S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో సూపర్స్టార్ రజనీకాంత్ నటిస్తున్న రోబో-2 చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూళ్లను పూర్తిచేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యాడని, దాంతో సినిమా ఆగిపోయిందనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారానికి తెర దింపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు నిర్మాతలు. ఈ సినిమా ఆగిపోలేదని, ఆగస్టు నుంచి తదుపరి షెడ్యూల్ని మొదలుపెడతామని లైకా ప్రొడక్షన్స్ అధినేతలు తెలిపారు.
గోపీనాధ్, విష్ణుప్రియ జంటగా బిఆర్ఎస్ఐ పతాకంపై పోల్కంపల్లి నరేందర్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ట్వంటీఫస్ట్ సెంచరీ లవ్’. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ, ఇటీవల విడుదల చేసిన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని, ఆర్కె స్టూడియోస్ ద్వారా ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
సాధారణంగా సినిమా రంగంలో హీరోల మధ్య ఎలాంటి పోటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక హీరోను మించి మరో హీరో భారీ వసూళ్లు సాధించాలని టాప్ హీరోగా ఎదగాలని ప్రయత్నం చేస్తుంటాడు. పర్సనల్గా పోటీ లేకున్నా కూడా ప్రొఫెషనల్గా గట్టి పోటీయే వుంటుంది. ఇక అభిమానుల్లో అయితే తమ హీరో గొప్పవాడంటే తమ హీరోనే గొప్పవాడంటూ నానా రభస చేయడం పరిపాటి. ఇప్పటివరకు గిరిగీసుకున్న హీరోలు ఇప్పుడు హద్దులను చెరిపేసే ప్రయత్నంలో ఉన్నారు.
మంచు లక్ష్మీప్రసన్న ముఖ్య పాత్రలో కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో ఉద్భవ్ ప్రొడక్షన్స్ పతాకంపై వేళ్ల వౌనిక చంద్రశేఖర్, ఉమ లక్ష్మీనరసింహ నిర్మిస్తున్న చిత్రం ‘లక్ష్మీబాంబ్’. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేశారు. ‘కామెడీ థ్రిల్లర్గా సరికొత్త కానె్సప్ట్లో తెరకెక్కుతున్న చిత్రమిది. మంచు లక్ష్మి జడ్జి పాత్రలో నటిస్తున్నారు.
ప్రముఖ దర్శకుడు స్పీల్బర్గ్ దర్శకత్వంలో వాల్ట్ డిస్నీ బ్యానర్పై తెరకెక్కిన ‘బిఎఫ్జి’ చిత్రాన్ని తెలుగులో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, యాంబ్లిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై బిఎఫ్జి పేరుతో విడుదల చేస్తున్నారు.
‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్ ఇమేజ్ని స్వంతం చేసుకున్నాడు ప్రభాస్. ప్రస్తుతం ‘బాహుబలి-2’ చిత్రంలో నటిస్తున్న ఆయన, త్వరలోనే తన తదుపరి చిత్రంలో నటించే ప్రయత్నాల్లో వున్నాడు. ప్రభాస్తో సినిమా చేయడానికి దర్శకుడు సుజిత్ రెండేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ‘రన్ రాజా రన్’ విజయంతో ఫాంలోకి వచ్చిన సుజిత్, ఇప్పటికే ప్రభాస్కు కథ చెప్పి ఒప్పించాడట.
‘బాహుబలి’ సినిమాతో భల్లాలదేవుడుగా విశేషమైన ఖ్యాతిని సంపాదించుకున్న రానా దగ్గుపాటి హీరోగా, తేజ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్, నిత్యామీనన్, సమంత ముఖ్యపాత్రల్లో కొరటాల శివ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ పతాకంపై తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ చిత్రం టాకీ దాదాపు పూర్తిచేసుకుంది. ఇటీవలే విడదలైన ఫస్ట్లుక్ టీజర్కు విశేషమైన స్పందన లభిస్తోంది. కేవలం 30 గంటల్లో 20 లక్షలకుమందికిపైగా వీక్షించారు. దాంతో ఈ సినిమాపై మరిన్ని భారీ అంచనాలు నెలకొన్నాయి. క్లైమాక్స్తోపాటు రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది.
నీరజ్ శ్యామ్, సాయికుమార్, నేహా సక్సేనా, దిశ ప్రముఖ పాత్రల్లో సంజీవ్ మేగోటి స్వీయ దర్శకత్వంలో యశశ్విని ఎంటర్టైన్మెంట్ పతాకంపై వంగమూరి శేషగిరిరావు సమర్పణలో రూపొందిన చిత్రం ‘దండు’.
అంజలి టైటిల్ పాత్రలో ‘పిల్లజమీందార్’ ఫేం అశోక్ దర్శకత్వంలో శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై గంగపట్నం శ్రీ్ధర్, రెహమాన్ నిర్మిస్తున్న చిత్రం ‘చిత్రాంగద’. ప్రస్తుతం అమెరికాలో పోస్ట్ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమైన సందర్భంగా నిర్మాతలు వివరాలు తెలియజేశారు. ‘ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని హారిజాంటల్ థ్రిల్లర్ కామెడీ జోనర్లో రూపొందుతున్న సినిమా ఇది.