S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బాలీవుడ్ హాట్భామ అనుష్కశర్మ ఈమధ్య జోరుమీదుంది. వరుసగా క్రేజీ సినిమాల్లో నటిస్తూ, మరోవైపు జోరుగా విరాట్కోహ్లీతో ప్రేమాయణం సాగిస్తున్న ఈ భామ ఇప్పుడు ఓ విషయానికి అడిక్ట్ అయిపోయిందట. దర్శక నిర్మాతలు ఈ విషయం విని షాక్ అవుతున్నారు. ఈ వ్యసనంవల్ల అనుష్క కెరీర్ నాశనం చేసుకుంటుందా ఏమో అని? ఔనా.. ఇంతకీ దేనికి అడిక్ట్ అయ్యిందనేగా మీ అనుమానం.
ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్వాంటెడ్ హీరోయిన్గా క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ రకుల్ప్రీత్సింగ్. వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ఈ భామకు మహేష్బాబు సరసన నటించే ఛాన్స్ దక్కిన విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఈ చిత్రంలో మహేష్ సరసన హీరోయిన్గా పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించినప్పటికీ, చివరగా రకుల్ను ఓకే చేశారు.
మాటల మాంత్రికుడు డైరెక్టర్ త్రివిక్రమ్. అ ఆ సినిమా తరువాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో సినిమా తీస్తాడనేది అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు స్టార్ హీరోలతో మాత్రమే సినిమాలు చేసిన త్రివిక్రమ్ తాజాగా నితిన్తో ‘అ.. ఆ’ సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు ఏ హీరోతో సినిమా తీయాలి.. అని ఆలోచిస్తున్న త్రివిక్రమ్కి ఒక బంపర్ ఆఫర్ వచ్చిందని సమాచారం.
సాయిధరమ్తేజ్ హీరోగా శ్రీ వెంకటేశ్వర మూవీ మేకర్స్ బ్యానర్పై సునీల్రెడ్డి దర్శకత్వంలోసి.రోహిణ్కుమార్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం ‘తిక్క’. లారిస్సా బోనేసి, మన్నార్ చోప్రా హీరోయిన్స్గా నటించారు. ఎస్.ఎస్.్థమన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల హైదరాబాద్లో జరిగింది.
చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రెండో షెడ్యూల్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో ఓ పాత్రకోసం సునీల్ని అడిగారు. కానీ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో సునీల్ ఈ సినిమా చేయడానికి బాధపడుతూనే కుదరదని చెప్పాడు. కానీ ఇప్పుడు మరోసారి ఆ అవకాశం వెతుక్కుంటూ వచ్చిందట!!
శ్రీదేవి తనయ జాహ్నవి మహేష్ బాబు కథానాయకుడిగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో కథానాయికగా నటిస్తోందని ఆమధ్య వినిపించిన వార్త. ఇందులో నిజం ఎంత ఉందని ఆరాతీస్తే, తానిప్పుడే సినిమాల్లో నటించడానికి సిద్ధంగా లేనని జాహ్నవి చెప్పేసింది.
చన్నాంబిక ఫిలిమ్స్ పతాకంపై మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవగౌడ మనుమడు నిఖిల్కుమార్ కథానాయకుడుగా ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనిత కుమారస్వామి రూపొందిస్తున్న చిత్రం జాగ్వార్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు.
ఒక దర్శకుడు.. ఒక హీరోయిన్తో తాను చేసిన ప్రతి సినిమాలో హీరోయిన్గా తీసుకుంటున్నాడు అంటే వారిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉన్నట్లు లెక్క. ఈ లెక్క అప్పట్లో రమ్యకృష్ణ రాఘవేంద్రరావుతో ఎక్కువ సినిమాలు చేసి, షాక్ ఇచ్చారు. ఇప్పుడు అదే దారిని మరో దర్శకుడు వెడుతున్నాడు. ఏమైందీవేళ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సంపత్నందికి రామ్చరణ్తో చేసిన రచ్చ భారీ కమర్షియల్ విజయాన్ని అందించింది.
మనోజ్ కథానాయకుడుగా క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.ఎస్.సత్య దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, యాక్షన్, యూత్ఫుల్ ప్రేమకథాచిత్రంగా ఈ సినిమా మాస్ ఎంటర్టైనర్గా రూపొందించనున్నామని తెలిపారు.
‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రంతో అల్లు అర్జున్ తమ్ముడు శిరీష్ సందడి చేయనున్నాడు. ఈ సినిమా విడుదల హడావుడిలో ఉండగానే మరో సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చక్కబెడుతున్నారు. ఎం.వి.ఎన్.రెడ్డి దర్శకత్వంలో అల్లు శిరీష్ చేస్తున్న ఓ సినిమా గూర్చి తెలిసిందే. శ్రీ శైలేంద్ర మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రంలో మెహరిన్ కథానాయికగా నటించనుంది.