S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
వెంకటేష్, నయనతార జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మారుతి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశి, పి.డి.వి.ప్రసాద్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘బాబు బంగారం’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, జీబ్రాన్ అందించిన సింగిల్ ట్రాక్ పాటను ఇటీవల విడుదల చేశామని, మంచి ఆదరణ లభిస్తోందని, ఇదే ఆనందంతో జూలై 24న ఆడియోను విడుదల చేయనున్నామని తెలిపారు.
సామాజిక మాధ్యమంలో ఎక్కువమందిని ఆకర్షించిన సెలబ్రిటీలు ఎవరో తెలుసా! బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్, తమ అందచందాలతో కిర్రెక్కించే తార సన్నీలియోన్. ఈమాట వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది నిజం. నెటిజన్లు ఎక్కువగా సెర్చ్చేస్తున్న ఫొటోలు సల్మాన్ఖాన్, సన్నీలియోన్లవే అత్యధికంగా ఉండడం విశేషం. అందుకే గూగుల్ సెర్చ్ వీరిద్దరిని అత్యధికులు ఇష్టపడుతున్న సెలబ్రిటీలుగా గుర్తించింది.
ఎన్టీఆర్ కథానాయకుడిగా మైత్రి మూవీ సంస్థ పతాకంపై కొరటాల శివ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, మలయాళ నటుడు మోహన్లాల్ ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ఈనెల 22న విడుదల కానున్న రజనీకాంత్ తాజా చిత్రం కబాలీపై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమాను పైరసీని రక్షించాలని, ఇంటర్నెట్లో ఆ చిత్రం ప్రసారం లేదా డౌన్లోడ్ జరగకుండా చూడాలని కబాలీ చిత్ర నిర్మాత కలైపులి ఎన్ థాను మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కాగా దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నిర్మాతకు అనుకూలంగా స్పందించింది.
సాయి ధరమ్తేజ్, లరిస్సాబోన్సీ, మన్నార్చోప్రా ప్రధాన తారాగణంగా సునీల్రెడ్డి దర్శకత్వంలో సి.రోహిణ్రెడ్డి రూపొందించిన చిత్రం ‘తిక్క’. శ్రీ వేంకటేశ్వరా మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన చివరి పాటను లడఖ్లో చిత్రీకరించి సినిమాను పూర్తిచేశారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ను ఈనెల 20న విడుదల చేయనున్నారు.
కామెడీ హీరో అల్లరి నరేష్, కామెడీ దర్శకుడు జి.నాగేశ్వర్రెడ్డి కలయికలో గతంలో వచ్చిన ‘సీమశాస్ర్తీ’, ‘సీమటపాకాయ్’ చిత్రాల స్థాయిలో రూపొందుతున్న మరో చిత్రం ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’. ఈ చిత్రానికి నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్. శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర పతాకంపై రూపొందిస్తున్నారు. సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుంతోంది.
సునీల్, మన్నార్చోప్రా జంటగా ఆర్.పి.ఎ క్రియేషన్స్ పతాకంపై వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఆర్.సుదర్శన్ రెడ్డి రూపొందించిన చిత్రం ‘జక్కన్న’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, సునీల్ నటించిన ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా జక్కన్న రూపొందిందని, హీరో కామెడీ టైమింగ్కి దర్శకుడు రాసిన సీన్లకి థియేటర్లలో క్లాప్స్ పడతాయని తెలిపారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్, నవీన్ చంద్ర (అందాల రాక్షసి ఫేం) కధానాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇ.సత్తిబాబు దర్శకత్వంలో పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఈనెల 18 నుండి శరవేగంగా సాగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రాధామోహన్ మాట్లడుతూ, ప్రేక్షకులకు వందశాతం వినోదాన్ని అందించే ఈ చిత్రంలో ప్రతి పాత్రా నవ్విస్తుందని తెలిపారు.
నాగరాజు తలారి స్వీయ దర్శకత్వంలో జూలే ఫిలింస్ పతాకంపై జె.వి.నాయుడు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘బిట్రగుంట’ (ది బిగినింగ్). మురళీధర్రెడ్డి, ఇషిక యువ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.
చూడటానికి కుందనపు బొమ్మలా వుంటుంది కాథరీన్. ‘సరైనోడు’, ‘రుద్రమదేవి’ చిత్రాల్లో మంచి నటనే ప్రదర్శించింది. అయినాకానీ ఆమెకు క్రెడిట్ రాలేదు. దుబాయ్లో పుట్టిన ఈ చిన్నది దక్షిణాది చిత్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చింది. తొలి చిత్రం ‘చమ్మక్ చల్లో’తో ప్రేక్షకులను ఆకట్టుకున్నా, అల్లు అర్జున్తో చేసిన ‘ఇద్దరమ్మాయిలతో’ టాలీవుడ్ను ఆకర్షించింది.