S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
అక్కినేని నాగార్జున హీరోగా ఓం నమోవెంకటేశాయ పేరుతో ఓ భక్తిరస చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నాగార్జునతో కలిసి అన్నమయ్య, శ్రీరామదాసు, శిరీడీసాయి లాంటి భక్తిరస చిత్రాలను అందించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ను ఈనెల 30న విడుదల చేస్తారు.
రాహుల్ మూవీ మేకర్స్ పతాకంపై అరుణ్ అదిత్, పూజా జవేరి జంటగా ముకుంద్ పాండే దర్శకత్వంలో బి.ఓబుల్ సుబ్బారెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘ఎల్ 7’. దీనికి సంబంధించిన ట్రైలర్ను హైదరాబాద్లో శుక్రవారం ఉదయం విడుదల చేశారు. సినిమా లోగోను దర్శకుడు విజయ్కుమార్ కొండా ఆవిష్కరించగా, థియేటర్ ట్రైలర్ను గొట్టిముక్కల పద్మారావు, డి.ఎస్.రావు సంయుక్తంగా విడుదల చేశారు.
జై చిరంజీవ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కొండపల్లి పర్వతాలు సమర్పణలో తన్నీరు చిరంజీవి దర్శకత్వంలో సకినాన భూలక్ష్మి నిర్మించిన చిత్రం ‘లైఫ్కి ప్లాట్ఫాం టీనేజ్’. ఉమ,రాఘవ, ప్రకాష్, శశాంక్, రాహుల్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 13న విడుదల చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో దర్శకులు తన్నీరు చిరంజీవి మాట్లాడారు.
హైదరాబాద్లో జరిగినమిర్చి మ్యూజిక్ అవార్డు వేడుకలో పాల్గొన్న
పవన్ కళ్యాణ్
విక్రమ్, నయనతార, నిత్యామీనన్ ముఖ్యపాత్రల్లో తమిళంలో రూపొందుతున్న ‘ఇరుమగన్’ చిత్రాన్ని ‘ఇంకొక్కడు’ పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. దీనికి సంబంధించిన తెలుగు హక్కులను దక్కించుకుంది ఎన్.కె.ఆర్ ఫిలింస్. శివపుత్రుడు, అపరిచితుడు, నాన్న, ఐ వంటి విలక్షణ సినిమాలతో ఆకట్టుకున్న విక్రమ్, కొంత గ్యాప్ తరువాత చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఎన్టీఆర్ నటిస్తున్న ‘జనతా గ్యారేజ్’ జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. దీన్ని సెప్టెంబర్ 2న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రేడ్ వర్గాల్లో హల్చల్ చేస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా 60 కోట్లకుపైగానే జరిగిందని సమాచారం. ప్రస్తుతం ఈసినిమా శాటిలైట్ హక్కులు హాట్ కేక్లా అమ్ముడయ్యాయట.
ఈమధ్య ఓ హీరో కోసం మరో పాట పాడటం సాధారణమైంది. తమిళ హీరో ధనుష్ ఇటీవలే ఓ పాట పాడిన విషయం తెలిసిందే. సాయిధరమ్తేజ్ హీరోగా రూపొందుతున్న తిక్క చిత్రం కోసం ధనుష్ ఓ పాట పాడాడు. ఇపుడు ఈ సినిమా కోసం మరో తమిళ హీరో కూడా గొంతు కలిపాడు. ఒకే చిత్రంలో ఇలా ఇద్దరూ తమిళ హీరోలు పాటలు పాడటం విశేషం.
నాగశౌర్య, పారుల్, సరయు హీరో హీరోయిన్లుగా లారెన్స్ దాసరి దర్శకత్వంలో శ్రీ సత్యవిదుర మూవీస్ పతాకంపై ఎం.వి.చౌదరి, నాగరాజ్గౌడ్ నిర్మిస్తున్న చిత్రం ‘నీ జతలేక’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఆగస్టు 13న విడుదలవుతున్న సందర్భంగా హీరో నాగశౌర్య చెప్పిన విశేషాలు..
అచ్చమైన ప్రేమకథ
ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది రాశీఖన్నా. అందానికి అందం, నటనకు నటనతో ఆకట్టుకుంటున్న ఈ భామకు తెలుగులో అవకాశాలు జోరుగా వస్తున్నాయి. ఇటీవలే సుప్రీమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న రాశి తాను ఛాలెంజింగ్ పాత్రలు కూడా చేయాలని ఆశపడుతోందట. కేవలం గ్లామర్కే పరిమితం కాకుండా నటనతోనూ ప్రూవ్ చేసుకోవాలని వుందని చెబుతోంది.
ఆది హీరోగా వీరభద్రమ్ దర్శకత్వంలో శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై వెంకట్ తలారి, రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ‘చుట్టాలబ్బాయి’ ఆగస్టులో ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఇందులో ముఖ్యపాత్రలో నటిస్తున్న సాయికుమార్ తన జన్మదినం సందర్భంగా మాట్లాడుతూ, ‘నేను, ఆది కలిసి నటించాలనుకుని మంచి కథ కోసం ఎదురుచూసిన సమయంలో ఈ అవకాశం వచ్చింది. మేమిద్దరం చేసిన తొలి చిత్రం ఇది.