S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సాయిధరమ్ తేజ్, లారిస్సా బొనేసి జంటగా శ్రీ వెంకటేశ్వరా మూవీ మేకర్స్ బ్యానర్పై సునీల్రెడ్డి దర్శకత్వంలో సి.రోహిన్కుమార్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘తిక్క’. ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ శనివారం హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్లో జరిగింది. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, ‘దర్శకుడు సునీల్కు తన టాలెంట్ ఏంటో నిరూపించుకోవాలన్న తిక్క ఉంది. సాయిధరమ్ తేజ్ ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టాడు.
‘రోజులు మారాయి’ రెండు జంటల ప్రేమ కథతో సాగుతుంది. సోషల్ మీడియావల్ల యువతలో ఎలాంటి మార్పు వచ్చిందనే అంశంతో ఈ సినిమా సాగుతుందని నిర్మాత దిల్రాజు తెలిపారు. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్, గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై మురళీకృష్ణ ముడిదాని దర్శకత్వంలో జి.శ్రీనివాసరావు రూపొందించిన ‘రోజులు మారాయి’ జూలై 1న విడుదలకు సిద్ధమైంది.
ఆది హీరోగా శ్రీఐశ్వర్య లక్ష్మి మూవీస్ పతాకంపై రామ్ తాళ్ళూరి సమర్పణలో వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి నిర్మిస్తున్న చిత్రం ‘చుట్టాలబ్బాయి’. దీని టీజర్ను శనివారం హైద్రాబాద్లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా హీరో ఆది మాట్లాడుతూ,‘కన్ఫ్యూజన్ కామెడీ జోనర్లో ఈ చిత్రాన్ని పూర్తిస్థాయి ఎంటర్టైనింగ్గా రూపొందించాం. వీరబాబు చక్కగా డైరెక్ట్చేశారు.
సర్వేశ్వరా మూవీస్ పతాకంపై జొన్నలగడ్డ శివ దర్శకత్వంలో గుద్దేటి బసవప్ప రూపొందిస్తున్న చిత్రం ‘పోలీస్ పవర్’. శివ, నందిని కపూర్, ధరణి ప్రధాన తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది.
వరుస విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రొడ్యూసర్ దిల్రాజు త్వరలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తారు. ఏడు సంవత్సరాల తరువాత అల్లు అర్జున్, దిల్రాజు కాంబినేషన్లో రూపొందే ఈ చిత్రం షూటింగ్ ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో ప్రారంభం అవుతుంది.
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్లో జరుగుతున్న 17వ ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ (ఐఫా) అవార్డుల ప్రదానోత్సవం సంరంభం మొదలైంది. బాలీవుడ్కు చెందిన 150మంది ప్రముఖులు హాజరైన ఈ వేడుకకు స్పెయిన్కు చెందిన సినీ,వ్యాపారరంగ ప్రముఖులూ తోడయ్యారు. గురువారం లాంఛనంగా మొదలైన ఐఫా వేడుకలో తొలిరోజంతా సదస్సులు, చర్చాగోష్టులు జరిగాయి. శుక్రవారం ఫిక్కి-స్పెయిన్ చాంబర్ ఆఫ్ కామర్స్ సంయుక్తంగా పలు అంశాలపై చర్చించాయి.
‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఊపిరి’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్న ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తాజాగా నటిస్తున్న చిత్రానికి ‘ఓం నమో వెంకటేశాయ’ అనే టైటిల్ను ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కే ఈ భక్తిరస చిత్రం నేటి నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.
తెలుగులో కమర్షియల్ సినిమాలే వస్తాయి, ప్రయోగాలు చేయరు అనే అపవాదుని దూరంచేసే పనిలో పడ్డారు తెలుగు హీరోలు, దర్శకులు. ఇప్పటికే ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. లేటెస్ట్గా ఓ సినిమాలో అంధుడి పాత్రలో నటించేందుకు రెడీ అయ్యాడు రామ్. అన్నిరకాల కమర్షియల్ ఎలిమెంట్స్తో తెరకెక్కే ఈ సినిమాలో తాను అంధుడి పాత్ర పోషిస్తున్నానని ట్విట్టర్లో పేర్కొన్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు అనిల్రావిపూడి.
హీరో హీరోయిన్లుగా హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సూర్య-జ్యోతిక కలిసి మళ్లీ నటించనున్నారు. 2006లో వచ్చిన ఓ తమిళ చిత్రం తరువాత వారు మళ్లీ కలిసి నటించలేదు. మళ్లీ దాదాపు పదేళ్ల తరువాత ఈ జోడీ తెరపై కనువిందు చేయనుంది. గత సంవత్సరం 30 వయదినిలె చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక, తాజాగా తన భర్త సూర్య రూపొందించనున్న చిత్రంలో నటించనుంది.
మెగా వారసురాలు నిహారిక హీరోయన్గా పరిచయమవుతూ రూపొందిన ‘ఒక మనసు’ చిత్రం శుక్రవారం విడుదలై మంచి టాక్ తెచ్చుకున్న సందర్భంగా అభిమానులతో కలిసి చిరంజీవి బ్లడ్ బ్యాంకులో విజయోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిహారిక కేక్ కట్ చేసి అభిమానులను అలరించారు.