/2016 - 20:51

ఈమధ్య బాలీవుడ్‌లో బయోపిక్‌ల హవా బాగా ఎక్కువయింది. ముఖ్యంగా ఇలాంటి.. సినిమాలు బాక్స్‌ఆఫీస్‌వద్ద దుమ్మురేపుతున్నాయి. అందులో లేడీ ఓరియెంటెడ్ సినిమాల మార్కెట్‌తో ఇప్పుడు చాలామంది ఈ తరహా సినిమాలు తీయడానికి సిద్ధంఅయ్యారు. లేటెస్ట్‌గా ఓ సినిమాకోసం హాట్‌భామ విద్యాబాలన్ ఏకంగా 18 కోట్లు అడిగిందట!! ఆ మొత్తం ఇవ్వడానికి నిర్మాతలు కూడా రెడీ అయ్యారు! నిజంగా బాలీవుడ్‌లో ఇది రికార్డ్ అని చెప్పాలి.

08/06/2016 - 20:49

మరో వారసురాలుగా హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రముఖ నటి గౌతమి కూతురు సుబ్బలక్ష్మి త్వరలోనే కథానాయికగా పరిచయవౌతోంది. ఫిల్మ్ యాక్టింగ్‌లో కోర్సుచేస్తున్న ఆమె తెలుగులోగానీ, లేదంటే తమిళంలోగానీ ఎక్కడ మంచి అవకాశమొస్తే అక్కడ్నుంచి ఇంట్రడ్యూస్ అవ్వాలని నిర్ణయించుకొన్నట్టు సమాచారం. గౌతమి కూడా ఆ విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా ఒప్పేసుకుంది.

08/06/2016 - 20:47

రోషిత్, షాలు, చరణ్ నాయుడు, కరుణాకర్, కల్యాణి ప్రధాన తారాగణంగా వన్ మన్ క్రియేషన్స్ పతాకంపై పాల్వాయి సుదర్శన్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘అరణ్యంలో’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది.

08/05/2016 - 20:57

మహేష్‌బాబు హీరోగా, మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంచలనాత్మక చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే భారీ అంచనాలని పెంచుకున్న ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలని హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లోనే షూటింగ్ జరుపుతున్నారు. అనల్ అరసు ఫైట్ మాస్టర్ నేతృత్వంలో సాగే ఈ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని తెలిసింది.

08/05/2016 - 20:55

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వరుస సినిమాల విజయంతో దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోల సినిమాలకు సంగీతం అందిస్తూన్న దేవి మరోవైపు, తమిళంలో కూడా తన సత్తా చాటుకున్నాడు. డిఎస్‌పిగా పాపలరైన దేవిశ్రీ, మొట్టమొదటసారి టెలివిజన్ తెరపై షో ఇవ్వడం విశేషం. డిఎస్‌పి యుఎస్‌ఎ వరల్డ్ ప్రిమియర్ ఈవెంట్ పేరుతో అమెరికాలో సందడి చేసిన ఈ షోను త్వరలోనే జీ టీవీలో ప్రసారం చేయనున్నారు.

08/05/2016 - 20:54

తెలుగు తెరపై దర్శకుడిగా తనదైన గుర్తింపు దక్కించుకున్న శేఖర్ కమ్ముల తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘్ఫదా’. ‘ముకుంద’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకుపోతున్న యువ హీరో వరుణ్ తేజ్ హీరోగా మలయాళ ‘ప్రేమమ్’ ఫేం సాయి పల్లవి హీరోయిన్‌గా రూపొందే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. శుక్రవారం నిజామాబాద్‌లోని బాన్సువాడలో చిత్రం ప్రారంభమైంది.

08/05/2016 - 20:52

దర్శకుడిగా టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న సుకుమార్, ఓవైపు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా చిన్న సినిమాలని నిర్మిస్తున్నాడు. తాజాగా ఆయన నిర్మించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం సంచలన విజయం సాధించింది. దాంతో మరింత ఊపుతో ఆయన మరిన్ని చిత్రాల్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముఖ్యంగా కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తూ నిర్మించే ఈ బ్యానర్‌లో మరో చిత్రం తెరకెక్కనుంది.

08/05/2016 - 20:50

ప్రముఖ నటుడు వెంకటేష్, నయనతార జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాబుబంగారం చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్‌బోర్డు నుండి యు/ఎ సర్ట్ఫికెట్ పొందింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ, నాగవంశీ, పి.డి.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇటీవలే విడుదలయ్యాయి. గోపాల..

08/05/2016 - 20:49

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన రోజా సినిమాతో హీరోగా ప్రవేశించి తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అరవింద్‌స్వామి. ఆ తరువాత బొంబాయి సినిమాతో బాలీవుడ్‌లోనూ పాపులరైన అరవింద్‌స్వామి ఆ తరువాత వరుస సినిమాల పరాజయాలతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఆ తరువాత కడలి సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన ఆయనకు తనిఒరువన్ మంచి బ్రేక్‌నిచ్చింది.

Pages